India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బతుకు తెరువు దుబాయ్కి వెళ్ళిన మజ్జి శివ(24) అనే యువకుడు బుధవారం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించాడు. కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన శివ తండ్రి తన చిన్నతనంలోనే చనిపోవడంతో తన తల్లి ఎన్నో కష్టాలతో పెంచింది. తల్లి పడుతున్న కష్టాలు చూసి ఆరు నెలల క్రితం దుబాయికి శివ వెళ్లాడు. ఇంతలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్లో సీటు వచ్చిన అభ్యర్థులు కళాశాలలకు సెల్ఫ్ రిపోర్ట్ చేసేందుకు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. మూడో విడత కౌన్సిలింగ్లో మొత్తం 1765 మందికి ప్రవేశాలు కల్పించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం నాలుగు ఇంజినీరింగ్ కాలేజీల్లో 82 శాతం ప్రవేశాలు నమోదయ్యాయి. అభ్యర్థులకు ఎటువంటి సమస్యలు ఉన్న శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి.
పింఛనుదారులకు సెప్టెంబరు నెలకు సంబంధించిన పింఛను ఈ నెల 31న ఇస్తున్నట్లు కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా 732 సచివాలయాల పరిధిలోని 3,16,883 మంది లబ్ధిదారులకు రూ.129.35 కోట్ల నగదును సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందజేస్తారని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఆ రోజు అందుబాటులో ఉండాలన్నారు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఎరువుల కొరత అంశాన్ని ప్రస్తావించడంతో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మార్క్ ఫెడ్ ఉన్నాతధికారులను గురువారం ఆదేశించారు. జిల్లాకు 820 టన్నుల డిఏపి, 760 టన్నుల యూరియా సరఫరాకు చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచే రైతులకు పంపిణీ చేయాలన్నారు.
కంచిలికి చెందిన ఆటో చోదకుడు లాబాల కామరాజు కుమార్తె ఝాన్సీ (7)కి ఈనెల 14న ఆమెకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు కంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని కేజీ హెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి కన్ను మూసింది. మండల పరిధిలో విషజ్వరాల వ్యాప్తి పెరుగుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో గురువారం పలు మండలాలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళంలో 26.0 మిల్లీమీటర్లు, ఆమదాలవలస 26.75, సంతబొమ్మాళి 29.5, రణస్థలం 16.0, కవిటి 8.5, పలాస 12.25, నందిగాం 7.5, ఇచ్ఛాపురం 19.75, ఎచ్చెర్ల 17.75, హిరమండలం 5.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జిల్లా స్థాయి DCC, DLRC సమావేశం కలెక్టరేట్లో గురువారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాల మంజూరు, గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు, ప్రభుత్వ శాఖలవారీగా కలెక్టర్ సమీక్షించారు.
విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించి, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తున్నట్టు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లావేరు పోలీసు స్టేషన్ ఎస్ఐ లక్ష్మణరావు వెంకటాపురం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. అతివేగం, ఓవర్ లోడ్తో వెళ్లిన వాహనాలను గుర్తించి రోడ్డు నియమాలు పాటించాలన్నారు.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రేపు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
సచివాలయంలో ప్రజల నుంచి గురువారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అరాచక పాలనతో నష్టపోయిన పలువురు బాధితులు తమ బాధలు తెలియజేశారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి అర్జీ తప్పకుండా పరిష్కారం అవ్వాలని సూచించారు. అర్జీల పరిష్కరంలో అలసత్వం వహించరాదన్నారు.
Sorry, no posts matched your criteria.