Andhra Pradesh

News June 16, 2024

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోండి: ఎస్పీ

image

మత సామరస్యానికి ప్రతిగా నిలిచే బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, మదర్సాలు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

News June 16, 2024

శ్రీకాకుళం: ఫార్మసీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని బీ-ఫార్మసీ నాలుగో ఏడాది 2వ సెమిస్టర్(2017- 18 రెగ్యులేషన్) థియరీ పరీక్షలను జూలై 25 నుంచి నిర్వహించనున్నారు. జూలై 25 నుంచి ఆగస్టు 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు ప్రాజెక్టు వర్క్ నిర్వహిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు సబ్జెక్టువారీగా పరీక్షల షెడ్యూల్ వివరాలకు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

News June 16, 2024

కొమ్మనాపల్లిలో మరో 28 మందికి డయేరియా

image

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. శనివారం మరో 28 మంది దీని బారిన పడినట్లు తెలిసింది. కాకినాడలోని జీజీహెచ్‌లో 16 మంది, తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ముగ్గురు, మిగిలిన 9 మందికి స్థానికంగా చికిత్స అందించారు. ఈ ఊరిలో 512 కుటుంబాల్లో 1881 మంది ఉన్నారు. వారిలో 60 కుటుంబాలకు చెందిన 69 మందికి వైద్యం అందుతుంది. పలువురు ప్రైవేట్‌లో చికిత్స పొందుతున్నారు.

News June 16, 2024

ఆదోనిలో సినీ నటుడు సుమన్ సందడి

image

ఓ కాటన్ షాపు ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి సినీ నటుడు సుమన్ ఆదివారం ఆదోనిలో పర్యటించారు. పట్టణంలోని కేవీఆర్ కాలనీలో కాటన్ షాపును ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని భవిష్యత్తు పూర్తిగా మారుస్తానని, పెద్దల సహకారంతో పరిశ్రమలను తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

News June 16, 2024

తాను చనిపోయి నలుగురికి అవయవదానం

image

పామిడికి చెందిన నితిన్(20) 4 రోజుల క్రితం పెయింటింగ్ పని చేస్తూ మూడంతస్తుల భవనం నుంచి కిందపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే తాను చనిపోయాక అవయవాలను దానం చేయాలని, ఇదే చివరి కోరిక అని తల్లికి చెప్పి చనిపోయాడు. తన కొడుకు కోరిక మేరకు నితిన్ అవయవాలను శనివారం దానం చేశారు.

News June 16, 2024

సీఎం టూర్.. పోలవరంలో ఎస్పీ తనిఖీలు

image

పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలలో భద్రతా పరమైన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, వీవీఐపీ భద్రత కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

News June 16, 2024

ప.గో జిల్లాలో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం

image

గడచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమ గోదావరి జిల్లాలో 3.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో యలమంచిలి మండలంలో 2.0 మిల్లీమీటర్లు, పాలకొల్లు మండలంలో 1.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదని వివరించారు. సరాసరి జిల్లా వర్షపాతం 0.2 మిల్లీమీటర్లు నమోదయింది.

News June 16, 2024

రుషికొండపై పచ్చని రిసార్ట్స్ తొలగించి విలాస భవనం కట్టారు: గంటా

image

ప్రకృతి అందానికి నిలయమైన రుషికొండపై చెట్లను తొలగించడంతో పాటు రిసార్ట్స్ నేలమట్టం చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆదివారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ ఎంతో ముచ్చటగా కట్టుకున్న ఈ భవనంలోకి రాకుండా ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

News June 16, 2024

దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్

image

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు సంతపేటలోని ఆనం
రామ నారాయణరెడ్డి నివాసంలో ఆదివారం కలెక్టర్ హరి నారాయణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనం రామనారాయణ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై కాసేపు వారు చర్చించుకున్నారు.

News June 16, 2024

విజయవాడ: విద్యార్థిని అనుమానాస్పద మృతి

image

విజయవాడ శివారు గూడవల్లిలో విద్యార్థిని శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పటమట సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. అనంతపురానికి చెందిన జాహ్నవి చదువు నిమిత్తం గూడవల్లి వచ్చింది. శనివారం విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. జాహ్నవి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.