Srikakulam

News November 2, 2024

SKLM: రూ.1.50 లక్షల చెక్కు అందించిన కలెక్టర్

image

క్యాన్సర్‌తో బాధ పడుతున్న తన తల్లికి మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన 24 గంటల్లోనే బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల చెక్కును కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం అందజేశారు. జలుమూరు మండలం కరకవలస గ్రామానికి చెందిన పేరాడ సాయిరాం తన తల్లి అమ్మన్నకు క్యాన్సర్ సోకిందని, ఎంత ఖర్చు చేసినా మెరుగైన వైద్యం అందించలేక పోతున్నామని ముఖ్యమంత్రి ఎదుట వాపోయాడు.

News November 2, 2024

REWIND: ఎర్రన్నాయుడు మృతి చెంది నేటికి 12 ఏళ్లు

image

కింజరాపు ఎర్రన్నాయుడు మృతి చెంది నేటికి సరిగ్గా 12 ఏళ్లు అయింది. అది 2012 NOV 1వ తేదీ అర్ధరాత్రి 1 గంట పలు కార్యక్రమాలకు హాజరై శ్రీకాకుళం తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 2 గంటల సమయంలో రణస్థలానికి సమీపంలోని యూటర్న్‌ తీసుకుంటున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. శ్రీకాకుళం కిమ్స్‌కి తరలించారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ లేకపోవడంతో పరిస్థితి విషమించి 2న కన్నుమూశారు.

News November 2, 2024

వీరఘట్టం: ట్రైన్ కిందపడి యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలమైందని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కొనిసి శివకుమార్ (27) పార్వతీపురం కేంద్రంలోని శనివారం టౌన్ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్‌కు ప్రేమ వ్యవహరమే కారణమని గ్రామస్థులు అంటున్నారు.

News November 2, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ జి.పద్మారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్, నవంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు 3వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. జిల్లాలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలను నియమించారు.

News November 2, 2024

శ్రీకాకుళం జిల్లా మీదుగా స్పెషల్ ట్రైన్

image

శ్రీకాకుళం జిల్లా మీదుగా విశాఖ-దానాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రైస్ (08520) రైలును నవంబర్ 4న నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగనుంది. శ్రీకాకుళం రోడ్డుకు ఉదయం 11 గంటలకు, పలాస స్టేషన్‌కు మ.12:30 గంటలకు రానుంది. దానాపూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ ప్రైస్ (08519) రైలు నవంబర్ 5న బయలుదేరి ఇది పలాస స్టేషన్‌కి ఉ.11:52కి, శ్రీకాకుళం రోడ్డుకు మ.12:57కి రానుంది.

News November 2, 2024

SKLM: జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

image

శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం జిల్లా అభివృద్ధిపై చర్చలు జరిపారు. జిల్లాకు కావాల్సిన నిధులు, పెండింగ్ పనులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు జిల్లా అభివృద్ధికి పలు సూచనలు చేశారు. సీఎంతో పాటుగా మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

News November 1, 2024

టెక్కలి లేదా పలాస ఎయిర్ పోర్టు నిర్మాణం: సీఎం చంద్రబాబు

image

శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు సమీపంలో సుమారు 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఈదుపురం సభలో ఆయన మాట్లాడుతూ.. టెక్కలి లేదా పలాస ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. చంద్రబాబు ప్రకటనతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News November 1, 2024

ఇచ్ఛాపురం: సీఎం సభలో జిల్లా కూటమి నేతల సందడి

image

ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని ఈదుపురం గ్రామంలో శుక్రవారం జరిగిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కూటమి నేతలు సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌తో పాటు ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, ఎన్.ఈశ్వరరావు, జనసేన, బీజేపీ నాయకులు సీఎం సభకు హాజరయ్యారు.

News November 1, 2024

ఇచ్చాపురం చేరుకున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చాపురం చేరుకున్నారు. మండలంలోని ఈదుపురం గ్రామంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబును కోరారు‌. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

News November 1, 2024

దీపావళి వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

image

శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం రాత్రి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడతమలోని తన నివాసం వద్ద కుటుంబీకులతో పండగ పూట సరదాగా గడిపారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ లక్ష్మీ కటాక్షంతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ‘X’ లో పోస్ట్ చేశారు.

error: Content is protected !!