Prakasam

News August 26, 2025

ఒంగోలు: 24 ఏళ్ల తర్వాత జైలుశిక్ష

image

హనుమంతునిపాడు మండలానికి చెందిన ధనేకుల తిరుపతయ్య 2000వ సంవత్సరం సెప్టెంబర్ 4న బాలిక ఉన్న షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూల్‌డ్రింక్ తీసుకుని తాగాడు. తర్వాత బాలికను బయటకు పిలిచి నోరు మూసిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. నేరం రుజువు కావడంతో 24 ఏళ్ల తర్వాత ఒంగోలు కోర్టు అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.7వేల జరిమానా విధిస్తూ నిన్న తీర్పు చెప్పింది.

News August 26, 2025

చిన్నారిని హింసించిన వ్యక్తికి జైలు శిక్ష

image

నాగులుప్పపాడు మండలం మాచవరంకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి ఒంగోలు కోర్టు సోమవారం 2 సంవత్సరాలు జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధించింది. ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న ముద్దాయి మహిళ కూతురైన చిన్నారిని తమకు అడ్డుగా ఉందని పలుమార్లు హింసించాడు. విచారించిన కోర్టు సాక్షదారాలు పరిశీలించి నిందితుడికి జైలు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కోమల వల్లి తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని ఎస్పీ తెలిపారు.

News August 26, 2025

అర్జీదారులతో మర్యాదగా మెలగాలి: కలెక్టర్

image

అర్జీదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం అనంతరం కలెక్టర్, అధికారులతో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించేలా శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.

News August 26, 2025

విద్యార్థులు లక్ష్యసాధన చేయాలి: కలెక్టర్

image

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థులకు సూచించారు. సోమవారం ఒంగోలులో వసతి గృహాలకు సంబంధించి విద్యార్థులను JD శీలం పరివర్తన భవనంలోకి షిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు.

News August 25, 2025

ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష.!

image

ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.7వేల జరిమానాను విధిస్తూ ఒంగోలు ఫోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిందితుడికి జైలు శిక్ష ఖరారుకావడంలో సరైన ఆధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. హనుమంతునిపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి, 2000 సంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో కేసు నమోదు కాగా, సదరు వ్యక్తికి మూడేళ్ల శిక్ష ఖరారైంది.

News August 25, 2025

జిల్లాలో సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు

image

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగు నేత్రదాన పక్షోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 40 జాతీయ పక్షోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేత్రదానం చేయండి.. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించండి అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించాలన్నారు. మరణానంతరం 6-8 గంటల్లో నేత్రదానం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.

News August 25, 2025

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 80 ఫిర్యాదులు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లా ఎస్పీ దామోదర్ మీకోసం కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను, ఫిర్యాదులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ అధికారులకు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 25, 2025

ఉద్యోగం పేరిట మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

image

ప్రభుత్వ ఉద్యోగం పేరిట ఓ వ్యక్తి తమను మోసంచేసినట్లు పలువురు బాధితులు సోమవారం జిల్లా ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. కొనకనమిట్లలో గల ఒక ప్రైవేటు ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమని నమ్మించి, రూ.5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు బాధితులు వాపోయారు. 16 నెలలపాటు పనిచేసిన తర్వాత ఉద్యోగం తొలగించారని, ప్రభుత్వ ఉద్యోగమని నమ్మి తాము మోసపోయామని, న్యాయం చేయాలని వారు కోరారు.

News August 25, 2025

రియాజ్ అను నేనుకు.. బాలినేని ఎక్కడ?

image

ఒంగోలు అర్బన్ అథారిటీ ఛైర్మన్‌గా రియాజ్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి TDP ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల జనసేన MLAలు, నాయకులు హాజరయ్యారు. అయితే ఎన్నికల అనంతరం జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గైర్హాజరు కావడం విశేషం. అసలు బాలినేనికి ఆహ్వానం అందిందా లేదా అన్నదే ప్రశ్న. ఇటీవల ఒంగోలులో నిత్యాన్నదానం ప్రారంభిస్తానని ప్రకటించిన బాలినేని కార్యాచరణ ఎవరికీ అంతుచిక్కడంలేదట.

News August 25, 2025

పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలి: కలెక్టర్

image

పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్లపై బోర్డు రీజనల్ మేనేజర్ రామారావు, ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ రాజుదొరైలతో సోమవారం ఒంగోలులోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. కొనుగోళ్లకు సంబంధించి పొగాకు కంపెనీలు ఇచ్చిన ముందస్తు రిక్వైర్మెంట్స్, జిల్లాలో పొగాకు ఉత్పత్తిపై కలెక్టర్ ఈ సందర్భంగా ఆరా తీశారు.