India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాధారణ బదిలీల్లో భాగంగా ఒంగోలు మహిళ పోలీస్ స్టేషన్కు నూతన డీఎస్పీగా వి.వి. రమణ కుమార్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పీ ఆయనకు పలు సూచనలు చేశారు. శక్తి యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని కనిగిరి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సెలవు అని చెప్పి ఈత కోసం బావులు, చెరువులు వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు వాళ్ల పిల్లలపై శ్రద్ధ వహించాలని కోరారు.
ఒంగోలులో అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేడ్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. HCM కళాశాల సెంటర్, కలెక్టరేట్ సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డీఆర్ఓ చిన్న ఓబులేసు, వివిధ దళిత సంఘాల నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ గురించి కొనియాడారు.
దర్శికి చెందిన అన్నిబోయిన లక్ష్మి (45) కురిచేడు మండలం బోధనంపాడు వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పొలాల్లో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో కొట్టి చంపేశాడు. తరువాత అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిన్న ఇంటర్ రిజల్ట్స్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో 63 శాతం ఉత్తీర్ణతతో 19వ స్థానం, సెకండ్ ఇయర్లో 79 శాతంతో 16వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫస్ట్ ఇయర్లో 72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం, సెకండ్ ఇయర్లో 59 శాతంతో 15వ స్థానంలో నిలిచారు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యార్థులు ఈ ఏడాది, గత ఏడాదికంటే మంచి మార్కులు సాధించిన ర్యాంకుల విషయంలో ఒక స్థానం కిందకి వెళ్లింది.
ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు తమ సత్తా చాటి జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంపీసీ గ్రూప్లో బండి హర్షిని, కావలి హేమలత, ఎనిమి రెడ్డి సిరి 991/1000 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా, బైపీసీలో పాలకీర్తి హారిక 991/1000 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని కళాశాల బృందం అభినందించింది.
వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు. కొండపి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా మున్ముందు పనిచేస్తామన్నారు.
సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సంకటి వైష్ణవి జాతీయ స్థాయి INSTO మ్యాథమెటిక్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె శనివారం మంత్రి స్వామిని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలాంటి విజయాలతో మున్ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
సోషల్ మీడియా మాధ్యమాలలో ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏఅర్.దామోదర్ శనివారం హెచ్చరించారు. మహిళలపై ఫోన్లలో, సోషల్ మీడియా మాధ్యమాలలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో 96% ఉత్తీర్ణత సాధించిన గురుకుల పాఠశాలల విద్యార్థులకు మంత్రి స్వామి శనివారం అభినందనలు తెలిపారు. ఈ ఉత్తీర్ణత సాధనలో భాగస్వాములైన గురుకుల సంస్థ ఉన్నతాధికారులకు, ఉపాధ్యాయులకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇలాంటి విజయాలను కొనసాగిస్తూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.