Prakasam

News April 11, 2025

మార్కాపురం: రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడ్డాడు

image

మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మార్కాపురంలోని విజయ టాకీస్ ఏరియాకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తి రైలు పట్టాల వద్దకు చేరుకున్నాడు. మార్కాపురం నుంచి గుంటూరు వెళ్లే రైలు కింద ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీంతో రైలు ఢీకొన్న వెంటనే అయ్యప్ప పక్కకు పడిపోవడంతో తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే రైల్వే పోలీసులు చేరుకుని అతడిని వైద్యశాలకు తరలించారు.

News April 11, 2025

ప్రకాశం: నిప్పులు కురిపించిన భానుడు

image

కనిగిరి నియోజకవర్గంలోని నందన మారెళ్ళలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 41.8° ఉష్ణోగ్రత నమోదయినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగులోపు అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దు అని పేర్కొన్నారు.

News April 11, 2025

లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

image

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర  అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.

News April 10, 2025

లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

image

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర  అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.

News April 10, 2025

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి: ఎస్పీ

image

గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న జిల్లా స్ధాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు ఇచ్చే ట్రోఫీలను గురువారం ఎస్పీ ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్‌లో 40 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఎస్పీ కొంచెంసేపు క్రికెట్ ఆడారు.

News April 10, 2025

అమరజీవి జయంతి ఉత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

image

పీసీ పల్లి మండలంలో ఈనెల 16వ తేదీన జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి స్వామిని ఆర్యవైశ్య నాయకులు ఆహ్వానించారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను గురువారం కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

News April 10, 2025

కలెక్టర్ అన్సారీయాకు ఆహ్వానం

image

కనిగిరిలోని ఎంవీఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 16న జరిగే అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలకు రావాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను గురువారం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కలిసి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అన్సారియా జయంతి ఉత్సవాల్లో తప్పక పాల్గొంటామని హామీ ఇచ్చినట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు.

News April 10, 2025

నారాలోకేశ్ సూచనతో చేబ్రోలు కిరణ్ దూషణలు: ఎమ్మెల్యే తాటిపర్తి

image

జగన్ కుటుంబంపై చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ‘విశృంఖలంగా, విచ్చలవిడిగా, వికృతంగా, వినాశనంగా, విపరీతంగా టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా పోటీపడి మరి వైసీపీ నాయకులపై, వారి కుటుంబాలపై చేస్తున్న ‘మానసిక సామూహిక ఉన్మాదం’ తారాస్థాయికి చేరిందని చెప్పటానికి సాక్ష్యం నారా లోకేశ్ సూచనతో కిరణ్ చేసిన దూషణలే’ అంటూ గురువారం ట్వీట్ చేశారు.

News April 10, 2025

ప్రకాశం: విషాదం.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం

image

తాడేపల్లి పరిధిలోని ఇప్పటంలో విషాదం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి పనికోసం వెళ్లిన కుటుంబంలో ఈ విషాదం జరిగింది. అపార్ట్‌మెంట్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి బాధిత కుటుంబాన్ని, చిన్నారుల మృతదేహాలను అద్దంకి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

News April 10, 2025

ఆ ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుంది: ప్రకాశం జేసీ

image

అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థిరాస్తి కొనుగోలుదారులకు అవసరమైన సూచనలు చేసేలా రూపొందించిన పోస్టర్లను బుధవారం ప్రకాశం భవనంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, విజయకుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు.