India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవి బాబుకు ఉత్తమ పురస్కారం దక్కింది. విద్యాశాఖలో చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తించి ఈ పురస్కారాన్ని అందించారని ఆయన తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నానని వివరించారు. జిల్లాలో విద్యాశాఖ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన పోలీస్ జాగిలం (మున్నా డాగ్ ) కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కు సోమవారం షేక్ హ్యాండ్ ఇచ్చింది. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్కు స్వాగతం పలుకుతూ ముందుగా పుష్పగుచ్ఛం అందజేసింది. సలాం చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రౌండ్లో ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను ఆయన చదివి వినిపిస్తారు. వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి శకటాలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను ఆయన చదివి వినిపిస్తారు. వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి శకటాలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను ఆయన చదివి వినిపిస్తారు. వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి శకటాలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజా ఫిర్యాదుల నమోదుని రద్దు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని జరిగే ఈ కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు అర్జీదారులు ఎవరు జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.

అరవసల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఉత్సవాలలో భాగంగా భక్తులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. రథసప్తమి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారన్నారు. సాయంత్రం నాటికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు సుమారు 1.40లక్షలు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 27న ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి కే.సుధ శనివారం తెలిపారు. శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ వెనుక ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఎంపికలు ఉంటాయన్నారు. పేటీఎం సంస్థలో (10th పాస్తో) 55 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్ట్లు, సోలార్ ఎనర్జీలో (డిగ్రీతో) సేల్స్ ఎగ్జిక్యూటీవ్లు ఉన్నాయన్నారు. అభ్యర్థులకు 18 ఏళ్ల వయసు నిండాలన్నారు.

జలుమూరు మండలం చల్లవానిపేట చెరువు మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 14 ఏళ్ల బాలుడు ఋషి ఈ ప్రమాదంలో మృతి చెందాడు. చోదకుడితో పాటు బైక్పై ఉన్న వారికి గాయాలవ్వడంతో స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

రథసప్తమి వేడుకల్లో భాగంగా శనివారం నాటి వివరాలు ఇలా…
*సాయంత్రం 6.గం లకు తన్మయి శాస్త్రీయ నృత్యం, గణపతి శర్మ, యామిని కర్రిల మ్యూజికల్ షోలు,
రాత్రి 7:00 నుంచి థమన్ లైవ్ కాన్సర్ట్, ఢీ డాన్సర్స్ ఆక్సా ఖాన్, మణికంఠ, తేజస్వినిల ప్రదర్శనలు,* సినీ నటుడు ఆది ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, చంద్రికలు యాంకర్లుగా, డ్రోన్ షో కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.