Nellore

News January 11, 2025

ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తాం: కలెక్టర్

image

నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వెంటనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రాంతీయ రవాణా ఆథారిటీ సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే పర్మిట్ ఉన్న రూట్లు, నూతన రూట్లలో సిటీ బస్లు తిప్పుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు అనుమతుల కోసం చేసిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.

News January 10, 2025

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ. 10 లక్షల సాయం

image

తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు సభ్యులు వ్యక్తిగతంగా ఆర్థికసాయం చేశారు. కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ. 10లక్షలు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా సుచిత్ర ఎల్ల రూ.10 లక్షలు, ఎంఎస్ రాజు రూ.3 లక్షలు తమ వంతు సాయం చేశారు.

News January 10, 2025

ఆత్మకూరులో రోడ్డు ప్రమాదం.. 10th Class విద్యార్థి మృతి

image

ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ (15) పదో తరగతి చదువుతున్నాడు. బైక్‌పై ఆత్మకూరుకు వెళ్తున్న జశ్వంత్‌ను అప్పారావుపాలెం నుంచి ఇసుకలోడుతో ఆత్మకూరుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి కింద పడి ఘటనా స్థలంలోనే జశ్వంత్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

News January 9, 2025

రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొనవద్దు: కలెక్టర్ 

image

రెడ్‌క్రాస్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్‌, మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆనంద్‌ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో రెడ్‌క్రాస్‌ మేనేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలను ఉల్లంఘించవద్దన్నారు. 

News January 8, 2025

జాతీయ కుష్టు వ్యాధి నివారణ పోస్టర్ ఆవిష్కరణ 

image

జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆనంద్ బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి నివారణకు మరింత ప్రచారం చేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

News January 8, 2025

ఆ రోజుల్లో రూ.575కే నెల్లూరు నుంచి శ్రీలంకకు టూర్

image

ఈ రోజుల్లో ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లినా కనీసం రూ.2 వేలు దాటుతోంది. ఓ బ్రాండెడ్ షర్ట్ ధర రూ.800పైనే ఉంటోంది. అయితే రూ.500కు శ్రీలంక వెళ్లొచ్చు అంటే మీరు నమ్మగలరా.. నిజమేనండి. కాకపోతే ఇది 50 ఏళ్లనాటి మాట. 1974లో ఓ ట్రావెల్ ఏజెన్సీ నెల్లూరు నుంచి రూ.575కే ఏకంగా 15 రోజుల పాటూ శ్రీలంకకు టూర్ ప్యాకేజ్ ఆఫర్ చేసింది. ఇందుకు సంబందించి ఓ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ కామెంట్ చెప్పండి.

News January 8, 2025

నేడు నెల్లూరు జిల్లా నాయకులతో వైయస్ జగన్ భేటీ

image

నేడు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలతో YCP అధినేత మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ‘X’ లో పోస్టు చేసింది. నెల్లూరుకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

News January 7, 2025

రేపు నెల్లూరు జల్లా నాయకులతో వైయస్ జగన్ భేటీ

image

రేపు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలతో YCP అధినేత మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ‘X’ లో పోస్టు చేసింది. నెల్లూరుకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

News January 7, 2025

కోడిపందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టండి : కలెక్టర్

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా కోడిపందాలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్‌లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జంతు హింస నివారణ చట్టం అమలుపై ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కోడి పందాలు జరగకుండా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News January 7, 2025

వేదాయపాళెంలో కాకాణిపై కేసు 

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య ఓ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కాకాణి ప్రెస్‌మీట్ నిర్వహించి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన ఉప్పు పద్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 27న కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.