Nellore

News July 24, 2024

సంగం హౌసింగ్ ఏఈ కరీముల్లా సస్పెండ్

image

సంగం హౌసింగ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ కరీముల్లా జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో సిమెంట్, స్టీల్ అక్రమాల పై విచారణ జరిపిన అధికారులు అక్రమాలు జరిగాయని నిర్ధారించి సస్పెండ్ చేశారు. 1829 బ్యాగుల సిమెంట్, 17495.40 కేజీ స్టీల్ గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ ఏఈగా ముక్తార్ బాషాకి డిప్యూటీ ఇంజినీర్ అప్పగించారు.

News July 24, 2024

నెల్లూరు: సైజు తగ్గిన అంగన్వాడి కోడిగుడ్డు

image

జిల్లాలో అంగన్వాడీలకు అందించే గుడ్డు సైజు తగ్గిపోయింది. దీంతోపాటు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యంలో ఎర్ర రెక్కల పురుగులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులో 2934 అంగన్వాడీ కేంద్రాల్లో జులై మాసానికి సంబంధించి మూడో విడతలో వచ్చిన కోడి గుడ్డి సైజు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా కేవలం 30 గ్రాములు లోపు ఉండటం కొసమెరుపు. సంబంధిత శాఖ అధికారిణి వివరణ కోరగా కాంట్రాక్టర్‌తో మాట్లాడుతానని తెలిపారు.

News July 24, 2024

తిరుపతి: బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్

image

తిరుపతి జిల్లా నూతన సంయుక్త కలెక్టర్‌గా శుభం బన్సల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికలకు ముందు ఆయన జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పని చేస్తుండగా ఎన్నికల నిబంధనల్లో భాగంగా ఆయన సీతంపేట ITDA ప్రాజెక్టు అధికారిగా బదిలీ అయ్యారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంగా తిరిగి తిరుపతి జిల్లాకు బదిలీ అయ్యారు.

News July 24, 2024

నెల్లూరు: రోజు గ్రామ సచివాలయంలో అర్జీలు ఇవ్వొచ్చు

image

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి రోజు గ్రామ సచివాలయంలో అర్జీల ను ఇవ్వొచని కలెక్టర్ కార్యాలయం వారు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం అర్జీలు పరిష్కార వేదికలో ఇవ్వవచ్చు అని పేర్కొన్నారు. అంతే కాకుండా మీ కోసం వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్‌తో తోఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు. ఎక్కడ అర్జీ ఇచ్చినా దాని ప్రగతి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు అని ప్రజలకు సూచించారు.

News July 24, 2024

రెండు లెప్రసీ కేసులు గుర్తించిన జిల్లా అధికారి

image

రాపూరు మండలంలో రెండు లెప్రసీ కేసులను జిల్లా లెఫ్రసీ అధికారి డాక్టర్ సురేంద్ర బాబు గుర్తించారు. బుధవారం ఆయన రాపూరులోని తూర్పు ఆగర్తకట్ట ప్రాంతాన్ని పరిశీలించి ఒక అనుమాన కేసును లెప్రసీ కేసుగా నిర్ధారణ చేశారు. అనంతరం వెలుగోను గ్రామంలో మరోక లెఫ్రసీ కేసును గుర్తించారు. తదుపరి వేపినాపి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు.

News July 24, 2024

నాయుడుపేట ఐదు వాటర్ ప్లాంట్లకు నోటీసులు

image

వాటర్ ప్యాకెట్లను తయారు చేయకుండా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వాటర్ ప్లాంట్లకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జనార్ధనరెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాటర్ ప్లాంట్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగిందని, వాటర్ ప్యాకెట్లు ఎట్టి పరిస్థితుల్లో తయారు చేయకూడదని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా చేసే ప్లాంట్స్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

News July 24, 2024

మంత్రి లోకేశ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

image

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఆత్మకూరు మాజీ శాసనసభ్యుడు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, డాక్టర్ కొమ్మి ప్రదీప్ కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు లక్ష్మయ్య నాయుడు తెలియజేశారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

News July 24, 2024

సూళ్లూరుపేట RDO పోస్టుకు డిమాండ్

image

ఆంధ్ర, TN సరిహద్దులోని సూళ్లూరుపేట RDOగా వచ్చేందుకు కొందరు పోటీపడుతున్నారు. జిల్లా పునర్విభజనకు ముందు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 6 మండలాలకే ఈ RDO కార్యాలయం ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లాకేంద్రంగా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్‌లో సత్యవేడు, వరదయ్యపాళెం, BN కండ్రిగ మండలాలను విలీనం చేశారు. డివిజన్ పరిధి 9 మండలాలకు విస్తరించడంతో RDOగా వచ్చేందుకు నలుగురు ఆశావాహులు ఉన్నట్లు తెలుస్తోంది.

News July 24, 2024

నెల్లూరు జిల్లాలో 34 మంది తహశీల్దార్లు బదిలీలు

image

నెల్లూరు జిల్లాలో మొత్తం 34 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు వీరిని ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లా నుంచి నెల్లూరుకు మార్చారు. ఎన్నికలు ముగియడం సాధారణ పరిస్థితి రావడంతో తిరిగి తహశీల్దార్లను ప్రకాశం, గుంటూరులోని సొంత మండలాలకు బదిలీ చేశారు.

News July 24, 2024

నెల్లూరు: ఫలితాల కోసం వీఎస్‌యూ విద్యార్థుల ఎదురుచూపులు

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలోని విద్యార్థులు 4వ సెమిస్టర్ పరీక్షలు రాసి 3 నెలలు అవుతుంది. వచ్చే నెల 22వ తేదీన ఐసెట్ కౌన్సిలింగ్ చివరి తేదీ. అయినప్పటికీ ఇంకా 4వ సెమిస్టర్ రిజల్ట్స్ రాకపోవడంతో.. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షా ఫలితాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు యూనివర్సిటీ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.