India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఇష్టానుసారంగా చార్జీల పెంపుతో ప్రయాణికులకు ప్రయాణం మోత మోగిస్తున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణీకులు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు కార్యక్రమం మొదలుపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు వంటి పలు నగరాలకు జిల్లా నుంచి రోజు 150 బస్సులు వరకు తిరుగుతూంటాయి. రెండు మూడు రెట్లు ధరలు పెంపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.
బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న నెల్లూరు వాసులు సంక్రాంతికి తమ స్వగ్రామాలకు రానున్నారు. అక్కడ HMPV కేసు నమోదు కావడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ కేసులు లేవని.. కరోనా లాగా ప్రభావం కూడా ఉండదని నెల్లూరు DMHO వి.సుజాత చెప్పారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస సమస్యలుంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్లను సంప్రదించాలని కోరారు. వారం రోజుల్లో సమస్య తగ్గిపోతుందన్నారు.
నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల నాటికి 20,61, 822 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా నిన్న విడుదల చేసిన లిస్ట్ ప్రకారం 19,44,664 మంది ఉన్నారు. 1,17, 158 మంది ఓటర్లు తగ్గిపోయారు. నెల్లూరు జిల్లా ఓటరు జాబితా-2025 ప్రకారం తాజా ఓటర్ల సంఖ్య కింద విధంగా ఉంది.
➤ పురుష ఓటర్లు: 9,51,145
➤ స్త్రీలు: 9,93,309
➤ ఇతరులు: 210 మంది
➤ మొత్తం ఓటర్లు: 19,44,664
ప్రతిరోజూ లక్ష పనిదినాలు లక్ష్యంగా ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఉపాధిహామీ, ఆర్డబ్ల్యుఎస్, హౌసింగ్, పంచాయతీ రాజ్ సీసీ రోడ్ల గ్రౌండింగ్, ఎంఎస్ఎంఈ సర్వే, ఎస్టీలకు ఆధార్కార్డుల జారీ, పిఎం సూర్యఘర్ యోజన పథకం అమలు మొదలైన అంశాలపై అధికారులతో మాట్లాడారు.
➤ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➤ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➤ చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➤ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➤ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్లు నెల్లూరు, గూడూరు జంక్షన్లలో ఆగుతాయి. వీటికి ఇవాళ ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.
నెల్లూరు జిల్లాలో నకిలీ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. జిల్లాలో దాదాపు మూడు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్వే అన్న ఆరోపణల నేపథ్యంలో ఇవాల్టి (సోమవారం) నుంచి వాటి లెక్కను ప్రభుత్వం తేల్చనుంది. పెద్దాస్పత్రిలోని డాక్టర్ల బృందం ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల నుంచి వివరాలను సేకరించి ఆ నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.
భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లేనని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల సందర్భంగా ఉద్ఘాటించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 12వ ద్వైవార్షిక మహాసభల రెండో రోజున ఆయన పాల్గొన్నారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వడం మనందరి బాధ్యతని, మన భవిష్యత్తు తరాలకు భాషా సంప్రదాయాలు అందించాలన్నారు. ఇంగ్లీషు వ్యామోహం వదిలి తెలుగును బతికించుకోవాలన్నారు.
చిట్టమూరు మండలం, ఈశ్వరవాక గిరిజన కాలనీలో డిసెంబర్ 31న మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు శీనయ్యపై శనివారం ఫోక్సో కేసు నమోదు చేసినట్లు గూడూరు డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బయట ఆడుకుంటున్న చిన్న పాపపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. అతనిని కోర్టుకు తరలిస్తామని తెలిపారు.
వైసీపీ నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిడూరుకు చెందిన మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అభివృద్ధికి మన్నెమాల ఎంతో కృషి చేసి చేశారని, గ్రామంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నాడని సన్నిహితులు తెలిపారు. దీంతో అధిష్ఠానం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పదవినిచ్చినట్లుగా నాయకులు తెలిపారు.
కావలిలో ఈ నెల ఒకటో తేదీన అర్పిత బిస్వాస్ అనే మహిళను హత్య చేసిన నౌమౌన్ బిస్వాస్ను అరెస్ట్ చేసినట్లు DSP శ్రీధర్ తెలిపారు. అర్పితను అనుభవించాలనే కోరికతో నిందితుడు ఆమె భర్త శ్రీకాంత్తో కలిసి మందు తాగాడు. శ్రీకాంత్ మత్తులోకి జారుకున్నాక.. పక్క గదిలో నిద్రిస్తున్న అర్పితపై లౌంగిక దాడికి యత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం చనిపోయిన అర్పితను అత్యాచారం చేసినట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.