Srikakulam

News September 1, 2025

ఆరోగ్య కేంద్రాలు నిబంధనలు పాటించాలి: డీఎంహెచ్‌ఓ

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, ART సెంటర్లు తప్పనిసరిగా నైతిక, చట్టబద్ధమైన నియమ నిబంధనలను పాటించాలని డీఎంహెచ్‌ఓ అనిత ఆదేశించారు. ఆయా ఆసుపత్రులు అందించే వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలకు సంబంధించిన ధరల పట్టికను తప్పనిసరిగా ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని ఆమె సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 1, 2025

శ్రీకాకుళంలో మత సామరస్య కమిటీ సమావేశం

image

జిల్లాలో శాంతి, సామరస్యం పెంపొందించడమే మత సామరస్య కమిటీ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా మత సామరస్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్య అపార్థాలు, విభేదాలు రాకుండా కమిటీ కృషి చేయాలని ఆయన సూచించారు. పండుగలు శాంతియుతంగా, మత సామరస్యంతో జరుపుకోవాలని, ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని కోరారు.

News September 1, 2025

SKLM: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 64 దరఖాస్తులు

image

జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 64 దరఖాస్తులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. అందులో రెవెన్యూ శాఖకు గరిష్ఠంగా 21, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ కి 13, పంచాయతీరాజ్‌ కి, పంచాయతీరాజ్ విద్యుత్తు సంస్థకు సంబంధించి 5 దరఖాస్తులు అందాయి.

News September 1, 2025

SKLM: ‘ఫిర్యాదు దారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోండి’

image

ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 51 వినతులను SP మహేశ్వర రెడ్డికి సమర్పించారు. ఫిర్యాదులపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన విచారణ జరిపి, ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయన జూమ్ ద్వారా అధికారులతో మాట్లాడి న్యాయపరమైన, చట్టపరమైన అంశాలను పరిశీలించాలని సూచించారు.

News September 1, 2025

VRకు ఇద్దరు ఎస్ఐలు: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు విఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
దీనికి సంబంధించి ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తూరు ఎస్సై ఆలీ మహమ్మద్, హిరమండలం ఎస్సై మహమ్మద్ యాసిన్‌లను విఆర్‌కు పంపారు. ఆయా పోలీస్ స్టేషన్‌లో పరిపాలన పరమైన అంశల్లో లోటుపాట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

News September 1, 2025

శ్రీకాకుళం: యూరియా కొరతపై నేడు ఆందోళన

image

రైతులకు యూరియా అందివ్వని కూటమి ప్రభుత్వం తీరుపై సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. పోలాకి మండలం మబగాం కృష్ణదాస్ పార్టీ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆందోళన ప్రారంభమవుతుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలి అన్నారు.

News September 1, 2025

శ్రీకాకుళం: నేడు కలెక్టర్ గ్రీవెన్స్

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 31, 2025

కలగా మిగిలిన వంశధార-బాహుదా నదుల అనుసంధానం

image

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగిలింది. గొట్టాబ్యారేజీ నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. వంశధార నది నుంచి సుమారు 97,262 టీఎంసీలు బాహుదాకు మళ్లించాలని గతంలో TDP ప్రభుత్వ హయాంలో సంకల్పించారు. ఈ రెండు నదులు అనుసంధానం చేస్తే ఎనిమిది మండలాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం స్పందించి వంశధార, బాహుదా నదుల అనుసంధానం వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News August 31, 2025

శ్రీకాకుళం: రేపు కలెక్టర్ గ్రీవెన్స్

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 31, 2025

టెక్కలి జిల్లా ఆసుపత్రిని వేధిస్తున్న సమస్యలు

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రేడియాలజీ, చర్మవ్యాధులు, జనరల్ సర్జిన్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రికి స్టాఫ్ నర్సులు, జీడీఏలు కొరత అధికంగా వేధిస్తోంది. రోగులకు తాగునీరు కోసం ఏర్పాటు చేసిన ఆర్.ఓ ప్లాంట్ తరుచూ మరమ్మతులకు గురౌతుంది. డ్రైనేజీ సమస్యతో పాటు ప్రధానంగా బయోమెడికల్ వేస్ట్ భద్రపరిచేందుకు గదిలేదు. ఆసుపత్రిలో ఇంకేమైనా ప్రధాన సమస్యలు ఉన్నాయా ? అయితే COMMENT చేయండి.