Srikakulam

News January 12, 2025

శ్రీకాకుళం: పాఠశాలల్లో కొత్తగా క్లస్టర్ విధానం

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా క్లస్టర్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న 235 కాంప్లెక్స్‌లకు గాను 170A క్లస్టర్లుగా.. 65బి క్లస్టర్లగా విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ తిరుమల చైతన్య తెలిపారు. అలాగే పంచాయతీ పరిధిలో మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు కూడా ఉత్తర్వులు వచ్చాయన్నారు.

News January 12, 2025

పలాస నేషనల్ హైవేపై వ్యాన్ బోల్తా

image

మండలంలోని నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై మినీ వ్యాన్ శనివారం రాత్రి అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ సమయంలో భారీ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు.

News January 11, 2025

SKLM: ఈ నెల 12 నుంచి పోలీస్ పీఈటీ పరీక్షలు వాయిదా

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు పోలీస్ పీఈటీ పరీక్షలు నిర్వహించడం లేదని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని వెల్లడించారు. మళ్లీ జనవరి 16వ తేదీ నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు యథావిథిగా దేహదారుఢ్య పరీక్షలు పునఃప్రారంభం అవుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.

News January 11, 2025

SKLM: ఈ నెల13న మీకోసం ఫిర్యాదుల స్వీకరణ రద్దు

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 13న సోమవారం జరుగు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలు వృథా చేసుకొని పోలీసు కార్యాలయానికి రావద్దని ఎస్పీ సూచించారు.

News January 11, 2025

ఆ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి: ఎంపీ కలిశెట్టి

image

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధకు గురి చేసిందని ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని TTD ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, EO శ్యామలరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయాల్లో, కళ్యాణ మండపాలలో టోకెన్లను జారీ చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు.

News January 11, 2025

రణస్థలం : వ్యక్తి మృతి కేసులో లారీ డ్రైవర్‌కు శిక్ష

image

రణస్థలానికి చెందిన లారీ డ్రైవర్ ఈశ్వరరావుకు 6 నెలలు జైలు, రూ.5 వేలు జరిమానా విధించినట్లు జేఆర్ పురం ఎస్సై చిరంజీవి తెలిపారు. 2019 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దేరసాం గ్రామానికి చెందిన రాము మృతి చెందారు. ఆ ప్రమాదంలో నిందితుడైన డ్రైవర్ ఈశ్వరరావుకు శిక్ష విధిస్తూ.. ఏఎంఎఫ్ సీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శ్రీకాకుళం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.

News January 11, 2025

SKLM: సంక్రాంతి ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

సంక్రాంతి పండుగ సంప్రదాయ పద్ధతిలో ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం, కోడి పందాలు, డొక్కు ఆట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈవిటీజింగ్, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించిన వారిపై  కేసులు నమోదు చేస్తామన్నారు.

News January 10, 2025

పాలకొండ: అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య

image

వీరఘట్టం మండలం సంత నర్సిపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. స్థానికుల కథనం మేరకు ఇంత రామకృష్ణ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలియడంతో పాలకొండ సీఐ చంద్రమౌళి, వీరఘట్టం ఎస్సై కళాధర్ శుక్రవారం ఉదయం పోలీస్ సిబ్బందితో వెళ్లి ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

News January 10, 2025

శ్రీకాకుళం: నేటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జనవరి 19 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. దీనితో విద్యార్థులు ఊళ్లకు పయనమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 3 లక్షల 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు కచ్చితంగా సెలవులు అమలు చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 10, 2025

SKLM: దొంగలు వస్తారు..జాగ్రత్త

image

శ్రీకాకుళం పట్టణ ప్రజలకు రెండో పట్టణ సీఐ పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండగకు గ్రామాలకు వెళ్లే పట్టణ ప్రజలు మీ విలువైన బంగారు ఆభరణాలు నగదు తీసుకుని వెళ్లాలని అన్నారు. లేకుంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సీఐ చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ పరిధిలోని గురువారం ప్రచారం రథాల ద్వారా పట్టణ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.