India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దగదర్తితో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్పోర్ట్లు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.
భర్త మృతితో మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వరికుంటపాడు(M), కనియంపాడులో మంగళవారం చోటుచేసుకుంది. ఇటివల కోడూరు బీచ్ జాన్ బాబు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్ది రోజులకే కర్ణాటకలోని KGFలో బంధువుల వద్ద ఉన్న జాన్ బాబు భార్య తన భర్త మృతితో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో హెయిర్ ఆయిల్ సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డక్కిలిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇటీవల అనారోగ్యంతో సరీనా మృతి చెందిన విషయం తెలిసిందే. విధులు సక్రమంగా నిర్వహించలేదని ప్రిన్సిపల్ శ్రీదేవి , హౌస్ టీచర్ వాణి , ఆరోగ్య కార్యకర్త సునీతలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాల బాలిక మృతిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కలెక్టరుకు నివేదిక పంపడంతో కలెక్టర్ వారిపై చర్యలు తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో జులై 17 నుంచి 21 వరకు రొట్టెల పండుగ జరగనుంది. హిందూ, ముస్లింలనే భేద భావం లేకుండా ఈ రొట్టెల పండుగను ఘనంగా జరుపుకుంటారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ రొట్టె పట్టుకొంటె కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.
నెల్లూరుకు చెందిన విద్యుత్తు శాఖ ఉద్యోగికి జైలుశిక్ష పడింది. కోటమిట్ట నెక్లెస్ రోడ్డు ప్రాంతానికి చెందిన సుధీర్ వద్ద విద్యుత్ సంస్థ ఉద్యోగి పత్తిపాటి కృష్ణ రూ.5 లక్షలు అప్పు తీసుకున్నారు . తిరిగి అప్పు చెల్లించేందుకు చెక్కు ఇచ్చాడు. దానిని సుధీర్ బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యింది. బాధితుడు కోర్టుగా వెళ్లగా.. కృష్ణకు ఏడాది జైలు విధిస్తూ ప్రత్యేక ఎక్సైజ్ కోర్టు జడ్జి సుయోధన్ తీర్పు ఇచ్చారు.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్లో 63, గూడూరు డివిజన్లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం సాయంత్రం బారాషహీద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. దర్గా ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్లో 63, గూడూరు డివిజన్లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
నాయుడుపేట గురుకుల విద్యార్థుల అస్వస్థతపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆరా తీశారు. ఆయన నేరుగా వైద్యులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి విద్యార్థులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డక్కిలి గురుకులంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మరువక ముందే నాయుడుపేట గురుకుల పాఠశాలలో కూడా 70 మందికి పైగా డయేరియాతో ఆసుపత్రుల పాలయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, పర్యవేక్షణ లేకపోవడం కారణాలుగా పేర్కొంటున్నప్పటికీ విద్యార్థులు తిన్న ఆహారం కూడా కలుషితం అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్, ఎమ్మెల్యే విద్యార్థులను, గురుకుల సిబ్బందిని విచారించారు.
Sorry, no posts matched your criteria.