India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనార్థం భారీగా తరలి వచ్చి ఆలయ ప్రాంగణంలో బారులు తీశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గొండు శంకర్, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, అతిథి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

సోమవారం శ్రీకాకుళంలోని పీజీఆర్ఎస్కు కనుగులువానిపేటకు చెందిన సోనియా అచేతనంగా ఉన్న నాలుగేళ్ల కూమారిడితో వచ్చింది. ఆ బాలుడు పడుతున్న వేదనను కలెక్టర్కు చెప్పుకుంది. రేండేళ్లకే పిట్స్ వచ్చి ఎదుగుదల లేక మంచానికే పరిమితమయ్యాడని, దివ్యాంగ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసి బెడ్ రెస్ట్ పింఛన్ రూ.15,000 ఇవ్వాలని కోరింది. తల్లి ఒడిలో చైతన్యం లేకుండా ఉన్న బాలుడ్ని చూసిన అర్జీదారుల మనస్సు కలవరానికి గురిచేసింది.

మందస(M) మఖరజోలకు చెందిన కూర్మమ్మ (22) సోమవారం సూసైడ్ చేసుకుంది. కడుపునొప్పి తాళలేక జీడీ తోటల్లో ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈమె భర్త ఖతర్లో పని చేస్తున్నాడు. ఇటీవల కడుపునొప్పిగా ఉందని కన్నవారి ఇంటికి రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. ఇంతలోనే కూరమ్మ సూసైడ్ చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లి పద్మ ఫిర్యాదుతో కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి కేసు నమోదు చేశారు.

➲జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్
➲SKLM: పీజీఆర్ఎస్కు 104 దరఖాస్తులు
➲వంశధార,నాగావళి నదులకు తప్పిన వరద ముప్పు
➲అధికారులతో పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష
➲ఎచ్చెర్ల: జగనన్న కాలనీలో సదుపాయాలు ఏవీ?
➲టెక్కలి: 50వేలు గాజులతో లలితాత్రిపుర సుందరీ, రాజరాజేశ్వరి అమ్మవార్లకు అలంకరణ
➲ గోవా గవర్నర్ అశోక్ గజపతిని కలిసిన మంత్రి అచ్చెన్న
➲అరసవల్లి: ఆదిత్యుని ఆదాయం రూ.5.9 లక్షలు

ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా కరెంటు షాక్తో ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి(M) గంగరాజపురం గ్రామానికి చెందిన చంటి(30) ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూపై కప్పునకు ఉన్న కరెంట్ వైర్ తగిలి మరణించాడు. అక్క దమయంతి ఫిర్యాదుతో ఎస్ఐ రమేష్ బాబు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దళిత-ఆదివాసీ-బహుజన-మైనార్టీ సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను సంఘ నేతలు కలుసుకుని వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని అంతా కోరుకుంటున్నారని తెలియజేసారు.

సోంపేట మండలం బారువ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏపీ పుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. భోజనాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చెశారు. అనంతరం వార్డెన్ రవికుమార్ను అభినందిస్తూ సన్మానం చేశారు. ఈ తనిఖీలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి డీడీ మధుసూదనరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి పాల్గొన్నారు.

ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వంశధారకు వరద పోటెత్తింది. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్యలకు పైగా నీరు నదిలో ప్రవహించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వంశధారలో 29,224 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీ 22 గేట్లను కాస్త లిఫ్ చేసి దిగువ ప్రాంతానికి నీరు విడిచి పెడుతున్నట్లు వంశధార డీఈ సరస్వతి వెల్లడించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ప్రవాహం లేదు.

ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే దానికి అనుబంధంగా 140సంస్థలు వస్తాయని.. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఫైలెట్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడంపై ఆలోచిస్తామన్నారు. రైతులకు నష్టం జరగకుండా భూములు తీసుకుంటామని.. కొన్నిపార్టీలు రైతులను అపోహలకు గురి చేస్తున్నారని గౌతు శిరీష అన్నారు. ఎకరాకు రూ.కోటి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్.

టెక్కలిలోని పట్టుమహాదేవి కోనేరుగట్టుపై ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో లలితా త్రిపుర సుందరీ, రాజరాజేశ్వరి అమ్మవార్లకు 50వేలు గాజులతో సోమవారం అలంకరణ చేపట్టారు. గౌరీపౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు తర్లా శివకుమార్ ఆధ్వర్యంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఏటా గౌరీపౌర్ణమి నాడు గాజులతో అలంకరణ చేస్తున్నట్లు శివకుమార్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.