India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల రిజిస్ట్రేషన్ ఫీజు ఆఖరి తేదీ ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉదయభాస్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఫీజులు చెల్లించాలని తెలిపారు.
టెక్కలికి చెందిన వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాజీనామా లేఖను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్కు లేఖను పంపించారు. పార్టీలో జరుగుతున్న పరిస్థితులు, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం వైసీపీ నాయకురాలిగా మంజు ఉన్నారు.
విదేశాల్లో ఉద్యోగాల ఆశతో యువతను టార్గేట్ చేసి బ్యాంకాక్, కాంబోడియా, మయన్మార్ దేశాల్లో కంపేనీలకు భారతీయులను అప్పగిస్తూ మోసం చేస్తున్న శ్రీకాకుళంకు చెందిన ఎ.రిశిరాజ్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కేరళకు చెందిన ఏజెంటు ద్వారా చైనా సంబంధిత స్కామ్ జాబ్ కంపెనీల్లో చేర్పించి మోసగించాడన్నారు. 15న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఇమిగ్రేషన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన డి పోలరావు (48) మద్యం మత్తులో ఈనెల 21వ తేదీన కలుపు నివారణ గడ్డి మందు తాగడంతో మృతి చెందాడు. . బుడితి పీహెచ్సీలో చికిత్స అందించినప్పటికీ మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. గురువారం రిమ్స్లో పోలరావు మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నెహ్రూ యువ కేంద్రంలోని శుక్రవారం జాబ్ మేళాను నిర్వహించనున్నారు. రిలేషన్షిప్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ క్రికెట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 180 ఖాళీలు ఉన్నాయనీ కె. సుధ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
హిరమండలం మండలం భగీరథపురానికి చెందిన పడాల పార్థివ్ శ్రీ వత్సల్ అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. పార్థివ్ తల్లిదండ్రులు లక్ష్మీ, అప్పలనాయుడు టీచర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి సారి 1నుంచి 50 వరకు గణంకాలను 1:36 నిమిషాల్లో, 2వ సారి 1 నుంచి 100 వరకు గణంకాలను 4:24 నిమిషాల్లో, 3వ సారి అన్ని దేశాల జాతీయ జెండాలను 2:16 నిమిషాల్లో గుర్తించి రికార్డును సాధించాడని వివరించారు.
టెక్కలి మండలంలోని నర్సింగపల్లి, గూడెం, ముఖలింగాపురం పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాన్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ జీ.శంకర్ రావు గురువారం తెలిపారు. నర్సింగపల్లి 11 కెవి ఫీడర్ పై మరమ్మత్తులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. కావున విద్యుత్ వినియోగాదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ను ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హత సర్టిఫికెట్లపై సీఐడితో విచారణ జరిపించాలని ఆయనకు వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వ హాయంలో ఫిర్యాదు చేస్తే విచారణ జరగలేదని ఆయనకు తెలిపారు. విచారణకు ఆయన సానుకులంగా స్పందించారని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువకుడు విజయవాడ- హైదరాబాదు రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన సాదు సంతోష్ కుమార్ (23) హైదరాబాదులోని ఓ స్టూడియోలో పనిచేస్తున్నాడు. కొత్తగా బైక్ కొనుగోలు చేసిన అతను విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కుమ్మరిగుంటలో విషాదఛాయలు అలముకున్నాయి.
పాతపట్నం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్యామలరావును బుధవారం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఒడిశా నుంచి రాష్ట్రంలోకి మద్యం సీసాలు తీసుకొస్తున్న ఓ వ్యక్తిని తనిఖీ చేసి కేసు లేకుండా అవినీతికి పాల్పడినట్లు తేలడంతో కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు. పోలీసులు అనైతిక కార్యకలాపాలకు సహకరిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.