India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. శుక్రవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల కోసం ఉన్నతాధికారులతో పలు అంశాలపై మంత్రి చర్చించారు. విజయవాడలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన ఆయన పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు.
శ్రీకాకుళంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు 23.93 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ఓటింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్లో ఫ్రెండ్స్తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.
కవిటి మండలం బెజ్జిపుట్టుగకు చెందిన రాజు, తొత్తిడిపుట్టుగకు చెందిన లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విషాదం నెలకొంది. ఒడిశా వివాహానికి వెళ్లి వస్తూ మంగళవారం రాత్రి చీకటిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైకుకు నిప్పు అంటుకోవడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మరణించాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాజు మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన నరేంద్ర చికిత్స పొందుతున్నాడు.
విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్లో ఫ్రెండ్స్తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.
ఎన్నికల మెటీరియలను సరి చూసుకోవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. మైక్రో అబ్జర్వర్, బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్, బింగో బాక్స్, బిగ్ బాక్స్ తదితర మెటిరియల్ను కలెక్టర్ పరిశీలించారు. మెటీరియల్పై భద్రత వహించాలని పోలీంగ్ సిబ్బందికి చెప్పారు.
నందిగాం మండలం హరిదాసుపురం గ్రామంలో దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. ఓ కుక్క పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. అయితే స్థానికులు నీరు పోసి బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. కాసేపటికి అక్కడకు చేరుకున్న తల్లి కుక్క రోధించిన తీరు గుండెల్ని పిండేసేలా చేసింది.
నందిగం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కొండాల గోపాలం అనే ఉపాధ్యాయుడిపై ఇటీవల నందిగం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి టెక్కలి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ మహమ్మద్ ఆలీ తెలిపారు. పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
సోంపేట మండలం బారువాకొత్తూరు గ్రామంలో యువతి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. బట్టిగళ్ళురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న గ్రామానికి చెందిన వాలిశెట్టి తులసి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళంలో 31 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఓటర్లుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వారందరికీ ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేయడమైనదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.