India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు మరో నాలుగు రోజుల్లో చెల్లించాలి. ఈ సందర్భంగా తొలుత ప్రభుత్వం అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ లోపు చెల్లించాలని ప్రకటించగా దాన్ని ఈ నెల 18వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీనితో 10వ తరగతి విద్యార్థులు 18వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
YCP నేత, నటుడు పోసాని కృష్ణ మురళీ TTD ఛైర్మన్ బి.ఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కరమైన పదజాలంతో దూషించడంపై పాలకొండ టీడీపీ నేతలు పోలీసు స్టేషన్లో గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలపై గతంలో పోసాని తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సై ప్రయోగ మూర్తిని కోరారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.
కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందింది. ఈ మేరకు రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పలాస జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. కాగా వృద్ధురాలు వివరాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన మొదలవలస చిన్నారావు (33) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్లోని బికనీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను ఉన్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించారు. స్వగ్రామానికి మృతదేహం తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ విచ్చలవిడిగా శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నట్లుగా సమాచారం ఉందని దీన్ని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల పోస్టర్, కరపత్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. బుధవారం కలెక్టర్ మందిరంలో గ్రంధాలయ వారోత్సవాలకు జిల్లా గ్రంధాలయ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వ తేదీ వరకు జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని కలెక్టర్కు వివరించారు.
టెక్కలి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న టి నర్సింగరావును సస్పెండ్ చేస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఒక గ్రానైట్ క్వారీ సూపర్వైజర్ నుంచి రూ.5వేలు లంచం తీసుకున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఈ విషయంపై సమగ్ర విచారనకు ఆదేశించారు. విచారణలో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఆంధ్రప్రదేశ్లో 6 ఎయిర్పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే మొదలుపెట్టారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 1383 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు మరో 5చోట్ల ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయడానికి రూ.2.27 కోట్లు విడుదల చేయనున్నారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు పెరిగింది. ఈనెల 21 వరకు గడువు పొడిగించినట్లు RIO ప్రగడ దుర్గారావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
రాష్ట్ర అసెంబ్లీ విప్గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ను ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన అశోక్ను విప్గా నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో భాగంగా అశోక్కు ఈ పదవి వరించింది.
Sorry, no posts matched your criteria.