Srikakulam

News October 14, 2025

రైతుల ఖాతాల్లోకి 5,6 గంటల్లో దాన్యం కొనుగోలు డబ్బులు: మంత్రి మనోహర్

image

రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 5,6 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమవుతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో వివిధ రైతు సంఘాలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో 48 గంటలు పట్టేదని అటువంటి ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరళతరం చేస్తారన్నారు. దీనికి సంబంధించి సమస్యలను రైస్ మిల్లర్లకు అడిగి తెలుసుకున్నారు.

News October 14, 2025

SKLM: ‘దాన్యం సేకరణ ప్రణాళికతో జరగాలి’

image

రైతులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా ముందస్తు ప్రణాళికతో ధాన్యం సేకరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మనోహర్, కమీషనర్, MD సూచనలు అనుసరించి రైతులు దగ్గర నుంచి దాన్యం కొనుగోలు చేయాలన్నారు.

News October 13, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➧కల్తీ మద్యం వ్యవహారంపై జిల్లాలో పలు చోట్ల వైసీపీ నిరసన
➧ బాలీయాత్రపై సీఎం చంద్రబాబుకు వివరించాం: ఎమ్మెల్యే కూన
➧ కొత్తూరు: నీట మునిగిన పంటను పరిశీలించిన అధికారులు
➧వజ్రపుకొత్తూరు: విద్యాబుద్ధులు నేర్పిన బడిలోనే..టీచర్‌గా చేరింది
➧ ఎస్పీ గ్రీవెన్స్‌కు 50 వినతులు
➧శ్రీకాకుళం: 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
➧టెక్కలి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల గొడవ

News October 13, 2025

ఎచ్చెర్ల: RBK నిర్మాణంపై కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

image

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News October 13, 2025

నేడు విధుల్లో చేరనున్న నూతన ఉపాధ్యాయులు

image

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 528 మంది నూతన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారని DEO రవిబాబు తెలిపారు. వీరికి ఆన్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించి, పోస్టింగ్ ఆర్డర్స్ జారీచేశామని వెల్లడించారు. వీరంతా సోమవారం విధుల్లో చేయనుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నామని DEO పేర్కొన్నారు.

News October 13, 2025

SKLM: ‘ధాన్యం రవాణా వాహనాలకు GPS తప్పనిసరి’

image

రైతులు వద్ద ధాన్యం కొన్న తరువాత రవాణా చేసే ప్రతి వాహనానికి కచ్చితంగా జీపీఎస్ GPS పరికరం అమర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా రూ.3068 చెల్లించి GPS యంత్రాన్ని అమర్చుకోవాలని సూచించారు. రైతుసేవా కేంద్రాల వద్ద వాటి వివరాలు నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు.

News October 13, 2025

శ్రీకాకుళం: నేటి నుంచే ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు

image

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో రవిబాబు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నపత్రాల పంపిణీ కార్యక్రమం పూర్తయిందన్నారు. 1 తరగతి నుంచి 5వ తరగతులకు 13 నుంచి 15వ తేదీ వరకు, 6వ తరగతి నుంచి 10 వరకు 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పకడ్బందీగా చేపడుతున్నామన్నారు.

News October 13, 2025

SKLM: 13-19 వరకు సూపర్ GST పై ప్రత్యేక ఉత్సవాలు

image

అక్టోబర్ 13 నుంచి 19 వరకు శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్లో సూపర్ జీఎస్టీ సేవింగ్స్ పై ఉత్సవాల నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రకాల వస్తువుల ధరల తగ్గుదలపై ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు, కిచెన్ గూడ్స్‌తో పాటు చేనేత వస్త్రాలు, తదితర స్టాల్స్ ఉంటాయని ఆయన అన్నారు.

News October 12, 2025

శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన

image

గత కొన్ని రోజులుగా వర్షాలతో సతమతం అవుతున్న శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే 2-3 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని APSDMA ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

News October 12, 2025

శ్రీకాకుళంలో రేపు పీజీఆర్ఎస్

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యలపై అర్జీలను https://Meekosam.ap.gov.in చేసుకోవాలన్నారు. నంబరు 1100 నేరుగా ఫోన్ చేసి వినతుల పరిష్కారం గురించి తెలుసుకోవచ్చునని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.