India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కావలి పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్కు RDO వంశీకృష్ణ నోటీసులు జారీచేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రానికి ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ థియేటర్ యాజమాన్యం 24వ తేదీ కూడా అధిక రేట్లకు విక్రయించడంతో కావలికి చెందిన వెంకటేశ్వరరావుతోపాటు మరికొంతమంది ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం దీనిపై వివరణ ఇవ్వాలని RDO ఆదేశించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన 117 నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు మోడల్ స్కూల్ ప్రాంగణంలో క్విజ్, ఎస్సే రైటింగ్ , వక్తృత్వ పోటీలను నిర్వహించారు. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ విద్యార్దులను అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు.
ఉదయగిరి మండలం బిజంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువ వరి కోత మిషన్లో ఇరుక్కుని పోయి ఉండగా రైతులు గమనించి చంపేశారు. సమీపంలోనే పాఠశాల ఉండడం విద్యార్థులు తరచుగా అటు ఇటు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ రేపు గూడూరు డివిజన్ కు రానున్నారు. చిల్లకూరు సాగరమాల జాతీయ రహదారి package-4 నిర్మాణ పనులు పరిశీలించుటకు రానున్నట్లు తెలుస్తోంది. సాగరమాల జాతీయ రహదారి నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎంతమేరకు జరిగాయి అన్న వివరాలు తెలుసుకునేందుకు రానున్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో ఆన్లైన్ మోసాలు రోజుకొక కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తాజాగా ఉదయగిరిలో నకిలీ ఫోన్పే యాప్తో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో రూ.4 వేలకుపైగా మద్యం కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా నగదు పంపించాడు. అయితే డబ్బులు రాకపోవడంతో అనుమానించిన దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
నెల్లూరు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ రకాల ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాలను విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజమన్నార్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను spsrnellore.ap.gov.in అనే వెబ్సైట్లో పొందుపరిచారన్నారు. మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ ద్వారా తెలియపరచాలన్నారు.
న్యూఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ లింగుంటి వెంకట నరసయ్య (41) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామానికి చెందినవారు. ఇటీవల సంక్రాంతి పండగకు వచ్చిన ఆయన తిరిగి ఈనెల 20న న్యూఢిల్లీకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. జవాన్ మృతితో గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.
ప్రతిష్ఠాత్మకమైన జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్టిఎస్ఇ) స్కాలర్షిప్ను పునరుద్ధరించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి లేఖ రాశారు. ఎన్టీఎస్ఈ స్కాలర్షిప్ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
నారా లోకేశ్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించనున్నారు. లోకేశ్ 42వ జన్మదిన సందర్భంగా లోకేశ్ చిత్రపటంతో 42 కేజీల కేక్ తయారు చేయించి రేపు కట్టింగ్ సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొననున్నారు.
నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కావలిలో మరో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ నాయకుడిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన పోలీసులపై అనుచితంగా మాట్లాడారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో ఇప్పటికే వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు, కావలి ప్రాంతాలలో కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు పది కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.