India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ షాపులు వెల వెల పోతున్నాయి. గత కొన్ని రోజులుగా చికెన్ వినియోగం తగ్గడం వలన ఆమదాలవలసలో కేజీ స్కిన్ లెస్ రూ .150/- గా ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ లేకపోయినా.. అమ్మకాలు లేవని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
నందిగం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న కొండాల గోపాలం అనే 59 ఏళ్ల ఉపాధ్యాయుడిపై శనివారం కేసు నమోదు చేసినట్లు నందిగం ఎస్.ఐ మహమ్మద్ అలీ తెలిపారు. పాఠశాలలో 3వ తరగతి ఒక విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనపై శనివారం విద్యాశాఖ అధికారులు కూడా విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
టెక్కలి ఇందిరాగాంధీ కూడలి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బూరగాం గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఇందిరాగాంధీ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొంది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
గంజాయి అక్రమ రవాణా, ఇతర మాదక ద్రవ్యాల కేసుల్లో పటిష్ఠంగా దర్యాప్తు చేపట్టి శిక్షలు శాతం పెరిగేలా చేయాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. శనివారం ఎచ్చెర్లలోని ఓ ప్రైవేటు కళాశాలలో SKLM, VZM, మన్యం జిల్లాల పోలీసు అధికారులతో గంజాయి, కేసుల దర్యాప్తులో చట్టపరమైన నిబంధనలు, పాటించాల్సిన నియమాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి, ఏఎస్పీ వెంకట రమణ ఉన్నారు.
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం శివాజీ నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పరీక్షలు సమీపిస్తుండడంతో చదవమని తల్లి మందలించగా మనస్తాపం చెందిన యశ్వంత్ (17) ఉరేసుకున్నాడు. శనివారం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిని వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, పోర్న్ సైట్లలో సొమ్ము చేసుకుంటున్న ఇద్దిరిని శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ తెలిపారు. నగరానికి చెందిన ఓ విద్యార్థిని తిరుపతిలో చదువుతున్న సమయంలో సోయల్ పరిచయమయ్యాడు. ఆమెకు తెలియకుండా తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి, కొత్త నంబర్లతో పంపుతూ వేధించేవాడు. ఆ వీడియోలు చూసేందుకు సోయల్ నుంచి క్యూఆర్ కొనుగోలు చేసిన నందికొట్కూరుకు చెందిన రఘును కూడా అరెస్టు చేశారు.
ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు అభ్యర్థులంతా సమయపాలన పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 15 పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయన్నారు. శ్రీకాకుళం మండలం – 8, ఎచ్చెర్ల మండలం – 7గా కేటాయించారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.
జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశం జరిగింది. జిల్లా అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు హాజరయ్యారు.
శ్రీకాకుళంలో గంజాయితో శుక్రవారం నలుగురు యువకులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చదువుపై దృష్టిని సారించాల్సిన యువకులు తప్పటడుగులు వేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. అరెస్టయిన వారిలో ధర్మాన ప్రవీణ్(23)పై ఏకంగా 12 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇటీవల జైలుకు వెళ్లొచ్చాడు. యోగేశ్వర రావు, జలగడుగుల తార వికాస్పై గతంలో గంజాయి కేసులు ఉండటంతో జైలుకెళ్లారు.
వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు మంత్రి స్థానంలో ఉండి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పడం తగదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక సతమతం అవుతుంటే గత ప్రభుత్వంలో రేటు పలికిందా? అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.
Sorry, no posts matched your criteria.