Srikakulam

News July 1, 2024

ఎచ్చెర్ల : నేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సిలింగ్

image

ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈఏపీసెట్ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమవుతుందని సహాయ కేంద్ర జిల్లా సమన్వయకర్త జి.దామోదర్‌రావు ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్‌కు జులై 1నుంచి 7తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు కౌన్సిలింగ్ రుసుం చెల్లించాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1200 ఎస్సీ, ఎస్టీలు 600 చెల్లించాలని పేర్కొన్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం: పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

శ్రీకాకుళం మండలం పెద్దపాడు గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమూన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదగా లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. కలెక్టర్ స్వయంగా పెన్షన్ అందజేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, పింఛన్ల పంపిణీ సిబ్బంది పాల్గొన్నారు.

News July 1, 2024

నేడే పెన్షన్ పంపిణీ.. ఎంత ఇస్తారంటే !

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 3,19,702 మంది లబ్ధిదారుల ఉన్నారు. వీరికి రూ.213 కోట్ల మీద నిధులు మంజూరయ్యాయి. సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ముందుగా ప్రకటించిన అదనపు మొత్తం రూ.1,000 చొప్పున రూ.3,000, జూలై నెల రూ.4,000 కలిపి మొత్తం రూ.7,000 బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ పంపిణీ చేయనున్నారు.

News July 1, 2024

పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు ఉత్తమ కలెక్టర్ అవార్డు

image

పాతపట్నం మాజీ MLA రెడ్డి శాంతి కుమార్తె రెడ్డి వేదిత (ఐఎఎస్) ఆదివారం ఉత్తమ కలెక్టర్ అవార్డును అందుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ పట్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పక్కాగా అమలు చేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్) సూచీల ఆధారంగా ఈ అవార్డును అందజేశారు.

News July 1, 2024

శ్రీకాకుళం డీవీఈవోగా శివ్వాల తవిటినాయుడు

image

శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ విద్య నూతన డీవీఈవోగా(పూర్తి అదనపు బాధ్యతలు) పాలకొండకు చెందిన శివ్వాల తవిటినాయుడు ఆదివారం నియమితులయ్యారు. ప్రస్తుతం బూర్జ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆయన పనిచేస్తున్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిగానూ, పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల స్పెషల్ ఆఫీసర్ గానూ విధులు నిర్వర్తించారు.

News June 30, 2024

మాజీ మంత్రి అంబటిపై అచ్చెన్నాయుడు ఫైర్ 

image

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే విషయంలో నీకు సీఎం చంద్రబాబుకు పోలికా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నిస్తూ మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. ’పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే విషయంలో నీకు, సీఎం చంద్రబాబుకు పోలికా? నీకు తెలిసిన విద్యలు వేరే ఉన్నాయి. ఇది నీ సబ్జెక్ట్ కాదు. అన్నిట్లో దూరి అభాసుపాలు కావద్దు‘ అని హితవు పలికారు.

News June 30, 2024

శ్రీకాకుళం: 341 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు..!

image

పెద్దమడి గురుకుల పాఠశాలలో 341 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. గతంలో ఉన్న 17 మంది గెస్ట్ టీచర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో క్లాసులకు అంతరాయం ఏర్పడింది. డీఎస్సీలో తమ పోస్టులు కలపడంతో తమకు న్యాయం చేయాలని గెస్ట్ టీచర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో సమస్య ఏర్పడిందని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రిన్సిపల్ అజిత్ తెలిపారు.

News June 30, 2024

ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై అధికారులతో అచ్చెన్నాయుడు సమీక్ష

image

జిల్లాలోని వంశధార ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై ఆదివారం సాయంత్రం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మనజీర్ జిలానీ, ఎమ్మెల్యేలు భగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, గొండు శంకర్ ఉన్నారు.

News June 30, 2024

వయోపరిమితి పెంచాలని మంత్రికి వినతి

image

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఎన్.ఎం.ఆర్, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్, కంటింజెంట్ ఉద్యోగులకు ఉద్యోగ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని, ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని సంఘ నాయకులు మంత్రి అచ్చెన్నాయుడుకు ఆదివారం వినతిపత్రం అందించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నాయకులు ఎం.వెంకట్ రావు, వై.శ్రీనివాస్, నాగభూషణం మంత్రిని కోరారు. వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

News June 30, 2024

సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ప్రయాణీకుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా సత్రాగచ్చి(SRC), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07222 SRC- SC ట్రైన్‌ను జూలై 3 నుండి సెప్టెంబర్ 29 వరకు, నెం. 07221 SC- SRC ట్రైన్‌ను జూలై 2 నుండి సెప్టెంబర్ 28 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, అనకాపల్లి, విజయవాడ, రాజమండ్రిలో ఆగుతాయి.