Srikakulam

News March 3, 2025

శ్రీకాకుళం: “Way 2 News”కు అనూహ్య స్పందన

image

కవిటి మండలం కపాసుకుద్ది గ్రామానికి చెందిన బడే జ్యోతి శనివారం రోజున ఉదయం ఆటోస్టాండ్‌లో విద్యార్హత సర్టిఫికెట్లు పోగొట్టుకుంది. ఈ మేరకు Way 2 Newsలో ‘సర్టిఫికెట్స్ పోగొట్టుకున్న యువతి’ అనే కథనం ప్రచురితమైంది. ఆదివారం కవిటి మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాప్ వద్ద సర్టిఫికెట్స్‌తో ఉన్న బ్యాగ్ తీసుకుని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా  Way2Newsకు కృతజ్ఞతలు తెలిపింది.

News March 3, 2025

పాతపట్నం: ట్రైన్ కింద పడి యువకుడు మృతి

image

పాతపట్నం, పర్లాకిమిడి రైల్వే స్టేషన్ మధ్య ఉన్న రైల్వే లైన్‌లో పూరి నుంచి గుణుపూర్ వెళ్తున్న ట్రైన్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం పూరి నుంచి గుణుపూర్ వెళ్తూ ప్రమాదవశాత్తూ ట్రైన్ కింద పడ్డాడు.. సిబ్బంది స్పందించి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి పేరు కే. బాలకృష్ణ పాతపట్నం మండలం బగంతర గ్రామముని తెలుస్తోంది.

News March 3, 2025

శ్రీకాకుళం: నేడే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ సోమవారం విశాఖలో జరగనుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని 31 కేంద్రాల్లో పోలింగ్ జరగగా 5,035 ఓట్లకు గాను 4,769 ఓట్లు పోల్ అయ్యాయి. 94.7 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరికివారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా విజయం ఎవరిని వరిస్తోంది అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

News March 2, 2025

SKLM: ఆదిత్యుని ఆదాయం

image

శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యుని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు.  మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారికి భక్తులు ఇచ్చిన విరాళాలు రూ. 68,837లు రాగా, టికెట్లు రూపేణా రూ.3,77,100 లు,  ప్రసాదాల రూపంలో రూ.1,73,460లు సమకూరయని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. 

News March 2, 2025

టెక్కలి: పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రూ.225

image

చికెన్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం నాటికి శ్రీకాకుళం జిల్లాలో లైవ్ చికెన్ కేజీ రూ.125 ఉండగా, స్కిన్(రూ.205), స్కిన్ లెస్ (రూ.225) అమ్మకాలు చేపట్టారు. బర్ద్ ఫ్లూ భయంతో మాంసాహార ప్రియులు చికెన్ కొనుగోలపై ఆసక్తి కనబరచక పోవడంతో చికెన్ ధరలు తగ్గాయి తాజాగా మూడు రోజుల వ్యవధిలో చికెన్‌ ధర సుమారు రూ.25 పెరగడంతో ఆదివారం నాటికి టెక్కలిలో కిలో చికెన్ రూ.220(స్కిన్‌లెస్) అమ్మకాలు చేపట్టారు.

News March 2, 2025

సంతబొమ్మాళి: మాజీ ఎంపీపీ కుమారుడి మృతి

image

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కర్రి కృష్ణవేణి కుమారుడు కర్రి నాగిరెడ్డి(33) శనివారం రాత్రి మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా కృష్ణవేణి 2014-2019 ఏడాదిలో సంతబొమ్మాళి ఎంపీపీగా ఉన్నారు. కృష్ణవేణి భర్త విష్ణుమూర్తి సంతబొమ్మాళి టీడీపీ సీనియర్ నాయకుడు. ఈ మేరకు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 2, 2025

శ్రీకాకుళం: 15 నుంచి ఒంటిపూట బడులు

image

వేసవి దృష్ట్యా ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఇతర కార్పొరేట్ పాఠశాలలు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఒంటిపూట బడులు అమలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పాఠశాల తరగతులు నిర్వహించనున్నారు.

News March 2, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ 4వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ నాలుగో సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు శనివారం విడుదల చేశారు. 2020, 2021, 2022, 2023 ఎడ్మిట్ విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి 14వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో ఉంటాయని తెలిపారు.

News March 2, 2025

SKLM: పెండింగ్ కేసులపై దర్యాప్తు వేగవంతం చేయాలి

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఏఎస్పీలు కెవి రమణ, పి. శ్రీనివాసరావు సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పెండింగ్లో ఉన్న కేసులు, మహిళా సంబంధిత నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర కేసులపై నేర సమీక్ష నిర్వహించారు. వీటిపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు కోర్టులో చేయాలన్నారు.

News March 1, 2025

శ్రీకాకుళం : ఒక్క నిమిషం .. వారి కోసం..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

error: Content is protected !!