India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పీవీపురంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. భార్య రామలక్ష్మమ్మను భర్త వెంకటేశ్వర్లు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి 327 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సాగిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి అభ్యర్థులు ఉదయం నుంచే హాజరయ్యారు. అయితే 22 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు.
సెప్టెంబర్ 5న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్యంలు తమ పరిధిలోని ఎంఈఓలకు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. డిప్యూటీ DEOలు 25లోగా వాటిని పరిశీలించి 27న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.
జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం మంత్రుల త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఎదురుచూస్తున్న ప్రజలకు ఆశలు చిగురించాయి. 30న మంత్రులు సత్య కుమార్, నిమ్మల రామానాయుడు ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు, ఏయే మండలాలు ప్రకాశం, మార్కాపురంలో కలపాలి అనే దానిపై మీ అభిప్రాయాలు చెప్పవచ్చు.
ప్రకాశం జిల్లాలో మూగ, చెవుడు ఉన్నవారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. అప్లికేషన్కు లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదని.. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని సూచించారు. ఇంటర్ పూర్తి చేసి సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు కలిగిన వాళ్లు అర్హులు. www.apdascac.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.
జిల్లాలో హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈనెల 27లోగా సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఒక సంవత్సరం కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా శిక్షణ అందుతుందన్నారు. ఎస్సీ అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు ఎగ్జిక్యూటివ్ అధికారి నంబర్ 9849905970 ను సంప్రదించాలన్నారు.
జిల్లాలో హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈనెల 27లోగా సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఒక సంవత్సరం కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా శిక్షణ అందుతుందన్నారు. ఎస్సీ అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు ఎగ్జిక్యూటివ్ అధికారి నంబర్ 9849905970 ను సంప్రదించాలన్నారు.
ప్రకాశం జిల్లా లీగల్ మెట్రాలజీ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని జేసీ గోపాలకృష్ణ గురువారం ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని చౌక దుకాణాలపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని జేసీ సమావేశంలో అధికారులకు సూచించారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారికి ఉద్యోగం ఎందుకు? పద్ధతి మార్చుకోకపోతే టెర్మినేట్ చేసేస్తా అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. వాస్తవ వివరాలను నమోదు చేయకుండా పలువురు ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు.
జిల్లాల పునర్విభజన మార్పులపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం, కందుకూరును జిల్లాలో కలపడం, ఇతర అంశాలపై మంత్రుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ యాదవ్ జిల్లాకు రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.