India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నెల్లూరు ఎంపీగా ఘన విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. వివిధ అంశాలపై చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారికి బాబు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
40 ఏళ్లుగా టీడీపీకి అందని సర్వేపల్లి నియోజకవర్గంలో ఎట్టకేలకు టీడీపీ జెండా ఎగిరింది. నాలుగు సార్లు ఓడిపోయినప్పటికీ..అలుపెరుగకుండా శ్రమించి సోమిరెడ్డి విజయకేతనం ఎగరవేశారు. 2004,2009,2014,2019లో పోటీ చేసినా సొంత మండలం తోటపల్లిగూడూరులో కూడా ఆధిక్యం చాటలేకపోయాడు. అయితే తాజాగా వెలువడిన 2024ఎన్నికల ఫలితాలలో 16,228 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు.
నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఆనం రామనారాయణ రెడ్డి రికార్డు సృష్టించారు.1983 నుంచి ఇప్పటివరకు 10సార్లు MLAగా పోటి చేసినా ఒకే నియోజకవర్గం నుంచి చేయలేదు. 4 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పలుమార్లు విజయం సాధించారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి వెంగటగిరి MLAగా గెలిచి టీడీపీలో చేరారు. తాజాగా ఆయన ఆత్మకూరు నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 7576 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
రాష్ట్ర చరిత్రలోనే రికార్డు విజయం సాధించిన టీడీపీ, కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో కూడా వైసీపీ కంచుకోటను బద్దలుకొట్టింది. 30ఏళ్లుగా వైసీపీ హవా ఇక్కడ కొనసాగినప్పటికీ తాజాగా జరిగిన ఎన్నికలలో టీడీపీ జెండా ఎగరవేసింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రావుపై టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వర రావు 18,558 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
కావలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అభివృద్ధి చేసి చూపుతానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం కావలి పట్టణం ముసునూరులోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. లోకల్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తానని తెలిపారు. నాకు వచ్చిన మెజారిటీ 30,948 కాబట్టి అన్ని మొక్కలు నాటుతానని తెలిపారు.
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవికి ముక్కాల ద్వారకనాథ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రాజీనామా లేఖను శాఖ స్పెషల్ సెక్రటరీకి పంపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడంతో వైసీపీ తరఫున నామినేటెడ్ పోస్టులో కొనసాగుతున్న అందరూ ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తూ ఆయా లేఖలను ఆయా శాఖ అధికారులకు పంపిస్తున్నారు.
టీడీపీ విజయం సాధించిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పనబాక లక్ష్మి, పనబాక కృష్ణయ్య దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. లోకేశ్ను శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలు లోకేశ్తో చర్చించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 10 స్థానాల్లో గెలిచింది. వీరిలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణకు (72,489) అత్యధిక మెజార్టీ ఓట్లు లభిస్తే.. ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (7,576) అత్యల్ప మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణకు ఇది తొలి విజయం.
నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇందులో నలుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నారు. గెలిచిన పది మందిలో ఇద్దరు మహిళలు కాగా.. తొలిసారి వీరు అధ్యక్షా.. అననుండడం విశేషం.
వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయసాయి రెడ్డికి ఘోర పరాభావం ఎదురైన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన 2,45,902 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. వీళ్లద్దరూ ఒకప్పుడు రాజ్యసభలో సహచర ఎంపీలుగా మెలిగారు. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి పదవీ కాలం పూర్తయి పోయింది. సో.. విజయసాయి రెడ్డి ఓడిపోయినా సరే ఎంపీగానే కొనసాగుతారు.
Sorry, no posts matched your criteria.