India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుమారిపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుమారి ఎంపీ విజయసాయి రెడ్డికి అనుకూలంగా పోస్టులు పెట్టారని అన్నారు.
గూడూరులో ఇంటర్ యువతిపై లైంగిక దాడి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఇంటర్ చదివే ఓ అమ్మాయి కాలేజీకి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా గూడూరు అశోక్ నగర్కు చెందిన వినయ్ కుమార్ యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నాడు. గాంధీనగర్లోని ఓ ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో అసలు విషయం తెలిసింది. DSP సూర్యనారాయణ రెడ్డి విచారణ చేస్తున్నారు.
దొరవారిసత్రం మండలం నెలబల్లి అడవిలో ఇవాళ దారుణ హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సందర్శించారు. పోస్టు మార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించిన మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసన్ రెడ్డి, సీఐలు జగన్మోహన్, శ్రీనివాసులు ఉన్నారు.
నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శర్మద ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టారు.
దొరవారి సత్రం మండలం నేషనల్ హైవే నెలబల్లి రైస్ మిల్ పక్కనే ఉన్న అడవిలో బాలిక మృతదేహం లభ్యమైంది. మృతురాలు నెలబల్లి రైస్ మిల్లులో వంట మాస్టర్గా పనిచేస్తున్న కూతురుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. రైస్ మిల్లులో పనిచేసే కార్మికులను, చుట్టు పక్కలవారిని విచారించారు.
నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండగ ప్రారంభమైంది. తొలి రోజు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. బారాషాహిద్లను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా విచ్చేసిన భక్తులతో దర్గా పరిసరాలు జన సందడిగా మారిపోయాయి. ఈ ఏడాది సుమారు పది లక్షలు పైగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
తడలో యువకుడిపై దాడి కలకలం రేపింది. తునికి చెందిన సతీశ్ కుమార్ శ్రీసిటీలో పనిచేస్తున్నాడు. కాకినాడకు చెందిన మోనికకు పదేళ్ల క్రితం రవీంద్రబాబుతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడిపోయిన ఆమె తడకు వచ్చి 4 నెలలుగా సతీశ్తో సహజీవనం చేస్తోంది. సతీశ్ డ్యూటీకి వెళ్తుండగా ఒకరు ఇనుప రాడ్తో దాడి చేసి పారిపోయాడు. అతని ముఖ కవలికల ఆధారంగా రవీంద్రబాబునే దాడి చేశాడని మోనిక అనుమానిస్తోంది.
వాహన రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. • చెన్నై, బెంగళూరు, తిరుపతి నుంచి గూడూరు మీదుగా వచ్చే, పొదలకూరు రోడ్డు నుంచి వచ్చే బస్సులను అయ్యప్పగుడి సెంటర్ మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి, బీవీ నగర్, రామలింగాపురం, మార్కెట్ ఆర్టీసీకి మళ్లించారు. జొన్నవాడ వైపు నుంచి వచ్చే బస్సులను పుత్తా ఎస్టేట్, సెయింట్ జోసెఫ్ స్కూల్ మీదుగా మళ్లించారు. కేవీర్ పెట్రోల్ బంక్ నుంచి వెళ్లడానికి అనుమతి లేదు.
బెంగళూరు, చెన్నై వయా గూడూరు నుంచి వచ్చేవి జిల్లా ఆసుపత్రి ప్రాంగణం, సుబ్బారెడ్డి మైదానం దగ్గర నిలపాలి. కావలి వైపు వచ్చేవారు ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో కార్లు, ఆటోలు నిలపాలి. కడప నుంచి జొన్నవాడ మీది వాహనాలకు డీఎస్ఎన్ ఫంక్షన్ హాల్ పక్కన, ఇరుకళల పరమేశ్వరీ దేవస్థానం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం కేటాయించారు. రాపూరు మీదుగా వచ్చేవి తెలుగుంగ కాలనీ, పొదలకూరు రోడ్డులోని జడ్పీ బాలికల పాఠశాలలో నిలపాలి.
రైతులకు 2024-25 పంట కాలానికి సంబంధించి పొగాకు విత్తనాలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. సొంత నారుమడి పెట్టుకునే రైతులకు సీటీఆర్ రాజమండ్రి, కమర్షియల్ నారుమడి కోసం సీటీఆర్ కందుకూరులో పొగాకు విత్త నారను సరఫరా చేస్తామన్నారు. ఒక బ్యారన్ కు 500 గ్రాములు రూ.600 చొప్పున కమర్షియల్ నారుమడికి కిలో రూ.1,8000 విక్రయిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.