Nellore

News March 10, 2026

ఎందుకొస్తున్నారు.. ఏం చేస్తున్నారు: నెల్లూరు కలెక్టర్

image

ఎందుకు వస్తున్నారు? ఏం చేస్తున్నారంటూ కలెక్టరేట్ అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రశ్నించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలోని తిక్కన ప్రాంగణంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన కలెక్టరేట్‌లోని పలు సెక్షన్ల అధికారులను పిలిపించి ఆయన క్లాస్ పీకారు. ప్రజల నుంచి అర్జీలు తీసుకుని పరిశీలించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే వారం నుంచి బయట కూర్చుని ప్రజల అర్జీలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 10, 2026

ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగులు, GPS రవాణా వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. తేమ శాతం, తూకాల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.

News March 10, 2026

ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగులు, GPS రవాణా వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. తేమ శాతం, తూకాల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.

News March 10, 2026

ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగులు, GPS రవాణా వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. తేమ శాతం, తూకాల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.

News March 9, 2026

నెల్లూరులో విషాదం.. బాలుడి అక్కడికక్కడే మృతి

image

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలుడు బైక్‌ని తీసుకుని స్నేహితుని కలిసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్‌లోని కలివెలపాలెం గ్రామానికి చెందిన వివాన్ (16) ఇంట్లో ఎవరు లేకపోవడంతో బైక్‌ని తీసుకొని నెల్లూరు వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొని తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 9, 2026

ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పిన నెల్లూరు కమిషనర్

image

నెల్లూరు నగరపాలక కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం సమస్యల పరిష్కార వేదిక జరిగింది. మేయర్ సుజాత అశోక్, కమిషనర్ వైఓ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరూ 300 చ.అ ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 9, 2026

కావలి: చదివింది 5th.. రూ.150 కోట్లకు కుచ్చుటోపి.!

image

చదివింది 5th. రియల్ ఎస్టేట్‌లో అంచెలంచెలుగా ఎదిగి HYDలో త్రిపుర కన్‌స్ట్రక్షన్ ప్రారంభించాడు. ప్రజల నుంచి ప్లాట్ల పేరుతో భారీగా వసూలు చేశాడు. ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసినా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు కావలికి చెందిన పసుపులేటి సుధాకర్. ప్రజలు నిలదీయడంతో ఆయన బండారం బయటపడింది. అపార్ట్‌మెంట్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు.

News March 9, 2026

దుత్తలూరులో రక్షణ రంగ పరిశ్రమ

image

దుత్తలూరు పరిసర ప్రాంతంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశానికి కీలక వ్యవస్థగా ఉన్న రక్షణ రంగం ముడి సరుకు తయారీ ప్రాంతంగా దుత్తలూరు కేంద్రం కానున్నడంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు మరింత ఆశలు చిగురించాయి. ప్రభుత్వం జీవో నెం.41ను సైతం విడుదల చేసింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

News March 9, 2026

CI రవి నాయక్, SI ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్, ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పొక్సో కేసు ముద్దాయి విషయంలో అలసత్వం వహించారనే ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే సర్కిల్ పరిధిలోని ఎస్ఐ, సీఐ సస్పెండ్‌తో కలకలం రేగింది.

News March 8, 2026

నాయుడుపేట: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

image

పెళ్లకూరు వద్ద నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై అదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూల్‌డ్రింక్స్ లారీని బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బోడెద్దుల భరత్ (20) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముని కుమార్‌ను 108 అంబులెన్స్‌లో శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.