Nellore

News September 20, 2024

నేటి నుంచి మంత్రి ఆనం నెల్లూరు జిల్లా పర్యటన

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 20న చేజర్ల మండలం మాముడూరు, 21 సంగం మండలం జండాదిబ్బ, 22న ఏఎస్పేట హస్నాపురం, 23న ఆత్మకూరు మున్సిపాలిటీ పేరారెడ్డిపల్లి, 24న అనంతసాగరం, లింగంగుంట, 25న మర్రిపాడు, తిక్కవరం, 26న ఆత్మకూరు, చెర్లో ఎడవల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు.

News September 20, 2024

స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ తయారికి యాక్షన్ ప్లాన్: కలెక్టర్

image

స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో జిల్లాలోని వృద్ధి కారకాలను (గ్రోత్ ఇంజన్లను) గుర్తించి విజన్ యాక్షన్ ప్లాన్-2047ను అక్టోబర్ 15 లోపు తయారు చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ తయారీపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News September 19, 2024

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్‌ కమిటీ సభ్యులకు వివరించారు.

News September 19, 2024

నెల్లూరు: 15 మంది YCP కార్పొరేటర్లు TDPలో చేరిక

image

నెల్లూరు నగరానికి చెందిన 15 మంది YCP కార్పొరేటర్లు, నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో TDPలో చేరారు. వీరికి నారా లోకేశ్ పసుపు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.

News September 19, 2024

Way2News: నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

నెల్లూరు జిల్లాలోని పలు మండలాలకు Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. ఏదైనా ఛానల్, పేపర్‌లో పనిచేస్తున్నవారు, గతంలో ఏదైనా ఛానల్, పేపర్‌లో పని చేసి మానేసిన వారు అర్హులు. ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి.

News September 19, 2024

నెల్లూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజiల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ MLA పనితీరుపై మీ కామెంట్..

News September 19, 2024

మంత్రి నారాయణతో వైసీపీ కార్పొరేటర్లు భేటీ

image

నెల్లూరులోని వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. గురువారం ఉదయం నారాయణ సన్నిహితుడు విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో 15,16,47 డివిజన్ల వైసీపీ కార్పొరేటర్లు.. గణేశం వెంకటేశ్వర్లురెడ్డి, వేనాటి శ్రీకాంత్, రామకృష్ణ మంత్రి నారాయణతో భేటీ అయ్యారు. వీరు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

News September 19, 2024

నెల్లూరు: ఇంట్లో ఉక్కపోత.. రోడ్డుపై దోమలు

image

నెల్లూరు రూరల్ తెలుగుగంగా కాలనీ ఎంజీబీ లేవుట్ సమ్మర్ స్టోరేజీ రోడ్డు ప్రాంతంలో తరచూ పవర్ కట్ అవుతుంది. మంగళవారం అర్థరాత్రి పోయిన కరెంట్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చారు. మళ్లీ రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి కావొస్తున్నా కరెంటు రాకపోవడంతో పిల్లలు, వృద్ధులు దోమలతో ఇబ్బందులు పడ్డారు.

News September 19, 2024

నెల్లూరు: నవంబర్ 10 నుంచి అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ అన్నారు. కలెక్టరేట్‌లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నన్ పునీత్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు, JC అదితి సింగ్, రిక్రూట్మెంట్ అధికారితో సమావేశమయ్యారు. కడపలో ఎంపికలు జరుగుతాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల అభ్యర్థులు హాజరుకావాలని అన్నారు.

News September 19, 2024

నెల్లూరు: భార్యతో గొడవ.. భర్త సూసైడ్

image

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పెళ్లకూరు మండలంలో చోటుచేసుకుంది. సీఐ సంగమేశ్వరరావు వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో వారు ఫొన్లో రోజూ గొడవపడేవారు. రాజుపాళెం అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ మునుస్వామి తెలిపారు.