Srikakulam

News June 28, 2024

శ్రీకాకుళం: రెండో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 2020-21 నుంచి అడ్మిట్ అయిన MSc (కంప్యూటర్ సైన్స్) విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టులో నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధరుసుం లేకుండా జూలై 1లోపు చెల్లించాలని పరీక్షల విభాగం తెలిపింది. ఫీజు వివరాలకై అధికారిక వెబ్‌సైట్ https://exams.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని కోరింది.

News June 28, 2024

శ్రీకాకుళం: మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో శుక్రవారం ఉదయం నుంచి నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. పలు ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు జాబ్ మేళాలో భాగంగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 554 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. విద్యార్హతలు, ఉద్యోగ సామర్థ్యం బట్టి వీరిలో 159 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధా తెలిపారు.

News June 28, 2024

ఎచ్చెర్ల: B.Tech 7వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం B.Tech 7వ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కార్యాలయం నుంచి ఈ ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఫలితాల కోసం https://drbrau.in ను సందర్శించాలని ఎగ్జామినేషన్ డీన్ కోరారు.

News June 28, 2024

శ్రీకాకుళం: ఈసెట్-2024 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లకై ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) ఈసెట్-2024 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మిషన్లు కావలసిన విద్యార్థులు ఈ నెల 30లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

News June 28, 2024

లావేరు: ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపికైన రాము

image

లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నెల్లి రాము ఏక కాలంలో రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టి ఔరా అనిపించాడు. రెండు నెలల క్రితం సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగం సాధించిన రాము.. తాజాగా SBIలో క్లర్క్‌గా ఎంపికయ్యాడు. పేదరికంలో పుట్టిన రాము క్రమ శిక్షణతో చదివి ఉద్యోగం సాధించినట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. రాముకు పలువురు అభినందనలు తెలిపారు.

News June 28, 2024

శ్రీకాకుళం: MA రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఫిబ్రవరి-2024లో నిర్వహించిన MA ఇంగ్లిష్ మొదటి సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ లో చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 28, 2024

శ్రీకాకుళం: ప్రియుడు మోసం.. బాలిక ఆత్మహత్యాయత్నం

image

ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి అదే గ్రామానికి చెందిన జగదీశ్ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. శారీరకంగా దగ్గరవడంతో విద్యార్థిని గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని కోరగా జగదీశ్ ముఖం చాటేయడంతో బాలిక యాసిడ్ తాగింది. బాలిక పరిస్థితి విషమం ఉందని పోలీసులు తెలిపారు.

News June 28, 2024

జగన్ గురించి విస్తుపోయే నిజాలు తెలిశాయి: మంత్రి అచ్చెన్న

image

జగన్ వింత ప్రవర్తనపై మాజీ CS ఎల్వీ సుబ్రహ్మణ్యం ద్వారా విస్తుపోయే నిజాలు తెలిశాయని మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ తొలగించి అక్కడ రాజధాని కట్టేద్దామంటూ పిచ్చి సలహాను నాడు సీఎంగా ఉన్న జగన్ ఎల్వీ ముందు పెట్టారని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఈ మేరకు జగన్ మనస్తత్వం గురించి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడిన వీడియోను అచ్చెన్న Xలో పోస్ట్ చేశారు.

News June 28, 2024

కేరళలో కవిటి మండల వాసి మృతి

image

ప్రమాదవశాత్తు కవిటి మండల యువకుడు కేరళలో మృతి చెందిన ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. జి.కరాపాడ గ్రామానికి చెందిన సురేశ్ అలియాస్ కాళీ ఉదయం తాను పని చేస్తున్న ప్రదేశం నుంచి జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సురేశ్‌కు ఇటీవల పెళ్లి నిశ్చయమైనట్లు కుటుంబీకులు తెలిపారు.

News June 28, 2024

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త

image

జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది జిల్లాలోని మొత్తం 93 ఇంటర్ కళాశాలలోని మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 8,420 మంది ఉండగా, మొదటి ఏడాదిలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. జులై 15 నాటికి పుస్తకాలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు.