Prakasam

News February 20, 2025

వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

వారబంది విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద నుంచి వస్తున్న నాగార్జునసాగర్ నీటిని నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. వస్తున్న నీటిని పరిగణలోకి తీసుకొని జిల్లాలో నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు మళ్లించాలని తెలిపారు.

News February 19, 2025

ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉండాలి: ఎస్పీ

image

ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రకాశం ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అన్నారు. బుధవారం ఒంగోలులోని పోలీస్ కళ్యాణమండపంలో మహిళా పోలీసులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత మనందరి బాధ్యత కావాలన్నారు. మహిళా ఫిర్యాదులు, పాటించవలసిన నియమాలపై మహిళా పోలీసులకు ఎస్పీ అవగాహన కల్పించారు.

News February 19, 2025

మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార గోడపత్రికలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీన కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా, ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్ మేళాను వినియోగించుకోవాలని తెలిపారు.

News February 19, 2025

జగన్ నాసిరకం మద్యం అమ్మించాడు: మంత్రి స్వామి

image

జగన్ జే ట్యాక్స్ కోసం నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీశాడని మంత్రి స్వామి అన్నారు. నాటు సారా నిర్మూలనపై బుధవారం ఒంగోలులో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, నాటుసారా, మద్యం విచ్చలవిడిగా విక్రయించారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాల్లో సైతం గంజాయి, డ్రగ్స్ దోరేకవన్నారు. కూటమి పాలనలో గంజాయి, డ్రగ్స్‌ని అరికట్టేందుకు ఈగల్ వ్యవస్థని తెచ్చామన్నారు.

News February 19, 2025

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

image

ప్రకాశం జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.

News February 19, 2025

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

image

ప్రకాశం జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.

News February 19, 2025

ప్రకాశం జిల్లాలో విషాదం

image

ప్రకాశం జిల్లాలో బుధవారం విషాద ఘటన వెలుగు చూసింది. సంతనూతలపాడు సమీపంలోని చెరువులోకి చిన్నారితో కలిసి తల్లి దూకేశారు. సమాచారం అందుకున్న సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు సంతనూతలపాడుకు చెందిన బాపట్ల సుజాత(35), అశ్వజ్ఞ(6 నెలలు)గా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

News February 19, 2025

కంభం: బాబాయి ఇంట్లో నవవధువు మృతి

image

పెళ్లి తంతు ముగియకముందే పెళ్లి కొడుకును తన ఇంట్లోనే ఉంచి, తన <<15501906>>బాబాయి ఇంటికి వెళ్లి<<>> ఓ గదిలో నవవధువు సుస్మిత(21) ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. సుస్మిత ఇంట్లో పెళ్లి కుమారుడు, ఇతర బంధువులు ఉండటంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న సుస్మిత ఇంట్లో కుదరక, పక్కనే ఉన్న బాబాయి ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియాలి.

News February 19, 2025

ఒంగోలు కోర్టులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు

image

మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో జరిగిన రత్నం బాబు(22) హత్య కేసులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.రాజవెంకటాద్రి తీర్పు ఇచ్చారు. రత్నంబాబు కరిష్మా అనే యువతిని ప్రేమించాడు. అది నచ్చని యువతి కుటుంబ సభ్యులు రత్నంబాబును కత్తులతో పొడిచి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో వీరికి మంగళవారం శిక్ష ఖరారైంది.

News February 19, 2025

ఒంగోలు: రెవెన్యూ సదస్సుల అర్జీలపై నిర్లక్ష్యం వద్దు

image

రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని తహశీల్దార్లకు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. మంగళవారం ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో ఒంగోలు, కొత్తపట్నం, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండల తహశీల్దార్లతో జేసీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవిన్యూ సదస్సులు నిర్వహించినందున, వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని JC ఆదేశించారు.

error: Content is protected !!