Srikakulam

News September 15, 2024

మెలియాపుట్టి: ఆంపురంలో విషాదం.. చిన్నారి మృతి

image

మెలియాపుట్టి మండలం ఆంపురం గ్రామంలో శనివారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నివేదిక అనే నాలుగు నెలల చిన్నారి అనారోగ్యంతో మృతిచెందింది. నాలుగు రోజులుగా చిన్నారి ఆరోగ్యం బాలేకపోవడంతో కుటుంబసభ్యులు పాతపట్నం, నరసన్నపేట ఆసుపత్రిలో చికిత్స అందించారు. శుక్రవారం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో కార్డియాక్ అరెస్ట్‌తో శనివారం చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News September 14, 2024

SKLM: అన్నదాతలకు యూరియా కరవు..!

image

జిల్లాలో 3,41,775 ఎకరాల్లో వరి సాగు చేశారు. రైతుభరోసా కేంద్రాల్లో యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు సుమారు 25,155 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేశారు. వీటిలో యూరియా కేవలం 17వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. ఎకరా వరి సాగుకు మూడు విడతల్లో 50 కేజీల వరకూ యూరియా వినియోగిస్తారు. ఈ లెక్కన జిల్లాలో సాగుకు సంబంధించి 35వేల మెట్రిక్‌ టన్నుల వరకూ యూరియా అవసరం కాగా రైతుభరోసా కేంద్రాల్లో అరకొరగానే పంపిణీ చేస్తున్నారు.

News September 14, 2024

శ్రీకాకుళం రోడ్డు వరకే ప్రయాణించనున్న మెము రైళ్లు

image

పూండి- నౌపాడ, తిలారు- కోటబొమ్మాళి సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ భద్రతా పనులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19, 21 తేదీలలో విశాఖ- పలాస మధ్య ప్రయాణించే మెము రైళ్లను(నం.07470, 07471) శ్రీకాకుళం రోడ్డు వరకే నడపనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్నందున ఆయా తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు- పలాస స్టేషన్ల మధ్య ఈ రైళ్ల రాకపోకలను రద్దు చేశామన్నారు.

News September 14, 2024

శ్రీకాకుళం: ఈ నెల 17 నుంచి స్వచ్ఛతాహి సేవ: కలెక్టర్

image

ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలో స్వచ్ఛతాహి సేవ సేవా కార్యక్రమం నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News September 14, 2024

SKLM: పలాస జీడిపప్పు .. శ్రీనివాసుడి చెంతకు..!

image

అంతర్జాతీయ స్థాయిలో పలాస ఉద్దానం జీడిపప్పు నోరురుంచేది. ఇప్పుడు TTD ప్రసాదం లడ్డూ రూపంలో యాత్రికుల చెంతకు చేరనుంది. జాతీయ స్థాయిలో తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే వస్తువుల్లో జీడిపప్పు కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇకపై ఈ లడ్డూలో పలాస జీడిపప్పుకు స్థానం దక్కనుంది. ఇటీవల టెండర్లు వేయగా పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోష్‌ TTDకి జీడిపప్పు సరఫరా చేసే భాగ్యం లభించింది.

News September 14, 2024

రాజాం: డీజే సౌండ్‌కు యువకుడు కుప్ప కూలిపోయాడు

image

రాజాం మున్సిపాలిటీ పరిధిలో పొనుగుటివలసలో శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో డీజే సౌండ్‌కు గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల యువకుడు వావిలపల్లి వినయ్ గుండె పోటుకు గురయ్యాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న వినయ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే స్నేహితులు రాజాంలో ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నంలో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News September 14, 2024

SKLM: సెబ్ కానిస్టేబుల్ విజయ్‌పై వేటు

image

భార్య అనూష మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్‌ను సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సెబ్ డీఎస్‌ఈవో తిరుపాలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. సెబ్ కానిస్టేబుల్ అనూష మృతిచెందిన ఘటనలో విజయ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

News September 14, 2024

SKLM: రిమ్స్‌లో నవజాత శిశువు మృతి

image

నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం అంగన్వాడీ కేంద్రం వద్ద మతిస్థిమితం లేని మహిళ అప్పాజీ ఈనెల 8వ తేదీన రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నెలల వయస్సు, బరువు తక్కువగా ఉన్న శిశువును శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.

News September 14, 2024

శ్రీకాకుళం: అధ్వానంగా రోడ్డు

image

శ్రీకాకుళం వెళ్లే మార్గమధ్యలో రాగోలు వద్ద రోడ్డు అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు మొత్తం బుదరమయంగా మారింది. భారీ వాహనాలు కొన్ని బుదరలో కూరుకుపోయాయి. ఈ మార్గలో రాకపోకలు సాగించే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మీ ఏరియాలోనూ రోడ్లు ఇలాగే ఉన్నాయా? ఉంటే ఎక్కడో కామెంట్ చేయండి.

News September 13, 2024

ఇచ్చాపురం: కిడ్నీ వ్యాధితో మరొకరి మృతి

image

సిక్కోలు జిల్లాలో కిడ్నీ రోగానికి మరొకరు బలయ్యారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం ఆశి వీధికి చెందిన దల్లి గురుమూర్తి(39) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం చనిపోయారు. ఆయనకు భార్య మాణిక్యం, ఇద్దరు కుమార్తెలు గీతా, శ్రావణి, కుమారుడు తేజ ఉన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.