India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కావలిలో ఓ మహిళ <<15037512>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. పోలీసుల కథనం.. కోల్కతాకు చెందిన అర్పిత బిస్వాస్(24) కుటుంబం కావలిలో ఓ చికిత్స కేంద్రం నిర్వహిస్తోంది. వారి బంధువు నయాన్ అనే యువకుడిని హెల్పర్గా పెట్టుకుని ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. అయితే నయాన్ యజమానిపై కన్నేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా అర్పితను ఒప్పించి ఇద్దరూ మద్యం తాగారు. మత్తులోకి జారుకోగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కావలి గాయత్రీ నగర్లోని ఓ ఇంట్లో అర్పిత బిస్వాస్ (24) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికులు వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ ఏడాది క్రితం నుంచి కావలిలో ఓ క్లినిక్ నడుపుతోంది. అక్కడే పనిచేసే యువకుడు హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న కావలి ఒకటో పట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సూర్యతేజ ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ విభాగం సూపరింటెండెంట్ సిద్ధిక్ను మేయర్ పేషీకి, ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యంను హౌసింగ్ ఇన్ఛార్జిగా, లీగల్ సెల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ను ఎస్టాబ్లిష్మెంట్ విభాగానికి బదిలీ చేశారు.
వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ కోసం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నోటిఫికేషన్ జారీ చేశారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కందుకూరు, ఆత్మకూరు, రాపూరు ఆస్పత్రుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉంది. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించి తిరుపతిలో జనవరి 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి టోకెన్లు ఇవ్వనున్నారు. ఆ ఏరియాలు ఇవే..
➤ రామచంద్ర పుష్కరిణి ➤ జీవకోన ZP స్కూల్
➤ ఇందిరా మైదానం ➤ శ్రీనివాసం రెస్ట్ హౌస్
➤ విష్ణునివాసం ➤ 2వ చౌల్ట్రీ
➤ రామానాయుడు హైస్కూల్ బైరాగిపట్టెడ
➤ ఎమ్మార్ పల్లి జడ్పీ స్కూల్
జిల్లాకు మూడు రోజుల్లో 7,800 టన్నుల యూరియా రానున్నట్లు తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు తెలిపారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ మంగళవారం సర్వేపల్లి కెనాల్ ఛైర్మన్ నాగార్జున రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణికి వినతిపత్రం అందజేశారు. ఆమెతో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం యూరియా గూడ్స్ వ్యాగన్లలో వస్తున్న విషయాన్ని తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలువురు రాజకీయ నాయకులకు 2024 సంవత్సరం కలిసొచ్చింది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేశ్, నెలవల విజయశ్రీ, ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. వీరి రాజకీయ జీవితంలో 2024 శాశ్వతంగా గుర్తుండిపోనుంది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తన దగ్గరకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు బొకేలు, పూలమాలలు తీసుకురావద్దని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రగ్గులు, అంగన్వాడీ పిల్లలకు పనికొచ్చే ప్లేట్లు, గ్లాసులు, పేద విద్యార్థులకు ఉపయోగపడే బుక్స్, పెన్నులు తీసుకురావాలని ఆమె కోరారు.
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26 న స్వర్గస్థులయ్యారు. మన్మోహన్ సింగ్ మరణాన్ని చింతిస్తూ 2024 డిసెంబర్ 26 నుంచి 2025 జనవరి 1 వరకు భారత ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. మాజీ ప్రధాని మరణానికి సంతాప సూచకంగా పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నారని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు.
ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.