Srikakulam

News November 13, 2024

ఎచ్చెర్ల: ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్

image

ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన మొదలవలస చిన్నారావు (33) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని బికనీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను ఉన్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. స్వగ్రామానికి మృతదేహం తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News November 13, 2024

మాదకద్రవ్య రహిత శ్రీకాకళం జిల్లాగా కృషి చేయాలి: ఎస్పీ

image

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ విచ్చలవిడిగా శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నట్లుగా సమాచారం ఉందని దీన్ని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

News November 13, 2024

SKLM: 14 నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రంధాలయ వారోత్సవాలు

image

శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల పోస్టర్, కరపత్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. బుధవారం కలెక్టర్ మందిరంలో గ్రంధాలయ వారోత్సవాలకు జిల్లా గ్రంధాలయ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వ తేదీ వరకు జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని కలెక్టర్‌కు వివరించారు.

News November 13, 2024

టెక్కలి ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు

image

టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న టి నర్సింగరావును సస్పెండ్ చేస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఒక గ్రానైట్ క్వారీ సూపర్‌వైజర్ నుంచి రూ.5వేలు లంచం తీసుకున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఈ విషయంపై సమగ్ర విచారనకు ఆదేశించారు. విచారణలో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.

News November 13, 2024

శ్రీకాకుళంలో ఫీల్డ్ ఎయిర్ పోర్టు.?

image

ఆంధ్రప్రదేశ్‌లో 6 ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే మొదలుపెట్టారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 1383 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు మరో 5చోట్ల ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయడానికి రూ.2.27 కోట్లు విడుదల చేయనున్నారు.

News November 13, 2024

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు పెరిగింది. ఈనెల 21 వరకు గడువు పొడిగించినట్లు RIO ప్రగడ దుర్గారావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News November 12, 2024

అసెంబ్లీ విప్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్

image

రాష్ట్ర అసెంబ్లీ విప్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన అశోక్‌ను విప్‌గా నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో భాగంగా అశోక్‌కు ఈ పదవి వరించింది.

News November 12, 2024

ROB భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం వివిధ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆర్ఓబీకి సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ట్రాన్స్‌కోకు సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉందని వాటిని త్వరలోనే ఇస్తామన్నారు.

News November 12, 2024

శ్రీకాకుళం: నేడే చివరి అవకాశం

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇవాళ్టి(మంగళవారం)తో ముగుస్తుంది. పరీక్ష ఫీజును అక్టోబర్ 29 నుంచి చెల్లించేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రాక్టికల్స్ నవంబర్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

News November 12, 2024

వంశధారకు రూ.63.50 కోట్ల కేటాయింపు

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. అత్యధికంగా వంశధార ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులకు రూ.63.50 కోట్లు ప్రతిపాదించింది. మహేంద్ర తనయ నదిపై ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.35 కోట్లు కేటాయించింది. తోటపల్లి, నారాయణపురం ఆనకట్ట పనులకు రూ.32.84 కోట్లు ప్రకటించింది. వీటితో పాటు జిల్లాకు ప్రత్యేకంగా పోలీస్ బెటాలియన్ కేటాయించింది. కొత్తగా సైబర్ స్టేషన్ సైతం రానుంది.