India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తీరం దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇప్పటికే సంబంధిత అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో వర్షాల నేపథ్యంలో సోమవారం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ చిన్నారులకు సెలవు ప్రకటించినట్లు ఐసీడీఎస్ పీడీ ఐ.విమల తెలిపారు. అయితే కార్యకర్తలు, సహాయకులు కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా స్టాక్ నిల్వలను భద్రంగా ఉంచాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. సిబ్బందిపై సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయాలని ఆమె స్పష్టం చేశారు.
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీకి సోమవారం సెలవు ప్రకటించారు. స్థానిక వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కె.ఆర్. రజిని ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలకు కూడా సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
19, 20 తేదీల్లో విశాఖలోని జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. శ్రీధర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి ఇప్పటికే సమాచారం అందించామన్నారు. వారందరూ శ్రీకాకుళం కోడి రామమూర్తి మున్సిపల్ స్టేడియంకు 19న ఉదయం 5 గంటలకు హాజరు కావాలన్నారు. పూర్తి సమాచారానికి 98850 96734 నంబర్ను సంప్రదించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో తుఫాన్ అలర్ట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 వరకు అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని తెలియజేశారు. నిత్యావసర వస్తువులు నిల్వలు ఉంచాలని సూచించారు.
ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో తుఫాన్ అలర్ట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 వరకు అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని తెలియజేశారు. నిత్యావసర వస్తువులు నిల్వలు ఉంచాలని సూచించారు.
➤టెక్కలి: జాతీయ రహదారిపై ఢీకొన్న వాహనాలు
➤SKLM: తుఫాన్ కంట్రోల్ రూంలు ఏర్పాటు
➤ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
➤ జిల్లా వ్యాప్తంగా వర్షాలు..పలుచోట్ల వరి పంట ముంపు
➤పాతపట్నం: మూడు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు
➤ నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు
➤హిరమండలం: గొట్టా బ్యారేజ్కు భారీగా చేరుతున్న నీరు
➤ టెక్కలి: డీజిల్ ట్యాంకర్ బోల్తా..తప్పిన ప్రమాదం
శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం కలెక్టర్ సెలవు ప్రకటించారు. వాయుగుండం ప్రభావం వల్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. రేపటి సెలవు దినాన్ని మరో రోజు పనిచేయవలసి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని అచ్చెన్నాయుడు అధికారులను సూచించారు. ఈ మేరకు నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ వంటి నదుల తీరంలో ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.