India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టే సి.సి రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులు డిసెంబర్ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ అధికారులతో సమావేశమై, పల్లె పండుగ కార్యక్రమంలో మంజురైన 1140 కొత్త పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు, డ్వామా, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఉన్నారు.
ప్రకాశం జిల్లాలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఒంగోలు మేయర్ సైతం టీడీపీ గూటికి చేరారు. తాజాగా వైసీపీకి పెద్దగా ఉన్న మరో సీనియర్ నేత కరణం బలరామ్ తన కుమారుడు వెంకటేశ్తో కలిసి ఆ పార్టీని వీడుతారని తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరు వైసీపీని వీడటంపై మీ కామెంట్ ఏంటి?
పొదిలి – మార్కాపురం రోడ్డులో రెండు ఆటోలు ఢీకొన్న ఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం నుంచి పొదిలి వైపుగా వెళుతున్న ఆటోను పొదిలి నుంచి మార్కాపురం వైపుకు వస్తున్న ఆటో ఒకదాన్ని మరొకటి ఎదురుగా ఢీకొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లాపోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిబ్బందిలో ఐక్యతాభావం పెంపొందేలా పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు.
ఆస్తుల గొడవలతో పెద్దాయన(YS) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YS ఉన్నప్పుడే జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈదోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. ఆయన అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. మా ఆస్తులు మైనస్ అవుతుంటే వాళ్ల ఆస్తులు తరాలు కూర్చుని తిన్నా తరగనవిగా ఎలా మారాయి’ అని ప్రశ్నించారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడియం ఆదిలక్ష్మి(42), మల్లవరపు సుబ్బారెడ్డి (55) బర్రెలను మేపడానికి పొలం వెళ్లారు. బర్రెలు నీటిలోకి వెళ్లాయని మూసీ నది దాటుతుండగా నీటి ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు. ఆదిలక్ష్మి మృతదేహం బుధవారం లభించగా.. గల్లంతైన సుబ్బారెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తాజాగా అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 18,19,566 చేరింది. ఇందులో పురుషుల సంఖ్య 9,06,234 కాగా, మహిళా ఓటర్లు 9,13,218 మంది ఉన్నారు. వీరిలో థర్డ్ జండర్ 114 మంది ఉన్నారు. జిల్లాలో పురుషులకంటే 6,984 మహిళా ఓటర్లే అధికం. జనవరి 6న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు అధికారులు కూటమి మంత్రులు, MLAలు ఇన్ఛార్జులు వచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రులు నిమ్మల రామానాయుడు, స్వామి, గొట్టిపాటి, MP మాగుంట, MLAలు ఉగ్రా, దామచర్ల, కందుల, ఇన్ఛార్జులు గొట్టిపాటి లక్మీ, ఎరిక్షన్ బాబు ద్విచక్ర వాహనాలపై వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఫోటో వైరల్ అవుతుంది.
MRP కంటే అధిక రేట్లకు మద్యం అమ్మితే చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు మద్యం అమ్మితే షాపులను సీజ్ చేసి కేసుల నమోదు చేయాలన్నారు. జిల్లాలో బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం కట్టడి చేయాలని అధికారులకు సూచించారు.
పొన్నలూరు మండలంలోని నాగిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఎస్ఐ అనూక్ మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. కనిగిరి నుంచి వస్తున్న ఓ కారుని ఆపి తనిఖీ చేశారు. కారులోని మహిళ వద్ద ఏడాది బాబు ఉండటంతో పాటు ఆమె మాటలకు అనుమానం వచ్చి విచారించినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఆ బాలుడుని కావలిలో కిడ్నాప్ చేసినట్లు మహిళ అంగీకరించిందని ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.