Prakasam

News March 4, 2025

దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

image

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవరం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.

News March 4, 2025

దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

image

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవారం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.

News March 4, 2025

రాచర్ల: వృద్ధురాలికి షాక్ ఇచ్చిన కరెంట్ బిల్.!

image

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగూటిపల్లికి చెందిన పూల వెంకటమ్మ అనే వృద్ధురాలికి కరెంట్ బిల్ షాక్ ఇచ్చింది. ఇంట్లో కేవలం 3 ఫ్యాన్లు, ఓ ఫ్రిడ్జ్, ఓ TV ఉండగా ఏకంగా రూ.10,580 బిల్లు రావడంతో ఆమె అవాక్కయ్యారు. ఫిబ్రవరి నెలలో వారం రోజులపాటు అసలు ఊరిలోనే లేనని, అయినా ఇంత కరెంట్ బిల్లు ఎలా వచ్చిందో తెలియలేదని ఆమె తెలిపారు. గతంలో కూడా మీటర్ సాంకేతిక లోపంతో లక్ష వరకు కరెంట్ బిల్ వచ్చిందని వెల్లడించించారు.

News March 4, 2025

ఈనెల 8న మార్కాపురం రానున్న చంద్రబాబు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఈనెల 8న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారం జిల్లా కలెక్టరేట్‌కి అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం పూర్తి వివరాలు అందనున్నాయి. అయితే గత సంవత్సరం కూడా ఈ వేడుకలను చంద్రబాబు మార్కాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. దరిమడుగు లేదా ఎస్వీకేపి కళాశాలలో కానీ భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది.

News March 4, 2025

అత్యంత పేదరిక జిల్లాల్లో ప్రకాశం జిల్లాకు 4వ స్థానం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్‌కౌంట్ రేషియో 6.28%గా ఉండగా.. తీవ్రత విషయంలో 43.60%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.027గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ప.గో జిల్లా మొదట ఉంది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూ.గో, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

News March 3, 2025

ఒంగోలు: శారీరక దృఢత్వానికి యోగా అవసరం

image

మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మహిళా పోలీసులు, హోంగార్డ్స్, డీపీఓ సిబ్బందికి ఆదివారం ఒంగోలులో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర శాఖల సిబ్బంది ఒంగోలులోని పోలీస్ కళ్యాణ మండపంలో యోగా, నృత్యం, డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు మాట్లాడుతూ.. నిత్యం పలు రకాల విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు.

News March 2, 2025

జనసేన కమిటీలో ప్రకాశం జిల్లా నేతలకు కీలక బాధ్యతలు.!

image

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను మార్చి 14న పిఠాపురంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నిర్వహణ కోసం కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో, జిల్లా జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, మార్కాపురం జనసేన ఇన్‌ఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్‌లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించినట్లుగా పార్టీ ప్రకటన విడుదల చేసింది.

News March 2, 2025

ప్రకాశం: సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే తాటిపర్తి ఫైర్

image

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘అమరావతి నిర్మాణం కోసం రూ.6 వేల కోట్ల నిధులు, రూ.50 వేల కోట్ల పనులు, రూ.15 వేల కోట్ల అప్పులు కల్పించారు. ప్రకాశం జిల్లా వాళ్లం కేవలం తాగునీరు, సాగునీరు అడుగుతున్నాం. రూ.600 కోట్లయినా నిధులు మాకు ఇస్తే గొంతు తడి చేసుకుంటాం. దప్పికకు కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఉండవ్ చంద్రబాబు” అంటూ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.

News March 2, 2025

ఒంగోలు: విద్యార్థుల లక్ష్యాలు తెలుసుకున్న కలెక్టర్

image

ఇంటర్మీడియట్ , పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మునుపెన్నడూ లేని విధంగా.. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులతో శనివారం ప్రకాశం భవనం నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తీరుపై ఆరా తీశారు. పలువురు విద్యార్థులతో ఆమె ముఖాముఖి మాట్లాడారు. వారి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.

News March 2, 2025

ఒంగోలు: ‘మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’

image

మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. శనివారం నుంచి వారం రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా.. శనివారం ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

error: Content is protected !!