India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమాజంలో నేటికీ అక్కడక్కడా కనిపిస్తున్న వివక్ష, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముని ఆదర్శాలే సరైన పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటాచలం(మ) శ్రీరామపురం రామాలయంలో జరిగిన శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవంలో అయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ శ్రీరాముడు ఆదర్శం కావాలని, ప్రతి గ్రామంలోనూ రామాయణ పారాయణం జరగాలన్నారు.
నేడు(ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు RTC బస్ స్టాండ్లలో రద్దీ ఏర్పడింది. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు పండుగకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్ స్టాండ్లలో ఆకతాయిలు, జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. విజయవాడలో జరిగిన మెప్మా వన్ డే వర్క్ షాప్లో ఆయన పాల్గొన్నారు. మహిళాకాశం పేరిట మెప్మా వెబ్ సైట్, మెప్మా మొబైల్ యాప్ను మంత్రి ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే మెప్మా లక్ష్యమని తెలిపారు. ఈ వర్క్ షాపులో నారాయణతో పాటు మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు.
కాకాణి బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగి 7కి వాయిదా పడిన విషయం తెలిసిందే. నేరాలు చేసినట్లు పిటిషనర్పై ఆరోపణలు లేవని, సాక్షుల వాంగ్మూలంతోనే కేసులు నమోదు చేశారని కాకాణి లాయర్ వాదించారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించి, ఆస్తులను నాశనం చేసినట్లు చెప్పలేదన్నారు. కాకాణిపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్లు చెల్లుబాటు కావని, దీనిపై ముందస్తు బెయిల్ మంజూరు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని వినిపించారు.
నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం(కరెక్షన్) శుక్రవారంతో ముగిసిందని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 1200 మంది లెక్చరర్లు, 150 మంది సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. 3.54 లక్షల పేపర్లు దిద్దామని చెప్పారు. ఈ వివరాలను స్కానింగ్ చేసి ఇంటర్ బోర్డుకు పంపామన్నారు.
నెల్లూరు కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లాలోని 10 మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుమందులు డీలర్లు అసోసియేషన్ సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు గాంధీ బొమ్మ కూడలి, మనుబోలు, దగదర్తి, కావలి, అల్లూరు, వింజమూరు, టీపీ గూడూరు, పొదలకూరు, కందుకూరు, ఆత్మకూరు మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశామని జిల్లా వ్యవసాయ అధికారి పుట్టా సత్యవాణి తెలిపారు.
రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ నాయకులు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్యాయంగా, అక్రమంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. ఎంతో సౌమ్యుడిగా, మంచి పేరున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టటం దారుణమన్నారు.
వెబ్సైట్లో ఉపాధ్యాయుల సీనియారిటీ తుది జాబితాను అందుబాటులో ఉంచినట్లు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో పాటు, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వారీగా పదోన్నతి జాబితాను కూడా అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 11వ తేదీలోగా తెలపాలన్నారు.
దుత్తలూరు మండలం నందిపాడు, వెంకటంపేట గ్రామాల్లో గురువారం కలెక్టర్ ఓ.ఆనంద్ ఎదుట ప్రజలు విద్యుత్ సమస్యలపై ఏకరువు పెట్టారు. లోవోల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, శిథిల స్తంభాలు గాలులకు నేలకొరిగి ఎప్పుడు ఏలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
దుత్తలూరులోని సీడ్స్ ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కుట్టు శిక్షణ, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, కంటి పరీక్షలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఈ సంస్థ సేవలందిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.