Prakasam

News August 27, 2024

బేస్తవారిపేట: రేపు జాబ్ మేళా

image

బేస్తవారిపేటలోని కందుల ఓబులరెడ్డి డిగ్రీ కళాశాలలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కందుల ఓబులరెడ్డి తెలిపారు. అమెజాన్, బ్లూస్టార్, టెక్ మహీంద్ర, పేమెంట్ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్, డీమార్ట్, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టా కార్ట్, హంటర్ డౌగ్లాస్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు.

News August 27, 2024

ఒంగోలులో రూ.300 కోట్ల భూకుంభకోణం?

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి కనుసన్నల్లో రూ.300 కోట్ల భూకుంభకోణం జరిగిందని విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన వారధి కార్యక్రమంలో పలువురు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఒంగోలు నియోజకవర్గ పరిధిలో నకిలీ స్టాంపు పేపర్లతో దొంగ రిజిస్ట్రేషన్లతో సుమారు రూ.300 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలని కోరారు.

News August 27, 2024

డీప్ ఫేక్ టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా ఉండండి: ప్రకాశం పోలీస్

image

సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి మీకు తెలిసిన వ్యక్తుల వాయిస్‌తో ఫోన్ చేయటం లేదా ప్రముఖుల ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని డబ్బులు అడగటం, అత్యవసరం ఆపదలో ఉన్నామంటూ తొందరపెట్టి మీ నగదు కొట్టేసే ప్రయత్నం చేస్తారన్నారు. ఇలాంటి సైబర్ కేటుగాళ్ల పట్ల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ AR దామోదర్ తెలియజేశారు. సైబర్ నేరాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సంప్రదించాలన్నారు.

News August 26, 2024

ప్రకాశం: తల్లిపై కుమారుడు గొడ్డలితో దాడి

image

కన్నతల్లిపై కొడుకు కర్కషంగా ప్రవర్తించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో సోమవారం తల్లి మరియమ్మపై కొడుకు త్రిపురయ్య గొడ్డలితో దాడి చేశాడు. తల్లిని డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కారణంతో దాడి చేసినట్లు బంధువులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరియమ్మను 108 వాహనంలో యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

ఒంగోలు MP మాగుంట బృందం తర్లుపాడు రాక

image

తర్లుపాడులో గల రైల్వే స్టేషన్‌కి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి బృందం సాగర్ రెడ్డి, కృష్ణారెడ్డి వచ్చి రైల్వే స్టేషన్‌లో గల పలు సమస్యలను తెలుసుకున్నారు. మాగుంట బృందం దృష్టికి తర్లుపాడులో కరోనాకు ముందు ఆగే రైళ్లు ఇప్పుడు ఆగడం లేదని, మరల తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అంతే కాకుండా రైల్వేగేట్‌ వల్ల మార్కాపురం వెళ్లాలంటే రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వారు అన్నారు.

News August 26, 2024

ప్రకాశం: దారి దోపిడీ.. రూ.36 లక్షలు స్వాహా

image

మార్టూరు మండంలో ఆదివారం భారీ దారి దోపిడి జరిగింది. CI శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. జే. పంగులూరు మండలం రామ్‌కూర్‌కు చెందిన ధనచక్రవర్తి పంట ఉత్పత్తులు, పశువులను అమ్మడం ద్వారా వచ్చిన రూ.36 లక్షల నగదును, ద్రోణాదులలోని తన అత్తగారింట్లో దాచేందుకు బైక్‌లో నగదుతో వెళ్తండగా.. కోనంకి- ద్రోణాదుల గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి డబ్బును అపహరించారు. దీనిపై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 26, 2024

బేస్తవారిపేట వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

image

బేస్తవారిపేట వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బేస్తవారిపేటకు చెందిన సుభాని అనే వ్యక్తి బైక్ అదుపు తప్పి సెంటర్‌లోని సైడ్ రైలింగ్‌ను ఢీకొన్నాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108లో ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News August 26, 2024

మహిళాభివృద్దే లక్ష్యం: ప్రకాశం కలెక్టర్

image

స్వయం సహాయక సంఘాలలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా చెప్పారు. లఖ్‌పతి దీదీ పథకం ద్వారా వారికి ఈ దిశగా అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామని తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు.

News August 26, 2024

ఫొటోల మార్ఫింగ్‌కు పాల్పడ్డ ప్రకాశం జిల్లా యువకులు

image

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. తెనాలి- 2 టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన ఓ యువతి ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి, వాటిని కొరియర్‌లో ఆమెకు పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తెనాలి- 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం (D) కంభానికి చెందిన అబ్దుల్, మార్కాపురానికి చెందిన కరుణాకర్‌‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

News August 26, 2024

మహిళాభివృద్దే లక్ష్యం: ప్రకాశం కలెక్టర్

image

స్వయం సహాయక సంఘాలలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా చెప్పారు. లఖ్‌పతి దీదీ పథకం ద్వారా వారికి ఈ దిశగా అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామని తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు.