Prakasam

News December 1, 2024

వేమవరం వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

image

బల్లికురవ మండలంలోని వేమవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన మునీర్ బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరిపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేమవరం వద్ద వీరి బైక్‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఖాన్సా (13 నెలలు) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

News December 1, 2024

మాగుంట హత్యకు నేటికి 29 ఏళ్లు..!

image

ప్రకాశం జిల్లాలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి. నెల్లూరుకు చెందిన ఆయన 1991లో ఒంగోలు MPగా గెలిచారు. మాగుంట ట్రస్ట్‌తో పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ, కళాశాల నిర్మాణాలు చేపట్టారు. ఆయనను పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) నక్సలైట్లు 1995 డిసెంబర్ 1న హత్య చేశారు. ఆయన సతీమణి పార్వతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. సోదరుడు శ్రీనివాసుల రెడ్డి ప్రస్తుతం ఒంగోలు MPగా ఉన్నారు.

News November 30, 2024

మద్దిపాడులో చిన్నారి మృతి

image

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు సూర్య ఓ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా గేటు ఊడి బాలుడిపై పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన బాలుడు అక్కడే పనిచేస్తున్న వాచ్‌మెన్ మనవడు అని సమాచారం.

News November 30, 2024

బాలినేని తనయుడిపై సంచలన ఆరోపణలు

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తనయుడు ప్రణీత్ రెడ్డిపై డాక్టర్ యాదాల అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘గత ఎన్నికల ముందు చినగంజాం MPP అంకమరెడ్డి నన్ను ప్రణీత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సంతనూతలపాడు టికెట్ కోసం ఫోన్‌పేలో రూ.10 లక్షలు, క్యాష్‌గా మరో 15 లక్షలు ఇచ్చా. టికెట్ రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరా. కులం పేరుతో నన్ను తిట్టారు’ అని అశోక్ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 30, 2024

చీమకుర్తిలో కిడ్నాప్ 

image

ప్రకాశం జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మడగడ గ్రామానికి చెందిన దినేశ్(16)ని కిడ్నాప్ చేశారు. ఈక్రమంలో అతడిని చీమకుర్తి గాంధీనగర్‌లో ఉంటున్న అరవింద్ అనే వ్యక్తి ఇంటికి కిడ్నాపర్లు తీసుకు వచ్చారు. దినేశ్ వారి నుంచి తప్పించుకుని చీమకుర్తి పోలీసులను ఆశ్రయించాడు. CI సుబ్బారావు కిడ్నాపర్లను వెంబడించి ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు.

News November 28, 2024

రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం TN-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.

News November 28, 2024

పెట్లూరు సచివాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి స్వామి

image

కొండపి మండలం పెట్లూరులో గ్రామ సచివాలయాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డుల పరిశీలించి, నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. సేవలన్నీ ప్రజలకు సకాలంలో అందించాలని ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.

News November 28, 2024

టంగుటూరు మహిళ హత్య కేసులో కీలక UPDATE

image

టంగుటూరులో మంగళవారం జరిగిన<<14720727>> హైమావతి హత్య కేసు దర్యాప్తును<<>> పోలీసులు ముమ్మరం చేశారు. మృతురాలి భర్త, ఇతర అనుమానితుల కాల్ డేటాను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోపక్క చుట్టుపక్కల CC కెమెరాలను చెక్ చేస్తున్నారు. అప్పటికీ మిస్టరీ విడకపోతే ఇతర కోణాలలో దర్యాప్తు చేస్తామన్నారు. హైమావతిది పేద కుటుంబం కాబట్టి ఆమెను దొంగలు హత్యచేసే అవకాశాలు తక్కువని పోలీసులు అనుమానిస్తున్నారు.

News November 28, 2024

కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్.!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో 2 కీలకమైన నిర్మాణాలు జరగనున్నాయి. స్వయంగా CM చంద్రబాబే ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి దశ కింద ఇప్పటికే పలు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని CM చంద్రబాబు చెప్పారు. రెండో దశ కింద వాడరేవు(చీరాల), కొత్తపట్నం(ఒంగోలు) వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని ప్రకటించారు. ఇదే జరిగితే జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

News November 27, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన MLA తాటిపర్తి

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విష ప్రచారం చేసి, ఇప్పుడు మా హయాంలో జరిగిన రీ సర్వే ప్రాజెక్టు గొప్పతనాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించి 500 కోట్ల రూపాయలు ప్రోత్సహకాలు తీసుకుంటుందని నిజం కాదా ?’ అని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు.