Srikakulam

News April 1, 2025

SKLM: హెడ్ కానిస్టేబుల్‌ను సత్కరించిన జిల్లా ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో సుమారు 41సంవత్సరాలు పాటు హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసిన పి. కృష్ణమూర్తి మార్చి 31న (సోమవారం) ఉద్యోగ విరమణ చెందారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కృష్ణమూర్తికి శాలువా, పూల దండతో సత్కరించారు. అనంతరం జ్ఞాపిక‌ను ప్రధానం చేసి పోలీస్ అధికారుల సమక్షంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు.

News April 1, 2025

వజ్రపుకొత్తూరు: గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి

image

సముద్రంలో గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన బొంగు ధనరాజు (35), వంక కృష్ణారావు (40) చనిపోయారు. మృతులకు భార్యాపిల్లలు ఉన్నారు. నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారుల మృతిలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 1, 2025

వజ్రపు కొత్తూరు: వేటకి వెళ్లిన మత్స్యకారులు గల్లంతు

image

వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు మంగళవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. వారి కోసం గాలిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 

News April 1, 2025

శ్రీకాకుళం: డీఈవోపై మంత్రి అచ్చెన్నకు ఫిర్యాదు

image

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డీఈవో తిరుమల చైతన్యపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెనాయుడుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల విద్యాశాఖలో జరిగిన పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వివరించగా ఆయన వెంటనే స్పందించి కమిషనర్ విజయరామరాజుకు ఫోన్లో మాట్లాడి సమస్యను సద్దుమణిగినట్లు చూడాలని తెలిపారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.

News March 31, 2025

లావేరు: జిరాక్స్ షాప్ యజమానికి రూ.36 లక్షల పన్ను నోటీసు

image

లావేరు(M) భరణికానికి చెందిన జిరాక్స్ షాపు యజమాని ఏ.హరికృష్ణకు ఒంగోలుకు సంబంధించిన GST డిప్యూటీ సహ కమిషనర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రూ.36,13,000 పన్ను బకాయి ఉన్నట్లుగా నోటీసులో ఉండటంతో అతను కంగుతిన్నాడు. తాను ఒంగోల్లో ఏ వ్యాపారం చేయలేదని, గతంలో బార్‌లో పని చేశానని పేర్కొన్నారు. అయితే ఒంగోల్లో హరికృష్ణ పేరు మీద హనుమాన్ ట్రేడర్స్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.

News March 31, 2025

రణస్థలం: అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

image

రణస్థలంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న పిన్నింటి అప్పలసూరి ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పరిశ్రమలో ఉన్న వాష్ రూమ్‌లో ఉరివేసుకొని మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. మృతునిది నరసన్నపేట మండలం లుకలాం గ్రామం అని తెలిసింది. అయితే అప్పలసూరి మృతి పట్ల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

News March 31, 2025

జలుమూరు దేవాలయ ఘటనపై SP మహేశ్వర్ రెడ్డి పరిశీలన

image

జలుమూరు మండలంలో పలు దేవాలయాలలో ఉగాది పర్వదినాన అన్యమత ప్రచారాలు నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలలో వివిధ అన్యమత ప్రచారకులుపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు గ్రామాలలో జరిగిన సంఘటనలపై ఆయన ఆరా తీశారు. ఆయనతోపాటు క్రైమ్ ASP శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News March 30, 2025

శ్రీకాకుళం: వివాహిత హత్యకు కారణాలేంటి..?

image

శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత శుక్రవారం దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల ప్రకారం.. కవిటి (మ) ఆర్.కరపాడుకు చెందిన మీనా, భర్త దిలీప్‌తో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా దుండగలు బీరు సిసాలతో తమపై దాడి చేశారని దిలీప్ చెప్పాడు. గాయపడిన మీనాక్షిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఎస్సై రవివర్మ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.

News March 30, 2025

ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు శనివారం తెలిపారు. మృతుడు శ్రీకాకుళం పట్టణం గునాపాలెంకు చెందిన రమణారావు(49)గా గుర్తించారు. శుక్రవారం నుంచి రమణారావు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ట్రాక్‌పై విగతజీవిగా పడి ఉన్న రమణను చూసి నిశ్చేష్ఠులయ్యారు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News March 30, 2025

టెక్కలి: దూరవిద్యలో డిగ్రీ పూర్తికి ముగుస్తున్న గడువు

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యా విధానంలో B.A, B.Com డిగ్రీ విద్యనభ్యసించేందుకు దరఖాస్తుకు ఆఖరు తేది మార్చి 31తో ముగుస్తుందని శనివారం కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తిర్ణీత అయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.