Srikakulam

News August 28, 2024

శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా 1.19 లక్ష పశువులకు టీకాలు

image

శ్రీకాకుళం జిల్లాలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1,19,246 పశువులకు టీ కాలు వేసామని జిల్లా పశుసంవర్థక సంయుక్త సంచాలకులు డా.వి.జయరాజు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం కోటబొమ్మాలి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం 593 పశువులకు టీకాల కార్యక్రమాలు నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.లోకనాధం, డా.లఖినేని కిరణ్ కుమార్, ప్రజ్ఞ, తదితరులు పాల్గొన్నారు.

News August 28, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే నం.22643 పాట్నా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 23 వరకు విజయవాడ- ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా ఈ ట్రైన్ నిడదవోలు చేరుకుంటుందని రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

News August 28, 2024

రెవెన్యూ సదస్సులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి: కలెక్టర్

image

త్వరలోజరగనున్న గ్రామ రెవెన్యూ సదస్సులకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌తో కలసి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్డీవోలు, తహశీల్దార్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి సిబ్బందితో సమీక్షించారు. ప్రతి గ్రామంలోను సభలు నిర్వహించాలన్నారు.

News August 27, 2024

శ్రీకాకుళంలో TODAY TOP NEWS

image

➥ ఉద్యోగాలపై కేంద్రం మంత్రి కీలక వ్యాఖ్యలు
➥ 6 నెలల్లో శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు పూర్తి
➥ తమ్మినేని పై ఎమ్మెల్యే కూన రవి ఘాటు వాక్యాలు
➥ హిరమండలం వంశధార కాలువలో దూకి వ్యక్తి మృతి
➥ ఇంజీనీరింగ్ ప్రవేశాలకు ఈనెల 30లోగా సెల్ఫ్ రిపోర్ట్
➥ పాలకొండ సబ్ కలెక్టర్‌గా యశ్వంత్ ➥ బాధితుని వద్దకి వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ
➥ జి.సిగడాంలో రైలు నుంచి జారీ మహిళ మృతి
➥ బూర్జ ఆయకట్టలో దెబ్బతిన్న షెల్టర్లు

News August 27, 2024

శ్రీకాకుళం: ఈనెల 30లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి

image

ఇంజినీరింగ్ ప్రవేశాల మూడో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల అలాట్మెంట్‌లను అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా సీటు వచ్చిన అభ్యర్థులు కళాశాలల్లో ఈనెల 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. జిల్లాలో మొత్తం నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తం సీట్లు 2154 కాగా 1903 ప్రవేశాలు జరిగాయి. 252 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వివరాలకు SKLM ప్రభుత్వ పాలిటెక్నిక్ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి.

News August 27, 2024

పలాస: ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పిన రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా హైదరాబాద్‌(HYB), కటక్(CTC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07165 HYB- CTC ట్రైన్‌ను నేడు మంగళవారం నుంచి సెప్టెంబరు 17 వరకు, నం. 07166 CTC- HYB ట్రైన్‌ను రేపు బుధవారం నుంచి సెప్టెంబరు 18 వరకు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.

News August 27, 2024

హిరమండలం: వంశధార కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

image

హిరమండలం మైత్రీ కాలనీకి చెందిన జోగి దుర్గాప్రసాద్ అనే యువకుడు వంశధార కుడి ప్రధాన కాలువలో దూకిగా సంఘటనలో మంగళవారం ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది. స్థానిక ఎస్సై నారాయణస్వామి మాట్లాడుతూ.. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్‌ను తల్లి సావిత్రమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు సోమవారం కాలువలో దూకాడు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.

News August 27, 2024

బూర్జ: షట్టర్లతో పాటు రెగ్యులేటర్ల‌కు లీకులు

image

బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట షట్టర్లు దెబ్బతినడంతో పాటు రెగ్యులేటర్ల లీకులు ఏర్పడటంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖరీఫ్‌లో రెగ్యులేటర్ల మరమ్మతులు చేపట్టినట్లయితే ఫలితం ఉంటుందని రైతులు అంటున్నారు. అయితే దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోకుండా వదిలేశారని వాపోయారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.

News August 27, 2024

పొందూరు: దిల్లీ కార్యాచరణకు సిద్ధం కావాలి

image

పొందూరు మండల కేంద్రంలో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల సహారా ఏజెంట్లు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బాధితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సహారా బ్యాంక్ ఖాతాదారుల తరఫున త్వరలో ఢిల్లీలో చేపట్టబోయే కార్యాచరణకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని సహారా కస్టమర్స్ అండ్ ఫీల్డ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బైపల్లి సత్యరాజు కోరారు.

News August 27, 2024

పాలకొండ సబ్ కలెక్టర్‌గా యస్వంత్ రెడ్డి

image

పాలకొండ సబ్ కలెక్టర్‌గా సి.యస్వంత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. యస్వంత్ రెడ్డి 2022 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఐఏఎస్ అధికారి నూరల్ కమర్ పాలకొండలో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. పాలకొండ సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారిని నియమించడం ఇది రెండోసారి. ప్రస్తుతం పాలకొండ ఆర్‌డిఓగా విధులు చేస్తున్న వివి రమణని బదిలీ చేశారు.