Andhra Pradesh

News March 16, 2024

కుప్పంలో చంద్రబాబుపై భరత్ గెలుస్తాడా…?

image

వైసీపీ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్‌జె.కె.భరత్‌ను అధికారికంగా శనివారం నియమించారు. 2019 ఎన్నికల్లో ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరణాంతరం కుమారుడు భరత్‌కు సీఎం జగన్ నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్సీ పదవీ కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో భరత్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొననున్నారు.

News March 16, 2024

ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేపథ్యం

image

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి మండలం తుమ్మలగుంటలో 1973లో జన్మించారు. ఏపీ అభివృద్ధిలో PhD పూర్తి చేశారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో 2007లో తుడా ఛైర్మన్ గా పనిచేశారు. 2014లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే తిరిగి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారు.

News March 16, 2024

రెండోసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప

image

చిత్తూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రెండోసారి రెడ్డప్పను అధిష్ఠానం ఖరారు చేసింది. 2019 ఎన్నికలలో ఆయన ఎంపీగా గెలుపొందారు. ఈయన పుంగనూరు నియోజకవర్గం సోమల మండలానికి చెందినవారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు. గతంలో లీడ్ క్యాప్ ఛైర్మన్‌గా పనిచేశారు. రెండోసారి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 16, 2024

తూ.గో.: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.

News March 16, 2024

BREAKING: చంద్రబాబుతో మాజీ మంత్రి గంటా భేటీ

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇంకా టికెట్ ఖరారు కాని నేపథ్యంలో చంద్రబాబును కలిసి విశాఖ జిల్లాలోని టిక్కెట్ కేటాయించాలని గంటా కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2024

ఏలూరు: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.

News March 16, 2024

శ్రీకాకుళం: అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కి.మీ మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని వీటిలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ బృందాలు తిరుగుతున్నాయని అన్నారు.

News March 16, 2024

పదో సారి MLAగా పెద్దిరెడ్డి పోటీ

image

వైసీపీ పుంగనూరు MLA అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఖరారు చేశారు. 1989, 99, 2004లో పీలేరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 14, 19లో పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్, జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1978లో జనతా పార్టీ, 1985, 1994లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీలేరులో పోటీ చేయగా ఓడిపోయారు. తాజాగా పదోసారి ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నారు.

News March 16, 2024

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై సెస్పెన్స్

image

అన్ని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం అనకాపల్లి సీటును మాత్రం పెండింగ్‌లో ఉంచింది. బీసీకి కేటాయించినట్లు చెప్పారు కానీ..అభ్యర్థి పేరు మాత్రం చెప్పలేదు. దీంతో ఎంపీ అభ్యర్థి పేరు ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది.

News March 16, 2024

తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వేణుంబాక

image

ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చెందిన వేణుంబాక విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక నేత. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత అనూహ్య పరిణామాల మధ్య నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన విజయసాయి రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. ఆయన ప్రత్యర్థిగా వేమిరెడ్డి ఉన్నారు.