Srikakulam

News August 22, 2024

శ్రీకాకుళం: 23న పట్టణంలో జాబ్ మేళా

image

శ్రీకాకుళం నగరంలోని నెహ్రు యువ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో 180 ఉద్యోగాలకు 18-35 ఏళ్లలోపు యువతీయువకులు అర్హులన్నారు. అభ్యర్థులు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగి ఉండాలన్నారు. IIFL సంస్థ ఫైనాన్సు లిమిటెడ్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News August 21, 2024

ఆమదాలవలస: అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బి.శ్యాంసుందర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంగ్లం, ఒకేషనల్ కామర్స్ సబ్జెక్టులో అధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పీజీలో 50% మార్కులు కలిగి ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు దరఖాస్తులను కళాశాలలో అందించాలని ఆయన కోరారు.

News August 21, 2024

శ్రీకాకుళం: పీవీటీజీ జాతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

image

ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పివిటిజి) అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన సంక్షేమ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం కలెక్టర్లను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలు, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్, తదితర శాఖలపై ఆయన జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు శ్రీకాకుళం నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

News August 21, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి ఆర్జీయూకేటి క్లాస్ వర్క్ ప్రారంభం

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటి) మొదటి ఏడాది క్లాస్ వర్క్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం క్లాస్ వర్క్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ కెవిజిడి బాలాజీ పేర్కొన్నారు. గత రెండు రోజుల్లో సెల్ఫ్ రిపోర్ట్‌కు అవకాశం ఇవ్వగా మొత్తం 632 మంది హాజరయ్యారు. అనంతరం రెండు విడతల కౌన్సెలింగ్ ముగియగా త్వరలో మూడో విడత జాబితా విడుదల చేయనున్నామన్నారు.

News August 21, 2024

జలుమూరు: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

జలుమూరు మండలం తిలారు జంక్షన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి రైలు కింద పడి మృతి చెందారు. పసుపు రంగు చొక్కా, ఆకుపచ్చ లుంగీ ధరించిన 45 సంవత్సరాల వ్యక్తి ట్రైన్ కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన ప్రాంతాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.

News August 21, 2024

శ్రీకాకుళం: APEAP CET ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

ఏపీఈఏపీ సెట్-2024 చివరి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆన్‌లైన్ వేరిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. ర్యాంకు వచ్చి కౌన్సెలింగ్ హాజరు కాని విద్యార్థులు, బ్రాంచ్ మార్చుకుని అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా SKLM ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

News August 21, 2024

పోలాకి: చెరువులో పడి యువకుడి గల్లంతు

image

పోలాకి మండలం వెదుళ్లవలసకు చెందిన అమలాపురం దుర్గారావు (24) అనే యువకుడు చెరువులో పడి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం స్థానిక కర్ణాల చెరువులో స్నానానికి వెళ్లిన సమయంలో చెరువులో గొయ్యి వద్ద దిగి తిరిగి రాలేదు. సమాచారం అందుకున్న తహశీల్దార్ సురేష్ కుమార్ గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవటంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

News August 21, 2024

శ్రీకాకుళం: 26 మంది ఎస్‌ఐలకు స్థానచలనం

image

శ్రీకాకుళం జిల్లా పోలీసుశాఖలో ఒకేసారి 26 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన మార్క్‌ను చూపించారు. చాలా ఏళ్లుగా జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్న పలువురిని విశాఖపట్నం వీఆర్‌కు పంపారు. అశోక్‌బాబు (జములూరు), మధుసూదనరావు (వీఆర్ శ్రీకాకుళం), రంజిత్ (పోలాకి) సత్యనారాయణ వీఆర్ (శ్రీకాకుళం) యాసిన్ (హిరమండలం) తదితరాలు ఉన్నారు.

News August 21, 2024

శ్రీకాకుళం: వారానికోసారి అధికారులు మండలాలకు వెళ్లాలి

image

శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారానికోసారి ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఈఆర్వోలు అంతా ఎలక్ట్రోరర్స్ కు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండరాదని అన్నారు.

News August 20, 2024

శ్రీకాకుళం జిల్లాకు నూతన ఎస్‌ఐల నియామకం

image

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు బదిలీల ద్వారా పలువురు నూతన ఎస్‌ఐలను నియమిస్తూ విశాఖ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.చిరంజీవి(జెఆర్ పురం), జీ.లక్షణరావు(లావేరు), ఎం. ప్రవల్లిక(బూర్జ), వీ.సత్యనారాయణ(పొందూరు), సీహెచ్.దుర్గాప్రసాద్(నరసన్నపేట), బి.అశోక్ బాబు(జలుమూరు), బీ.అనిల్ కుమార్(సారవకోట), ఆర్.సంతోష్(శ్రీకాకుళం 2 టౌన్), బీ.లావణ్య(పాతపట్నం), లక్ష్మీ(శ్రీకాకుళం ఉమెన్) తదితరులను నియమించారు.