India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల ఐదు వేల కోట్ల రూపాయల ఆక్వా కల్చర్ ఉత్పత్తులు ఎగుమతులకు నోచుకోలేకపోయాయని తెలిపారు. సముద్రంలోనే అవి నిలిచిపోయాయని అన్నారు. నేటి సమాజానికి స్వదేశీ ఉద్యమం మళ్లీ రావాలని ఆకాంక్షించారు.
డా. బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ డిగ్రీ రెండవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు వర్శిటీ ఎగ్జామ్స్ యూజీ డీన్ డా. జి. పద్మారావు ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఏప్రిల్లో జరిగిన డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 5,957 మంది విద్యార్థులు హాజరు కాగా 37.58 శాతం మంది ఉత్తీర్ణత చెందారన్నారు. రిజల్ట్స్ను జ్ఞానభూమి పోర్టల్లో చూడాలన్నారు.
కాశీబుగ్గలోని సాయి శిరీషా డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో 25న జాబ్ మేళా జరగనుంది. 18 నుంచి 34 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు అర్హులని ఆ సంస్థ అధికారి సాయికుమార్ తెలిపారు. 16 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.
పీ-4 పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా ఏపీలో ముందంజలో నిలిచిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టర్లో మాట్లాడారు. 64,166 బంగారు కుటుంబాల్లో 61,552 కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా లక్ష్యం చేరుకున్నామని వెల్లడించారు. దీంతో 1,55,804 లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. రహదారుల మీదుగా వేలాది మొక్కలు నాటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పలాస రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ-డివిజనల్ మేనేజరు, పోస్ట్లకు జిల్లా సెలక్షన్ కమిటీ నియామక పరీక్ష ఆగస్టు 10వ తేదీన నిర్వహించారు. దీనిపై అభ్యంతరాలను ఆగస్టు 22వ తేదీలోగా తెలియజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. https://srikakulam.ap.gov.in వెబ్సైట్లో ఆ రోజు సాయంత్రం 5లోగా తెలియజేయవచ్చన్నారు.
గణేశ్ చతుర్థి వేడుకలు పర్యావరణహితంగా జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లో పర్యావరణహిత గణేశ్ చతుర్థి పోస్టర్ను ఆవిష్కరించారు. మట్టి వినాయక విగ్రహాలను వాడటం ద్వారా నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చని, భక్తి-ప్రకృతి రెండింటినీ కాపాడే బాధ్యత మనందరిదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా నిర్వహించారు. వర్ష నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇతర శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎంపిక ప్రక్రియకు హాజరై సివిల్, APSP, SCT PC ఉద్యోగాలకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు తండేవలస పోలీసు శిక్షణ కేంద్రం వద్ద ఈ నెల 20న హాజరు కావాలని SP మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఎంపిక సమయంలో జతపరిచిన ఒరిజినల్ సర్టిఫికెట్స్, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 3 కలర్ ఫొటోలతో ఉదయం 9 గంటలకు హజరుకావాలన్నారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో, మంగళవారం ఉదయం 8.30 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో 1120.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధికంగా మెళియాపుట్టి మండలంలో 89.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, అతి తక్కువగా కంచిలి మండలంలో 4.8 మిల్లీమీటర్లు రికార్డు అయింది.
శ్రీకాకుళం జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు మంగళవారం కూడా అధికారులు సెలవును ప్రకటించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చిన్నారులకు సెలవును కొనసాగించినట్లు చెప్పారు. కాగా అంగన్వాడీ సిబ్బంది కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఐసీడీఎస్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. వర్షాలకు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తిన ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.