Prakasam

News September 14, 2024

కొండపిలో కిలో పొగాకు ధర రూ.358

image

కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వేలానికి జువ్విగుంట, అయ్యవారిపాలెం, తంగేళ్ల, జాళ్లపాలెం, పీరాపురం గ్రామాలకు చెందిన రైతులు 1354 బేళ్లను వేలానికి తీసుకొని వచ్చారు. అందులో 1009 బేళ్లను కొనుగోలు చేశారు. వ్యాపారులు వివిధ కారణాలతో 345 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.358, కనిష్ఠ ధర కేజీ రూ.180, సరాసరి ధర రూ.266.88 పలికింది.

News September 14, 2024

ప్రకాశం: YCP రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపూడి నియామకం

image

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకర్ రావు నియమితులయ్యారు. శుక్రవారం YCP కేంద్ర కార్యాలయంలో YS జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార ప్రతినిధుల పేర్లను ప్రకటించింది. జిల్లా నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపూడి ప్రభాకర్ రావు నియమితులవడంతో జిల్లాలోని పలువురు వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

News September 14, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

*బాలినేని<<14089340>> పార్టీ మార్పుపై<<>> మరోసారి చర్చ
*అర్ధవీడు: 15 మంది వైసీపీ వర్గీయులపై కేసు
*ఈ నెల 18న దర్శిలో జాబ్ మేళా
*చీరాల:108లో పైలెట్ & డ్రైవర్ ఉద్యోగాలు
*దోర్నాల మాజీ ZPTCపై అవినీతి ఆరోపణలు
*మార్కాపురం: చెరువు స్థలాలను ఆక్రమిస్తే చర్యలు
* అర్ధవీడు: మైనర్ బాలుడికి మూడేళ్లు జైలు శిక్ష
*యర్రగొండపాలెం వినాయక ఊరేగింపులో ఘర్షణ
* మార్కాపురం: కరెన్సీ నోట్లతో దర్శనమిస్తున్న గణేషుడు

News September 13, 2024

ప్రకాశం: మైనర్ బాలుడికి మూడేళ్ల జైలుశిక్ష

image

ప్రకాశం జిల్లా అర్ధవీడుకు చెందిన ఓ మైనర్ బాలుడికి ఒంగోలు కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 2018లో ఏడవ తరగతి చదువుతున్న బాలుడిని ఇంటర్ విద్యార్థినికి ప్రేమలేఖ ఇవ్వాలంటూ నిందితుడు ఒత్తిడి చేశాడు. దీంతో ప్రేమలేఖ ఇవ్వనన్న విద్యార్థిపై మైనర్ బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలుడు మృతి చెందాడు. విచారణ అనంతరం ఒంగోలు కోర్టు నేడు నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

News September 13, 2024

ప్రకాశం: 108లో డ్రైవర్& పైలట్ ఉద్యోగాలు

image

104,108 వాహనాల్లో డ్రైవర్లు & పైలట్స్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల 104 జిల్లా మేనేజర్ జె నాగేశ్వరరావు తెలిపారు. డ్రైవర్& పైలట్ 10వ తరగతి ఉత్తీర్ణత, హెవీ లైసెన్స్, 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండి, ఇంగ్లిష్ చదవడం & రాయడం తెలిసి ఉండాలన్నారు. అర్హులైన వారు Sep 16వ తేదీలోపు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో 104 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News September 13, 2024

బాపట్ల: ‘సర్వే పారదర్శకంగా నిర్వహించాలి’

image

వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు దెబ్బతిన్న గృహాల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదకు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు అధికంగా దెబ్బతిన్నాయన్నారు. 24 లంక గ్రామాలలో దెబ్బతిన్న గృహాల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. నష్టం అంచనాలను స్పష్టంగా ఉండాలన్నారు.

News September 13, 2024

బాలినేని పార్టీ మార్పుపై మరోసారి చర్చ

image

మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారనే వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ క్యాడర్‌లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరోవైపు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు అధిష్ఠానం నుంచి గురువారం పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఆయనకు జిల్లా బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో బాలినేని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News September 13, 2024

లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

image

ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యేలా కృషి చెయ్యాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, భూతగాదాలు, మోటార్ బైక్ యాక్సిడెంట్, చిట్ ఫండ్ వంటి కేసులు, ఇతర కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని గురువారం సూచించారు.

News September 12, 2024

ప్రకాశం: వరద బాధితులకు రూ.1 కోటీ 55 లక్షల విరాళం

image

ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని గోణసపూడి గ్రామవాసి, పారిశ్రామికవేత్త విక్రం నారాయణ కుటుంబం వరద బాధితులకు అండగా నిలిచింది. ఈ మేరకు గురువారం CM చంద్రబాబు నాయుడిని కలిసి రూ.1,55,55,555 భారీ చెక్కును విక్రం నారాయణ అందజేశారు. ఆపద సమయాల్లో వరద బాధితులకు అండగా నిలిచిన విక్రం నారాయణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. మంత్రి అనగాని, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

News September 12, 2024

షర్మిలను కలిసిన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు

image

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సంతనూతలపాడు ఇన్‌ఛార్జ్ పాలపర్తి విజేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌పై చర్చించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు షర్మిల సూచించారు.