Srikakulam

News November 8, 2024

SKL: ఆర్టీసీ బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కంచిలి మం. ముండల గ్రామంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద పడి మూడేళ్ల బాలుడు దివ్యాంశ్ ప్రధాన్ మృతి చెందాడు. కేబినౌగం నుంచి కంచిలి వస్తున్న ఆర్టీసీ బస్సు ముండల గ్రామాన్ని దాటుతున్న సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కిందపడ్డాడు. బాలుడి తండ్రి ఉపాధి కోసం ఇతర దేశంలో ఉండగా తల్లి సంగీత ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దనే ఉంటున్నారు.

News November 8, 2024

ITEP 2వ సెమిస్టర్ టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ఏయూలో పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి నాలుగో సంవత్సరం ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP) 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

News November 8, 2024

కన్యాకుమారి వరకు సిక్కోలు కుర్రాడి సైకిల్ యాత్ర

image

శ్రీకాకుళం పట్టణానికి చెందిన యాగాటి ఉదయ్ అనే యువకుడు శ్రీకాకుళం నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేశాడు. యువత డ్రగ్స్‌కి బానిసలు కాకూడదని, ఆడవారిని గౌరవించాలనే నినాదంతో గత నెల15న సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈనెల 7న గురువారం నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు. 1900 కిలోమీటర్ల సైకిల్ యాత్రను 22 రోజుల్లో పూర్తి చేశాడు. ఉదయ్‌కు తల్లిదండ్రులు, స్నేహితులు, పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు.

News November 8, 2024

శ్రీకాకుళం: DSC అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసే DSC ఉపాధ్యాయ పోస్టుల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 10వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. ఈ టెస్ట్ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే హాల్ టికెట్లు జ్ఞానభూమి వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News November 8, 2024

శ్రీకాకుళం: పోస్ట్ ఆఫీస్‌లోనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ ఫలాలు తప్పకుండా రావాలంటే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ తప్పనిసరిగా ఉండాలని శ్రీకాకుళం డివిజన్ ఐపీపీబీ అధికారి షరీఫ్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌‌ను సంప్రదించాలన్నారు. దీని కోసం పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకుని, సంక్షేమ ఫలాలు నేరుగా పోస్ట్ ఆఫీసుల్లోనే పొందవచ్చని తెలిపారు.

News November 7, 2024

ఇచ్ఛాపురం: జానకికి 3సెంట్ల ఇంటి పట్టా అందజేత

image

మండలంలోని ఈదుపురం గ్రామానికి చెందిన బలిజపల్లి జానకికి సీఎం చంద్రబాబు హామీ మేరకు 3 సెంట్ల ఇళ్ల స్థలాన్ని మంజూరు చేశారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక MLA బెందాళం అశోక్ సంయుక్తంగా గురువారం ఇంటి పట్టా అందజేశారు. దీపం 2 పథకాన్ని ప్రారంభించేందుకు ఇటీవల ఈదుపురం వచ్చిన CM చంద్రబాబు ఒంటరి మహిళ అయిన జానకికి పెన్షన్‌తో పాటు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

News November 7, 2024

శ్రీకాకుళం: B.Ed సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్పెషల్ B.Ed M.R 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 11వ తేదీ వరకు, రూ.100 అపరాధ రుసుముతో 12 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. నవంబర్ 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

News November 7, 2024

శ్రీకాకుళం: LAW ప్రవేశాలకు నేడే చివరి రోజు

image

న్యాయవిద్యలో లా సెట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులు గురువారం సాయంత్రం ఐదు గంటలలోపు ప్రవేశం పొందవలసి ఉంటుందని కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ వై రాజేంద్రప్రసాద్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం న్యాయ న్యాయ కళాశాల ప్రవేశాలకు 66 సీట్లకు 65 మంది ఆప్షన్ ఇచ్చుకున్నారు. సీట్లు లభించిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. లేదంటే సీటు రద్దు అవుతుంది.

News November 7, 2024

శ్రీకాకుళం: పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో నాలుగు రోజులే

image

శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజును మరో నాలుగు రోజుల్లో చెల్లించాలి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35 వేల మందికి పైగా చదువుతున్నారు. అక్టోబర్ 21 నుంచి చెల్లింపు మొదలవ్వగా వీరంతా ఈ నెల 11వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

News November 7, 2024

శ్రీకాకుళం: జిల్లాలో ముమ్మరంగా అపార్ నమోదు ప్రక్రియ

image

సిక్కోలు జిల్లాలో అపార్ ఐడి కార్డు నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పాఠశాలలో కళాశాలల యాజమాన్యం నమోదు ప్రక్రియ ప్రారంభించింది. జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 11,816 మంది, ప్రైవేటు మరో 23,498 మంది ఉన్నారు. అలాగే జిల్లాలో 1,915 ప్రాథమిక పాఠశాలల్లో 1.79 లక్షల మంది చదువుతున్నారు. వీరందరికీ కార్డులను మంజూరు చేస్తారు.

error: Content is protected !!