India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని DM &HO డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. శుక్రవారం తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలోని ఆదివారంపేట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన ఎఫ్.ఎం.ఎం కిట్లు పంపిణీలో పాల్గొన్నారు. ఫైలేరియా ( బోదకాలు) రోగులకు పలు సూచనలు చేశారు. రోగులకు ఫైలేరియా మార్బులిటి మేనేజ్మెంట్ కిట్లతో కలిగే ఉపయోగాలను ఆయన వివరించారు.
సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డ్ ప్రకటించింది. గతేడాది జులై 15న జమ్మూకశ్మీర్ దొడా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో డొక్కరి రాజేశ్ గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రూ.5 లక్షలు రివార్డును ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నాగావళి నది వంతెన కింద వ్యక్తి మృతదేహన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. స్థానికుల కథనం.. శ్రీకాకుళం మండలం తోట పాలెం జంక్షన్ వద్ద ఉన్న నీలమ్మ కాలనీకి చెందిన యాదవ రెడ్డి రాజు (40) గా గుర్తించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం నగరంలోని పందుంపుళ్ల జంక్షన్లో కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్సై హరిక్రిష్ణ తెలిపిన వివరాల మేరకు.. విశాఖకి చెందిన ఎం. కోదండరావు (35) శ్రీకాకుళంలోని ఓ పండ్ల షాపులో పని చేస్తుంటాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. షాపులో పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డుపై పడి మృతి చెందాడు.
సోంపేట మండలం హుకుంపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దింటి జానకి రావు గురువారం గుండెపోటుతో మరణించారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. భర్త చితికి భార్య దహన సంస్కారాలు చేశారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో మార్చి 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వై పోలినాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నామన్నారు. ఈ మేళాలో 12 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.
వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. శుక్రవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల కోసం ఉన్నతాధికారులతో పలు అంశాలపై మంత్రి చర్చించారు. విజయవాడలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన ఆయన పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు.
శ్రీకాకుళంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు 23.93 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ఓటింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్లో ఫ్రెండ్స్తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.
కవిటి మండలం బెజ్జిపుట్టుగకు చెందిన రాజు, తొత్తిడిపుట్టుగకు చెందిన లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విషాదం నెలకొంది. ఒడిశా వివాహానికి వెళ్లి వస్తూ మంగళవారం రాత్రి చీకటిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైకుకు నిప్పు అంటుకోవడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మరణించాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాజు మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన నరేంద్ర చికిత్స పొందుతున్నాడు.
Sorry, no posts matched your criteria.