India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం వివిధ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆర్ఓబీకి సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ట్రాన్స్కోకు సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉందని వాటిని త్వరలోనే ఇస్తామన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇవాళ్టి(మంగళవారం)తో ముగుస్తుంది. పరీక్ష ఫీజును అక్టోబర్ 29 నుంచి చెల్లించేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రాక్టికల్స్ నవంబర్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. అత్యధికంగా వంశధార ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులకు రూ.63.50 కోట్లు ప్రతిపాదించింది. మహేంద్ర తనయ నదిపై ఆఫ్షోర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.35 కోట్లు కేటాయించింది. తోటపల్లి, నారాయణపురం ఆనకట్ట పనులకు రూ.32.84 కోట్లు ప్రకటించింది. వీటితో పాటు జిల్లాకు ప్రత్యేకంగా పోలీస్ బెటాలియన్ కేటాయించింది. కొత్తగా సైబర్ స్టేషన్ సైతం రానుంది.
రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య హ్యాండ్ బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు విజేతలుగా నిలిచారు. గత మూడు రోజులుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన అండర్-19 బాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టు ప్రథమస్థానం సొంతం చేసుకున్నారు. జట్టు కోచ్ మేనేజర్లుగా ఆర్.సతీష్రయుడు, జి.డిల్లీశ్వరరావు, రాజశేఖర్ వ్యవహారించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో స్వామి వారి మూలవిరాట్ విగ్రహనికి మంగళవారం పూర్తిగా బంగారు ఆభరణాలతో అలంకరిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. నేడు కార్తీక శుద్ధ ఏకాదశి, రేపు ద్వాదశి కావడంతో ప్రత్యేక అలంకరణలో దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ డీసీ వై.భాద్రజీ వెల్లడించారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
లావేరు మండలంలోని భీమునిపాలెంలో అదపాక రహదారిపై సోమవారం సాయంత్రం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తామాడ మెడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న కొత్తకోట గ్రామానికి చెందిన 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరికి కాళ్ళు, చేతులు విరిగిపోవడంతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులందరినీ స్థానికులు సహాయంతో 108లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.
ప్రజా ఫిర్యాదులకు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని ఏఎస్పీ శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కార కార్యక్రమంలో 49 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి వీలైనంత తొందరగా పరిష్కరించాలన్నారు. పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35 వేల మందికిపైగా చదువుతున్నారు. అక్టోబర్ 21 నుంచి చెల్లింపు మొదలవ్వగా వీరంతా ఈ నెల 11వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే భోగాపురం ఎయిర్ పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లడించారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం 6వ సారి ఆయన ఏర్పోర్టు పనులను పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
లావేరు మండలం గోవిందపురం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుంటముక్కల శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే బూర్జ మండలంలోని ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.