Srikakulam

News August 19, 2024

నేటి నుంచి ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ 

image

ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి చివరి విడత కౌన్సెలింగ్  షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. 23న ఆప్షన్లను మార్పు చేసుకోవచ్చు. 26న అలాట్మెంట్లను ప్రకటిస్తారు. 30 లోపు కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.

News August 19, 2024

శ్రీకాకుళం డీఎస్పీగా వివేకానంద

image

రాష్ట్రంలో డిఎస్పీలను బదిలీ చేస్తూ మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం డిఎస్పీగా సిహెచ్ వివేకానందాను డిఎస్పీ వై.శ్రుతి స్థానంలో నియమించారు. అలాగే శ్రీకాకుళం స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ఏ.త్రినాథరావును విశాఖపట్టణం డీఎస్‌ఆర్పీ విభాగానికి బదిలీ చేశారు. ఈయన స్థానంలో జిల్లాలో ఎవరినీ నియమించలేదు. డీఎస్పీ వైస్ శ్రుతికి ఎక్కడా నియమించకపోవడంతో రిపోర్ట్ చేయాలన్నారు.

News August 19, 2024

శ్రీకాకుళం: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

విజయవాడ డివిజన్‌లో ట్రాక్ భద్రతా పనులు చేస్తున్నందున శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌(నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు సెప్టెంబర్ 2 నుంచి 28 వరకు ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక గుడివాడ-భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల మధ్య ఈ రైలుకు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

News August 18, 2024

రేపు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా పర్యటన

image

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో 11వ జూనియర్ అంతర జిల్లాల సాఫ్ట్-బాల్‌ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కోటబొమ్మాళి మండలం తాటిపర్తి గ్రామంలో మెండ భాస్కరరావు వర్ధంతి సభలో పాల్గొంటారు.

News August 18, 2024

అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు: MLA రవికుమార్

image

తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలకు వెనకాడబోమని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు శాఖల వారీగా చర్చ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సక్రమంగా అందించలేదని, అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో వరప్రసాద్, ఎంపీపీ రమాదేవి పాల్గొన్నారు.

News August 18, 2024

హిరమండలం: గొట్టా బ్యారేజీ ప్రత్యేకతలు ఇవే..

image

హిరమండలంలో గొట్టా బ్యారేజీ 1971లో నిర్మించారు. బ్యారేజీ పొడవు 475.79 మీటర్లు. మొత్తం 24 గేట్లు ఉన్నాయి. జల పరిమాణం 57.5 టీఎంసీలు, గరిష్ఠ వరద నీటి పరిమాణం 2.90 లక్షల క్యూసెక్కులు. 1980లో 4.01లక్షల క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి వచ్చింది. కుడి కాలువ 2.03 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. వంశధారనదీ పరివాహక వైశాల్యం 9731 కిలోమీటర్లుగా ఉంది.

News August 18, 2024

శ్రీకాకుళం: ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బదిలీల టెన్షన్ నెలకొంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొందరి ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఒకేచోట గరిష్ఠంగా ఐదేళ్లు చేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామ వార్డు సచివాలయాలు, రవాణాశాఖ, మున్సిపల్ శాఖల్లో బదిలీలు జరగనున్నాయి.

News August 18, 2024

శ్రీకాకుళం: ఇగ్నోలో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ఇటీవల ఈ గడువు ముగియగా, ఆగస్టు 31 వరకు గడువు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. అడ్మిషన్ల వివరాలకు శ్రీకాకుళంలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

News August 18, 2024

సీఎంను కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం ఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రితో రాష్ట్రానికి సంబంధించి పలు విషయాల పై చర్చించారు.

News August 18, 2024

విశాఖలో సిక్కోలు విద్యార్థి మిస్సింగ్‌పై కేసు నమోదు

image

సోంపేట మండలం బైరిపురం గ్రామానికి చెందిన ముంజుల మోహన్ (17) విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలో ఉన్న ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామానికి వచ్చిన మోహన్ శుక్రవారం సాయంత్రం సోంపేట నుంచి విశాఖ వెళ్లే ఆర్టీసీ బస్సులో తన తండ్రి శంకర్ ఎక్కించారు. తన కుమారుడు నేటి వరకు కళాశాలకు చేరకపోవడంతో.. కుమారుని ఆచూకీ కోసం ఆనందపురం పోలీసులకు తండ్రి శంకర్ ఫిర్యాదు చేశాడు.