India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్లో ఫ్రెండ్స్తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.
ఎన్నికల మెటీరియలను సరి చూసుకోవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. మైక్రో అబ్జర్వర్, బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్, బింగో బాక్స్, బిగ్ బాక్స్ తదితర మెటిరియల్ను కలెక్టర్ పరిశీలించారు. మెటీరియల్పై భద్రత వహించాలని పోలీంగ్ సిబ్బందికి చెప్పారు.
నందిగాం మండలం హరిదాసుపురం గ్రామంలో దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. ఓ కుక్క పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. అయితే స్థానికులు నీరు పోసి బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. కాసేపటికి అక్కడకు చేరుకున్న తల్లి కుక్క రోధించిన తీరు గుండెల్ని పిండేసేలా చేసింది.
నందిగం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కొండాల గోపాలం అనే ఉపాధ్యాయుడిపై ఇటీవల నందిగం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి టెక్కలి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ మహమ్మద్ ఆలీ తెలిపారు. పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
సోంపేట మండలం బారువాకొత్తూరు గ్రామంలో యువతి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. బట్టిగళ్ళురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న గ్రామానికి చెందిన వాలిశెట్టి తులసి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళంలో 31 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఓటర్లుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వారందరికీ ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేయడమైనదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్లో మందస మండలం హరిపురం యువకుడు కొండ అవినాశ్ సత్తా చాటి అందరి దృష్టి ఆకర్షించాడు. హరిపురంలోని ఏవన్ ఫిట్నెస్ జిమ్ తరుఫున కొండ అవినాశ్ ఇటీవల ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్నాడు. 27 ఏళ్ల యువకుడు అవినాశ్ బాడీ బిల్డింగ్లో ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నాడు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య ద్వారా అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2025 ఏడాదికి గాను దరఖాస్తులు కోరుతున్నట్లు నౌపడ ఆర్ ఎస్ సమీపంలోని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులతో పాటు ఎంఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంబీఏ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దూరవిద్య కేంద్రంలో సంప్రదించాలని కోరారు.
పోలీసులకు కంటి చూపు చాలా ముఖ్యమని,కళ్లపై శ్రద్ధ వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరానికి చెందిన ఓ కంటి ఆసుపత్రి నేతృత్వంలో పోలీసు అధికారులు, సిబ్బందికి కంటి చూపు పరీక్షలు ఎస్పీ కార్యాలయంలో జరిగాయి. మానవ శరీరంలో కళ్లు అనే అవయవాలు చాలా ప్రధానమైనవని చెప్పారు. మన నేత్రాలను పరిరక్షించుకుని బాధ్యత వహించాలని అన్నారు.
సోంపేట మండలం చౌకుపేట గ్రామంలో సోమవారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన కౌసల్య రౌలో (30) కుటుంబ సమస్యలు తట్టుకోలేక సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు బారువా ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.