Srikakulam

News August 25, 2024

శ్రీకాకుళం: ‘నకిలీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

నకిలీ అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖ సహాయ సంచాలకులు రాణి మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తదనుగుణంగా వ్యాపారులకు సమాచారం అందజేస్తున్నామని తెలిపారు. ఇటీవల కొందరు నకిలీ వ్యక్తులు జీఎస్టీ అధికారులంటూ చెబుతూ సంబంధిత సంస్థల్లోకి చొరబడుతున్నారని, ఎవ్వరైనా జీఎస్టీ అధికారులమని వస్తే ఐడీ చూపించాలని అడగాలన్నారు.

News August 25, 2024

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు అరుదైన అవకాశం

image

రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా ఆయా నగరాల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ జాబితాలో కాశీబుగ్గకు చోటు దక్కడంతో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ప్రకటించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News August 25, 2024

నేడు ఎచ్చెర్ల రానున్న కేంద్రమంత్రి

image

ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు క్యాంప్ కార్యాలయానికి ఆదివారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వస్తున్నారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుంటారని అన్నారు. కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని అన్నారు.

News August 25, 2024

భామిని: వంశధార నదిలో పడి వ్యక్తి మృతి

image

భామిని మండలం తాలాడ గ్రామానికి చెందిన కౌలురౌతు నిరంజన్ (50) వంశధార నది లో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం.. గురవారం వంశధార నదిని దాటి ఒడిస్సా లోని కాశీనగర్ వెళ్లారు. తిరిగి నదిని దాటే క్రమంలో ప్రవాహం అధికంగా ఉండటంతో గల్లంతయ్యాయి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం మృతదేహం లభించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

News August 25, 2024

నీట్ ప్రవేశ పరీక్షలో సంతబొమ్మాళి యువకుడు ప్రతిభ

image

నీట్-2024 ప్రవేశ పరీక్షలో సంతబొమ్మాళి యువకుడు ప్రతిభ కనబరిచాడు. సంతబొమ్మాళి మండలం ఆకులసతివాని పేటకు చెందిన నవీన్ పీజీ ప్రవేశ పరీక్షలో ఆలిండియా వేదికగా 260వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన నవీన్ పీజీ ప్రవేశపరీక్షలో ర్యాంకుపై స్థానికులు అభినందించారు. తండ్రి శంకర్ రావు టెక్కలి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

News August 24, 2024

శ్రీకాకుళం: ‘నూతన చట్టాలపై అవగాహన ఉండాలి’

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివారం పోలీస్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు, ప్రాపర్టీ స్వాధీనంలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించాలి అని, నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని నార్కో డ్రగ్స్, సైబర్ కేసులు దర్యాప్తు, నూతన చట్టాలపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ, పోలీస్ లీగల్ అడ్వైజర్‌లు పాల్గొన్నారు.

News August 24, 2024

ఆముదాలవలసలో ఇసుక దందా: వైసీపీ

image

ఆముదాలవలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు ఇసుక దందాకు పాల్పడుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘నారాయణపురం లంకలో ర్యాంప్‌ లేదు. అయినా అర్ధరాత్రి వేళ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు లారీలతో ఇసుకని తరలిస్తున్నారు. ఫ్రీ ఇసుక పేరు చెప్పి.. టీడీపీ నేతలు ఫ్రీగా దోచేస్తున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.

News August 24, 2024

శ్రీకాకుళం జిల్లాకు రూ.36.45 కోట్లు

image

జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36.45 కోట్లు విడుదలయ్యాయి. 30 మండలాల పరిధిలోని 896 గ్రామ పంచాయతీలకు 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత కింద ఈ నిధులు మంజూరయ్యాయి. వీటితో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలకు అనుగుణంగా పంచాయతీ ఖాతాలకు నిధులు జమ చేశామని ఇన్‌ఛార్జి డీపీవో ఆర్ వెంకట్రామన్ తెలిపారు.

News August 24, 2024

కట్నం కోసం వేధింపులు.. శ్రీకాకుళం వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

image

భార్యను అదనపు కట్నం కోసం వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ శ్రీకాకుళం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.శారదాంబ శుక్రవారం తీర్పు చెప్పారు. రణస్థలం మండలం జె.ఆర్.పురం గ్రామానికి చెందిన కొయ్యాన ఈశ్వరమ్మకు శ్రీకాకుళానికి చెందిన నల్లబారికి శ్రీనివాసరావుతో 2019లో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త తరచూ వేధిస్తుండటతో ఆమె మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News August 23, 2024

శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 61 మందికి ఉపాధి

image

శ్రీకాకుళంలోని నెహ్రూ యువ కేంద్రంలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఐఐఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నిరుద్యోగ యువత 113 మంది హాజరయ్యారు. ఇందులో 61 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా తెలిపారు.