India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ చిన్నారిని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫామ్పై ఓ వ్యక్తికి పాపని చూడమని, టాయిలెట్కి వెళ్లి వస్తామని ఓ మహిళ అప్పగించి వెళ్లిపోయారు. తిరిగి ఆ వ్యక్తి రాకపోవడంతో GRP పోలీసుల సహకారంతో పలాస రైల్వే స్టేషన్లో చైల్డ్ హెల్ప్ డెస్క్కు చిన్నారిని అప్పగించారు.

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.

కరెంట్ షాక్తో ఓ ఎలక్ట్రీషియన్ మృతిచెందిన ఘటన పొందూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు మేరకు.. మండలంలోని పుల్లాజీపేట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు (39) ఎలక్ట్రిషీయన్గా జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఇంట్లో ఎలక్ట్రానిక్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.

రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 5,6 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమవుతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో వివిధ రైతు సంఘాలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో 48 గంటలు పట్టేదని అటువంటి ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరళతరం చేస్తారన్నారు. దీనికి సంబంధించి సమస్యలను రైస్ మిల్లర్లకు అడిగి తెలుసుకున్నారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా ముందస్తు ప్రణాళికతో ధాన్యం సేకరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మనోహర్, కమీషనర్, MD సూచనలు అనుసరించి రైతులు దగ్గర నుంచి దాన్యం కొనుగోలు చేయాలన్నారు.

➧కల్తీ మద్యం వ్యవహారంపై జిల్లాలో పలు చోట్ల వైసీపీ నిరసన
➧ బాలీయాత్రపై సీఎం చంద్రబాబుకు వివరించాం: ఎమ్మెల్యే కూన
➧ కొత్తూరు: నీట మునిగిన పంటను పరిశీలించిన అధికారులు
➧వజ్రపుకొత్తూరు: విద్యాబుద్ధులు నేర్పిన బడిలోనే..టీచర్గా చేరింది
➧ ఎస్పీ గ్రీవెన్స్కు 50 వినతులు
➧శ్రీకాకుళం: 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
➧టెక్కలి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల గొడవ

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 528 మంది నూతన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారని DEO రవిబాబు తెలిపారు. వీరికి ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించి, పోస్టింగ్ ఆర్డర్స్ జారీచేశామని వెల్లడించారు. వీరంతా సోమవారం విధుల్లో చేయనుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నామని DEO పేర్కొన్నారు.

రైతులు వద్ద ధాన్యం కొన్న తరువాత రవాణా చేసే ప్రతి వాహనానికి కచ్చితంగా జీపీఎస్ GPS పరికరం అమర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా రూ.3068 చెల్లించి GPS యంత్రాన్ని అమర్చుకోవాలని సూచించారు. రైతుసేవా కేంద్రాల వద్ద వాటి వివరాలు నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు.

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో రవిబాబు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నపత్రాల పంపిణీ కార్యక్రమం పూర్తయిందన్నారు. 1 తరగతి నుంచి 5వ తరగతులకు 13 నుంచి 15వ తేదీ వరకు, 6వ తరగతి నుంచి 10 వరకు 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పకడ్బందీగా చేపడుతున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.