Prakasam

News August 20, 2024

జగన్ కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు: గొట్టిపాటి

image

వైఎస్ జగన్ కేసీఆర్‌తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు, వెలిగొండపై గెజిట్ నోటిఫికేషన్ రాకుండా జగనే ఆపారని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో కేంద్రమంత్రిని కలిశామన్నారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని అధోగతి చేశారని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని పేర్కొన్నారు.

News August 20, 2024

జగన్ కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు: గొట్టిపాటి

image

వైఎస్ జగన్ కేసీఆర్‌తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు, వెలిగొండపై గెజిట్ నోటిఫికేషన్ రాకుండా జగనే ఆపారని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో కేంద్రమంత్రిని కలిశామన్నారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని అధోగతి చేశారని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని పేర్కొన్నారు.

News August 20, 2024

కంపెనీలు తెచ్చే ముఖమా వైఎస్ జగన్ నీది?: గొట్టిపాటి లక్ష్మి

image

మాజీ CM జగన్‌పై దర్శి TDP ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ‘X’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిగ్గులేదా, సైకో జగన్? శ్రీసిటీ కంపెనీలపై ‘ఫేకు జగన్’ తప్పుడు ప్రచారం’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అదే విధంగా ‘నీ స్థాయి కదిరి గొడ్డలి, పులివెందులకు చేపలు – రొయ్యలు, నీ పర్యటన అప్పుడు కట్టడానికి పరదాలు తప్పించి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా? ఎందుకీ ఫేక్ ప్రచారం సిగ్గు లేకుండా జగన్’ అని ‘X’లో పోస్ట్ చేశారు.

News August 20, 2024

తేడావస్తే సుప్రీం కోర్టుకు వెళ్తా: బాలినేని

image

ఒంగోలులో సోమవారం జరగాల్సిన మాక్‌పోలింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి బాలినేని స్పందిస్తూ.. తాను వెరిఫికేషన్ ఉంటుందని అనుకున్నానని, మాక్ పోలింగ్ కాదని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్‌కు లెటర్ ఇచ్చామని అలాగే హైకోర్టుకు వెళ్లామన్నారు. కోర్టు ఇవాళ్టికి వాయిదా వేశారన్నారు. హైకోర్టులో ఏదైనా తేడాలు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానని బాలినేని స్పష్టం చేశారు.

News August 20, 2024

వెలిగొండ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం

image

వెలిగొండ ప్రాజెక్టుపై అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు విమర్శ, ప్రతి విమర్శలు చేస్తున్నారు. తమ హయాంలో ఎన్ని కష్టాలు వచ్చిన రెండు టన్నెళ్లను పూర్తి చేశామని జగన్ తన ‘X’లో పోస్ట్ చేశారు. దానికి మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల, టీడీపీ నేత ఎరిక్షన్ బాబు ప్రతివిమర్శ చేశారు. ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే తిరిగి గేటు పెట్టలేని జగన్ CM చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై మీ కామెంట్.

News August 20, 2024

చీరాల: రాఖీ పండుగ వేళ విషాదం

image

చీరాల- వేటపాలెం బైపాస్ లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాడరేవులో ఉన్న సోదరుడికి రాఖీ కట్టి స్వగ్రామం చినగంజాంకు బైక్‌పై లలిత తన భర్త వెంకటేశ్వరరెడ్డి, కుమార్తెలు రేణుక, నందినిలతో తిరిగి వెళుతుండగా ఒంగోలు వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో నందిని అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు.

News August 20, 2024

ప్రకాశం: జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికైన వెంకటేశ్వర్లు

image

కొమరోలు మాస్టర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వర రావు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని 2024 సంవత్సరానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. గత 25 సంవత్సరాల నుంచి ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తూ సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా వెంకటేశ్వర రావును ఎంపిక చేసినట్లు రాష్ట్ర ఎల్.పి.టివో రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య తెలిపారు.

News August 19, 2024

వేటపాలెం: బైక్‌ను ఢీ కొట్టిన కారు.. బాలిక మృతి

image

వేటపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌ను కారు ఢీ కొట్టడంతో 12 సంవత్సరాల బాలిక మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 19, 2024

వైఎస్ జగన్‌పై కౌంటర్ అటాక్ చేసిన ఎమ్మెల్యే దామచర్ల

image

వైసీపీ పాలనలో వెలుగొండ ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రస్తుతం ప్రాజెక్టుపై వైఎస్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. పశ్చిమప్రకాశం జల ప్రసాదిని వెలుగొండ పూర్తి అయినట్లు ప్రజలకు మాయమాటలు చెప్పి వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ చెప్పే మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.

News August 19, 2024

కనిగిరి: ఉద్యోగం పేరిట మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

image

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని కనిగిరి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు కనిగిరికి చెందిన ఓ మహిళ సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని తమ వద్ద రూ.8,50,000 డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు బాధితులు, ఎస్పీతో తెలిపారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.