Prakasam

News November 24, 2024

ఒంగోలులో సంబరాలు జరుపుకున్న BJP నేతలు

image

మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా ఒంగోలులో BJP నాయకులు శనివారం రాత్రి బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ముందుగా ఒంగోలులో ర్యాలీ నిర్వహించిన నాయకులు మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చర్చి కూడలి వద్ద బాణసంచాలో కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News November 23, 2024

పెద్దారవీడు మండలంలో వివాదాస్పద ఘటన

image

పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పశువులను మేతకోసం తీసుకువచ్చిన సందర్భంలో.. అటవీశాఖ అధికారులు తమపై దాడి చేశారని పశువుల కాపర్లు ఆరోపించారు. పశువుల కాపరి వెంకటేశ్వర్లును అటవీశాఖ అధికారులు కొట్టడంతో గాయాలయ్యాయని మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అయితే అటవీశాఖ అధికారులు తమపైనే పశువుల కాపర్లు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 23, 2024

ఎందుకు నన్ను చూస్తే భయమేస్తోంది: తాటిపర్తి

image

కూటమి ప్రభుత్వం ఆర్థిక దోపిడీ చేయడానికి PAC ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వలేదని యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ‘పీయూసీ కమిటీ మెంబర్‌గా నామినేషన్ వేసిన నేనంటే చంద్రబాబు కుమారుడికి ఎందుకంత భయం? ఎందుకు ఇన్నిన్ని కేసులు పెడుతున్నారు? దళితులకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా? మాదిగ జాతి బిడ్డలను ఇలా హింసించడం దారుణం. చంద్రబాబును దెబ్బకు దెబ్బ తీస్తాం’ అని ఎమ్మెల్యే హెచ్చరించారు.

News November 22, 2024

ఒంగోలు: ఇతను విమానాల్లో తిరిగే దొంగ

image

మధ్యాహ్న సమయంలో మాత్రమే దొంగతనాలు చేసే వ్యక్తి తిరుపతి పోలీసులకు చిక్కాడు. ప్రకాశం(D) సింగరాయకొండ(M) సోమరాజుపల్లికి చెందిన గురువిళ్ల అప్పలనాయుడు(29), చెడు అలవాట్లకు బానిసై 16వ ఏట నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. విమానాల్లో తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తుంటాడు. తిరుపతిలోని ఓ ఫైనాన్స్ ఆఫీసులో ఈనెల 15న రూ.8 లక్షలు దొంగలించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరాయకొండ, ఒంగోలు, విశాఖలో ఇతనిపై 18 కేసులు ఉన్నాయి.

News November 22, 2024

నామినేషన్ వేసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

image

అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) సభ్యుల ఎన్నికకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈయన వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా 5477 ఓట్లతో గూడూరి ఎరిక్షన్ బాబుపై గెలిచారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు.

News November 22, 2024

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం ఎస్పీ

image

పట్టణాలు, గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను గుర్తించడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం ఎస్పీ దామోదర్ సూచించారు. ప్రజలు, విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పర్యవసనాలు, గుడ్, బ్యాడ్ టచ్, రోడ్డు ప్రమాదాల నివారణలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

News November 20, 2024

అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి

image

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఊచలు లెక్కపెట్టక తప్పదని మంత్రి స్వామి అన్నారు. మంగళవారం విశాఖలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి ఘటనకు సంభందించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదు వచ్చిన గంటలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

News November 20, 2024

శాసనమండలిలో మంత్రి గొట్టిపాటి ఫైర్

image

శానసమండలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు.అవగాహన, ముందు చూపు లేని సీఎం వల్ల విద్యుత్ శాఖలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, పెరగనున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా అడుగులేస్తోందన్నారు.

News November 20, 2024

మర్రిపూడి: భార్య అంత్యక్రియలు చేసిన కాసేపటికి భర్త మృతి

image

మర్రిపూడి మండలం చెంచిరెడ్డిపల్లెలో విషాదకర ఘటన జరిగింది. భార్య తిరుపాలమ్మ(75) అంత్యక్రియలు ముగిసిన కాసేపటికి దిబ్బారెడ్డి (85) మృతి చెందాడు. భార్య అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మృతి చెందగా.. మంగళవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. స్మశాన వాటిక నుంచి ఇంటి కొచ్చిన కాసేపటి దిబ్బారెడ్డి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News November 20, 2024

చీరాలలో మళ్లీ మొదలైన రాజకీయ చర్చ

image

CM చంద్రబాబు సోదరుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా అంత్యక్రియల కార్యక్రమానికి చీరాల మాజీ MLA, ప్రస్తుత YCP ఇన్‌ఛార్జ్ తండ్రి బలరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన CM, మంత్రి లోకేశ్‌తో ఒకే వరుసలో కూర్చుని పలకరించుకోవడం చీరాల రాజకీయాల్లో మళ్లీ చర్చాంశనీయంగా అయ్యింది. గత నెలలో గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో CMతో ఆయన మాట్లాడటం, యాథృచ్ఛికమా లేక రాజకీయ అవసరమా అని పలువురు చర్చించుకుంటున్నారు.