Prakasam

News August 9, 2025

ప్రకాశం: నిరుద్యోగులకు ఉచితంగా మేస్త్రీ పనిపై శిక్షణ.!

image

ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 200 మందికి ఉచితంగా మేస్త్రీ పనిపై శిక్షణ ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రధానాధికారి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ఒంగోలులోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ శిక్షణ 31 రోజులు ఇస్తామన్నారు. ప్రతి బ్యాచ్‌లో 30 మంది ఉంటారని వివరాలకు తమ కార్యాలయానికి రావాలన్నారు.

News August 9, 2025

ప్రకాశం: అన్నాచెల్లెళ్ల ఆప్యాయ క్షణాలు

image

అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పేమాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లడిల్లిపోతారు. ప్రేమా,ఆప్యాయతల కలబోత వీరి బంధం. ఆ బ్లడ్‌లో ఉండే మ్యాజిక్కే వేరు. మరి మీకు రాఖీకట్టే సోదరికి కామెంట్ ద్వారా విషెస్ చెప్పండి.

News August 8, 2025

పొదిలిలో అద్భుత దృశ్యం..!

image

ప్రకృతి మన కంటికి అపురూప దృశ్యాలను కనిపించేలా చేస్తుంది. అలాంటి దృశ్యమే ఇది. పొదిలిలో గల మసీదు మినార్‌పై సాయంత్రం చంద్రుడు అద్భుతంగా కనిపించాడు. సాధారణంగా లైట్ హౌస్‌ల వద్ద పెద్ద విద్యుత్ కాంతి చివరన ఎలా కనిపిస్తుందో అదే తరహాలో మినార్‌పై చంద్రుడు కనిపించడం విశేషం. అయితే ఈ దృశ్యాన్ని కొందరు పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి తమ మొబైల్స్‌లో బంధించారు.

News August 8, 2025

ప్రకాశం: 11 నుంచి సెమిస్టర్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు డీఈఐఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ పరీక్షలకు డైట్ మైనంపాడులో అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, 2023-25, 2022-24 బ్యాచ్ వారికి మాత్రమే ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.

News August 8, 2025

ఒంగోలు: తపాలా శాఖలో.. ఏజెంట్‌గా చేరాలని ఉందా?

image

తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీవిత బీమా పాలసీలను సేకరించుటకు ఏజెంట్ల ఎంపిక ప్రక్రియ ఈనెల 22వ తేదీన నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సీనియర్ సూపర్డెంట్ జాఫర్ సాదిక్ తెలిపారు. ఒంగోలులోని తపాల శాఖ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు భాగ్యనగర్ రెండవ లైన్‌లో ఉన్న పోస్ట్‌ఆఫీస్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News August 8, 2025

అసాంఘిక కార్యకలాపాల సమాచారం అందించండి: ఎస్పీ

image

జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లయితే తమకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన మేరకు.. జిల్లాలో ఎక్కడైనా పేకాట, మత్తు పదార్థాల రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే డయల్ 112 నెంబర్, పోలీస్ వాట్సప్ నెంబర్ 9121102266కు సమాచారం అందించాలన్నారు.

News August 8, 2025

ప్రతి నియోజకవర్గంలో పార్కు ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించాలని సీఎస్ ఆదేశించారు.

News August 8, 2025

ఒంగోలు: తపాలా శాఖలో.. ఏజెంట్‌గా చేరాలని ఉందా?

image

తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీవిత బీమా పాలసీలను సేకరించుటకు ఏజెంట్ల ఎంపిక ప్రక్రియ ఈనెల 22వ తేదీన నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సీనియర్ సూపర్డెంట్ జాఫర్ సాదిక్ తెలిపారు. ఒంగోలులోని తపాల శాఖ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు భాగ్యనగర్ రెండవ లైన్‌లో ఉన్న పోస్ట్‌ఆఫీస్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News August 7, 2025

రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన!

image

ప్రకాశం జిల్లాకు శుక్రవారం మోస్తారు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన జారీ చేసింది. కర్ణాటక నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాకు ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచన ఉన్నట్లు ఆ ప్రకటన సారాంశం. అయితే గురువారం సైతం జిల్లాలోని పలు మండలాలలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.

News August 7, 2025

ఒంగోలు: క్రీడాకారుల ఎంపికకు 600 మంది హాజరు

image

ఒంగోలులోని డాక్టర్ పి. ఆనంద్ మినీ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి టోర్నమెంట్ క్రీడాకారుల ఎంపికకు మొత్తం 600 మంది క్రీడాకారులు హాజరైనట్లు హాకీ అసోసియేషన్ సెక్రటరీ సుందర రామిరెడ్డి తెలిపారు. క్రీడాకారుల ఎంపికై నిర్వహిస్తున్న క్రీడలను డీఆర్వో ఓబులేసు, డీఈఓ కిరణ్ ప్రారంభించారు. జోనల్ లెవెల్ లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు.