Srikakulam

News August 10, 2024

శ్రీకాకుళం: 12,13,14 తేదీలలో మెగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం నిరుద్యోగులకు ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కెమిస్ట్రీలో ఎంఎస్సీ, బీఎస్సీ, బీటెక్, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ చదివిన 21నుంచి 25 ఏళ్ళ వయస్సు మధ్యగల వారు అర్హులని పేర్కొనారు. ఆగస్టు 12న పాతపట్నం మహేంద్ర డిగ్రీ కాలేజీలో, 13న పాలకొండ CL నాయుడు డిగ్రీ కళశాల, 14న శ్రీకాకుళం సన్ డిగ్రీ కళాశాలల్లో జరుగుతుందని వివరించారు.

News August 10, 2024

శ్రీకాకుళం: సెలవు దినంలో తరగతులు నిర్వహిస్తే చర్యలు

image

సెలవు దినం అయిన రేపు రెండో శనివారం, ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలలు సంపూర్ణంగా సెలవు ప్రకటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యస్ తిరుమల చైతన్య ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. సెలవులు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్‌లు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.

News August 9, 2024

శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 53 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో రెండు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు ఇంటర్వ్యూ నిర్వహించగా.. నిరుద్యోగ యువత 70 మంది హాజరయ్యారు. ఇందులో 53 మందికి ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తెలిపారు.

News August 9, 2024

శ్రీకాకుళం: ఉద్యాన పంటలకు బకాయిల మంజూరు

image

ఉద్యాన పంటలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. వికాస్ యోజనలో జిల్లాకు రూ.14.32 కోట్లు మంజూరు అయినట్లు, సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద మరో రూ.86.87 లక్షలు విడుదల అయినట్లు తెలిపారు. కొత్తగా 515 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ రైతులకు రూ.28.38 లక్షలు విడుదల చేసినట్టు కలెక్టర్ తెలిపారు.

News August 9, 2024

శ్రీకాకుళం: రికవరీ పోన్లు బాధితులకు అందజేత

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం రికవరీ చేసిన సెల్ ఫోన్ లను బాధితులకు ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి అందజేశారు. ఇప్పటివరకు 619 ఫోన్లను రికవరీ చేసినట్లు వాటి విలువ రూ.79 లక్షలు అని పేర్కొన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు https://www.ceir.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. తక్కువ సమయంలో పోగొట్టుకున్న ఫోన్లను అందుకోవడం సంతోషంగా ఉందని బాధితులు పేర్కొన్నారు.

News August 9, 2024

శ్రీకాకుళం: రైళ్లు పొడగింపు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం మీదుగా ఎర్నాకులం(ERS), పాట్నా(PNBE) మధ్య ప్రయాణించే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. ఈ మేరకు నం.06085 ERS- PNBE ట్రైన్‌ను ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 6 వరకు ప్రతి శుక్రవారం, నం.06086 PNBE- ERS ట్రైన్‌ను ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 9 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది.

News August 9, 2024

తుపాకీ లైసెన్స్‌‌కు దువ్వాడ దరఖాస్తు

image

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనకు తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి తాజాగా ఈనెల 7న దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొంత మంది తన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు. ఇదే విషయమై జులైలో కూడా టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 9, 2024

శ్రీకాకుళం: జిల్లా BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా BSNL 4జీ దశలవారీగా ప్రవేశ పెడుతున్నట్లు వినియోగదారులు 2జీ, 3జీ సిమ్ కార్డులను తక్షణమే 4జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలని BSNL శ్రీకాకుళం జిల్లా జనరల్ మేనేజర్ నాయుడు మర్రి గురువారం తెలిపారు. జిల్లాలో 229 టవర్లకు ఇప్పటికే 50 టవర్లను 4జీ టవర్లుగా  మార్పు చేశామని తెలిపారు. కస్టమర్లు కేవైసీని దగ్గర్లో ఉన్న BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో ఉచితంగా అప్‌గ్రేడ్ చూసుకోవచ్చున్నారు.

News August 9, 2024

సోంపేట: పలాసపురంలో డెంగీతో మహిళ మృతి

image

సోంపేట మండలం, పలాసపురం గ్రామానికి చెందిన సంక శోభ (38) డెంగీతో గురువారం మృతి చెందింది. కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూన్న ఆమెను గురువారం ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది. గతంలో ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు డెంగీతో మృతి చేందారు. మృతురాలికి భర్తతోపాటు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆసుపత్రిలోనూ ప్రాథమిక పరీక్షల కిట్లు లేక వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది అని గ్రామస్థులు వాపోతున్నారు.

News August 9, 2024

శ్రీకాకుళం: విశ్రాంతి భవనాన్ని సందర్శించిన ఎస్పీ

image

పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనం సబ్సిడరీ పోలీస్ కాంటీన్‌ని గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ కే.వీ మహేశ్వరరెడ్డి సందర్శించి నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్రాంతి భవనంలో నిర్వహణపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని హెడ్ క్వార్టర్స్‌కు వచ్చే సిబ్బంది అందరూ విశ్రాంతి తీసుకున్నందుకు అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు.