Srikakulam

News February 24, 2025

శ్రీకాకుళం: వంశధార గొట్ట బ్యారేజ్‌లో డెడ్ స్టోరేజ్

image

జిల్లాకు సాగునీరు అందించే వంశధార గొట్ట బ్యారేజ్‌లో నీరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. దీంతో సాగునీటీతో పాటు, వంశధార నదీ పరివాహక ప్రాంతాలలో తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. ఒడిశాలో వర్షాలు పడితే గాని బ్యారేజ్ నిండే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

News February 24, 2025

సౌదీ అరేబియాలో శ్రీకాకుళం వాసి మృతి

image

శ్రీకాకుళం జిల్లా  సంతబొమ్మాలి మండలం ఎం మరువాడ గ్రామానికి చెందిన కొవిరి రామారావు (37) సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి కడుపు నొప్పితో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని సోదరుడు శ్రీనివాసరావు తెలిపారు. 3 నెలల క్రితం సౌదీ అరేబియాకు ఉపాధి నిమిత్తం పనిచేసుకునేందుకు వెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News February 24, 2025

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చికెన్ మేళాలు

image

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ మేళాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పలు ప్రైవేట్ పౌల్ట్రీ సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 24న చిలకపాలెం, పొందూరు, 25న నరసన్నపేట, టెక్కలి, హిరమండలం, 28న పలాస, సోంపేటలో సాయంత్రం 5 గంటల నుంచి చికెన్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కాగా ఆదివారం శ్రీకాకుళం నగరంలో చికెన్ మేళా జరిగింది. చికెన్ మేళాల నిర్వహణపై ఇటీవల రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.

News February 24, 2025

అరసవల్లి ఆదిత్యుని ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.8,09,600లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,34,906/-లు, ప్రసాదాల రూపంలో రూ.2,51,675/-లు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

News February 23, 2025

టెక్కలి: ప్రమాదవశాత్తు జారిపడి కూలీ మృతి

image

టెక్కలి జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు జారిపడి మెలియాపుట్టి మండలం బంజీరు గ్రామానికి చెందిన గూడ మార్కండరావు(36) అనే కూలీ మృతిచెందాడు. గోడౌన్ నుంచి సరకులను ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్లేందుకు రోజుకూలీ డ్రైవర్‌గా ఉన్న ఈయన ప్రమాదవశాత్తు జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 23, 2025

కింజరాపు ఎర్రన్నాయుడుది మచ్చ లేని చరిత్ర : CM

image

దివంగత మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి నేడు. దీనిపై CM ట్విటర్ వేదికగా ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు.’ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు గారు.మూడు దశాబ్దాలకు మించి రాజకీయ చరిత్రలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుందాం!’అని తన Xఖాతాలో రాసుకొచ్చారు.    

News February 23, 2025

ఆమదాలవలస : వెలవెలబోతున్న చికెన్ షాపులు

image

జిల్లాలోని బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ షాపులు వెల వెల పోతున్నాయి. గత కొన్ని రోజులుగా చికెన్ వినియోగం తగ్గడం వలన ఆమదాలవలసలో కేజీ స్కిన్ లెస్ రూ .150/- గా ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ లేకపోయినా.. అమ్మకాలు లేవని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 23, 2025

నందిగం: ఉపాధ్యాయునిపై కేసు నమోదు

image

నందిగం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న కొండాల గోపాలం అనే 59 ఏళ్ల ఉపాధ్యాయుడిపై శనివారం కేసు నమోదు చేసినట్లు నందిగం ఎస్.ఐ మహమ్మద్ అలీ తెలిపారు. పాఠశాలలో 3వ తరగతి ఒక విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనపై శనివారం విద్యాశాఖ అధికారులు కూడా విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.

News February 23, 2025

టెక్కలిలో రోడ్డు ప్రమాదం

image

టెక్కలి ఇందిరాగాంధీ కూడలి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బూరగాం గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఇందిరాగాంధీ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొంది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News February 23, 2025

SKLM: ‘కేసులు త్వరగా దర్యాప్తు చేయాలి’

image

గంజాయి అక్రమ రవాణా, ఇతర మాదక ద్రవ్యాల కేసుల్లో పటిష్ఠంగా దర్యాప్తు చేపట్టి శిక్షలు శాతం పెరిగేలా చేయాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. శనివారం ఎచ్చెర్లలోని ఓ ప్రైవేటు కళాశాలలో SKLM, VZM, మన్యం జిల్లాల పోలీసు అధికారులతో గంజాయి, కేసుల దర్యాప్తులో చట్టపరమైన నిబంధనలు, పాటించాల్సిన నియమాలపై వర్క్‌ షాప్ నిర్వహించారు. ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి, ఏఎస్పీ వెంకట రమణ ఉన్నారు.

error: Content is protected !!