Srikakulam

News July 24, 2024

శ్రీకాకుళం: వారంలో రెండు రోజులు యాంటీ లార్వా

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రతీ మంగళవారం, శుక్రవారాలలో యాంటీ లార్వా కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, జీజీహెచ్, ఆసుపత్రుల్లో పూర్తిగా శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతీ శుక్రవారం ప్రతీ ఇంటినీ శుభ్రపరచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు.

News July 23, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

★ భారీ వర్షాలకు ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదు: కలెక్టర్ ★ ఆధార్ అప్డేట్‌కు జిల్లాలో ప్రత్యేక క్యాంపులు ప్రారంభం ★ టెక్కలిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి ★ స్టేడియం పనులను ప్రారంభించిన కలెక్టర్ స్వప్నిల్ ★ శ్రీకాకుళం జిల్లాలో 659 హెక్టార్లలో వరి పంటకు నష్టం ★ తనిఖీల్లో అక్రమ రవాణాను అరికట్టాలి: ఎస్పీ ★ వారంలో రెండు రోజులు యాంటీ లార్వా కార్యక్రమం: కలెక్టర్ ★ కరెంట్ షాక్‌తో కాలిపోయిన మర్రిచెట్టు

News July 23, 2024

శ్రీకాకుళం: వారంలో రెండు రోజులు యాంటీ లార్వా

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రతీ మంగళవారం, శుక్రవారాలలో యాంటీ లార్వా కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, జీజీహెచ్, ఆసుపత్రుల్లో పూర్తిగా శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతీ శుక్రవారం ప్రతీ ఇంటినీ శుభ్రపరచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు.

News July 23, 2024

టెక్కలి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

టెక్కలి గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు లంక చంద్రశేఖర్ (26) తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కాగా మృతుడు బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి, పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 23, 2024

ఏపీ నష్టాన్ని పూడ్చే దిశగా కేంద్ర బడ్జెట్: కేంద్ర మంత్రి రామోహ్మన్

image

ఏపీకి గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని పూడ్చే దిశగా తాజా కేంద్ర బడ్జెట్ అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీకి సహాయం అందిచకపోతే అభివృద్ధి సాధించడం కష్టం అన్నారు. ప్రధాని మోదీ అర్థం చేసుకొని ఏపీ అభివృద్ధికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

News July 23, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి B.Ed సెమిస్టర్ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో B.Ed.(M.R) కోర్సులకు సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 14 కళాశాలలకు సంబంధించి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను 23 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు.

News July 23, 2024

శ్రీకాకుళం: ఉద్యోగం పేరుతో రూ.13.50లక్షలకు టోకరా..

image

ఉద్యోగం పేరుతో ఓ పంచాయితీ కార్యదర్శి రూ.13.50లక్షలు కాజేసిన ఘటన మందస మండలంలో సోమవారం వెలుగుచూసింది. లోహరిబంద పంచాయతీ కార్యదర్శి సతీశ్ బాబు కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి నగదును డిమాండ్ చేశాడు. ఇది నిజమే అని నమ్మిన కొందరు నిరద్యోగులు అతనికి నగదును ముట్టజెప్పారు. అప్పటి నుంచి ఆయన సరిగా స్పందించకపోవడంతో బాధితులు సోమవారం కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

News July 23, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ డివిజన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా వెళ్లే పూరి- ఓఖా ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.20819 ట్రైన్‌ను ఆగస్టు 4 నుంచి విజయవాడ మీదుగా కాక గుణదల, రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆగస్టు 4 నుంచి ఈ రైలు విజయవాడ మీదుగా వెళ్లదని, సమీపంలోని రాయనపాడులో ఈ రైలుకు స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు.

News July 22, 2024

శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP NEWS

image

➣ ఈనెల 23 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు➣ టెక్కలిలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత➣ వరద నీటిపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ స్వప్నిల్ ➣ కేసులకు భయపడేవారు ఎవరూ లేరు: స్పీకర్ తమ్మినేని➣ఎచ్చెర్లలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య➣ మీకోసం పరిష్కార వేదికకు 151 అర్జీలు➣ పోటీ పరీక్షల్లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచాలి: రామ్మోహన్➣ ఐటీడీఏ పీవోగా రాహుల్ కుమార్ రెడ్డి➣ జలుమూరులో రూ.9 లక్షల నగదు చోరీ

News July 22, 2024

శ్రీకాకుళం జిల్లా పోలీస్ పరిష్కార వేదికకు 55 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజలు నుంచి 55 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల విషయంలో అలసత్వం లేకుండా చట్ట ప్రకారం తక్షణ చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.