India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వైసీపీ నాయకుల మాదిరిగా తాము తప్పుడు పనులు చేయమని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామంటూ మంత్రి స్వామి అన్నారు. కొండేపిలో నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి స్వామి మాట్లాడారు. ఒక్కొక్క హామీని తాము నెరవేర్చుకుంటూ వస్తున్నామని, వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు.

పొదిలి మండలం కాటూరి వారి పాలెంకు చెందిన పేదల పార్టీ అనే రాజకీయ పార్టీకి జిల్లా ఎన్నికల అధికారి తమీమ్ అన్సారియా శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శికి నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయనందుకు నోటీసు జారీ చేశారు. వచ్చేనెల 8న ఎన్నికల అధికారి ముందు హాజరు కావాలన్నారు.

ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖాధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీపడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో DEO కిరణ్ పలువురు పాల్గొన్నారు.

జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో అక్రమంగా ఎరువులను నిల్వ ఉంచేవారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కేసు నమోదుచేస్తామన్నారు.

ప్రకాశం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన 47200 అర్జీలను పరిష్కరించినట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వివరించారు. ప్రజల అర్జీల పరిష్కారంపై ఒంగోలులోని కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించేలా, పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రకాశం జిల్లాలో భూగర్భ జలమట్టం మరింత పెరిగేలా గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భూగర్భ జల వనరులశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 20 మీటర్లకంటే ఎక్కువ భూగర్భ జలమట్టం ఉన్న గ్రామాల్లో, జలమట్టం పెరిగే అవకాశంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పీవీపురంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. భార్య రామలక్ష్మమ్మను భర్త వెంకటేశ్వర్లు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి 327 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సాగిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి అభ్యర్థులు ఉదయం నుంచే హాజరయ్యారు. అయితే 22 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు.

సెప్టెంబర్ 5న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్యంలు తమ పరిధిలోని ఎంఈఓలకు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. డిప్యూటీ DEOలు 25లోగా వాటిని పరిశీలించి 27న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.