Srikakulam

News October 30, 2024

శ్రీకాకుళంలో అత్యధికంగా మహిళా ఓటర్లు

image

ముసాయిదా ఓటరు జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శ్రీకాకుళం ఉంది. నియోజకవర్గం మొత్తం 2,73,364 మంది ఓటర్ల ఉండగా అందులో 1,38,020 మంది మహిళా ఓటర్ల ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను నియమించారు.

News October 30, 2024

బూర్జ: బాలికకు వేధింపులు.. పోక్సో కేసు నమోదు

image

విజయవాడలో చదువుకుంటున్న బూర్జ మండలం సుంకరపేటకు చెందిన విద్యార్థినికి వేధింపుల విషయంలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. 9వ తరగతి విద్యార్థిని(14)పై మేనమామ వరసైన సూరిబాబు మాయమాటలతో 2022లో అత్యాచారం చేయగా, పెద్దలు వివాహం చేశారు. రెండేళ్లు గడవకముందే అత్తమామలు, భర్త వేధించడంతో పోలీసులను ఆశ్రయించింది. బాలికకు పదహారేళ్లు కావడంతో విజయవాడ గుణదల పోలీసులు పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేశారు.

News October 30, 2024

శ్రీకాకుళం: ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్

image

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డిప్యూటీ కలెక్టర్ల పోస్టింగ్‌లలో జిల్లాకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో పలాస రెవెన్యూ డివిజినల్ అధికారిగా వెంకటేశ్వర్లును నియమించిందన్నారు. కలెక్టరేట్ KRRC విభాగం అధిపతిగా పద్మావతిని నియమించారని తెలిపారు. లావణ్యను BRR వంశధార ప్రాజెక్టు భూ సేకరణధికారిగా నియమించారని ఆ ప్రకటనలో తెలిపారు.

News October 30, 2024

క్రికెట్ ఆడుతూ సత్యవరం యువకుడు మృతి

image

నరసన్నపేట మండలం సత్యవరంలో విషాదం నెలకొంది. వై.కృష్ణప్రసాద్(25) క్రికెట్ ఆడుతూ మృతిచెందాడు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఇతను ఈ నెల 27న స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ అలసట ఉందని తన గదికి వచ్చేశాడు. గుండెపోటు రావడంతో స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మంగళవారం సత్యవరంలో అంత్యక్రియలు చేపట్టారు.

News October 30, 2024

శ్రీకాకుళం: ఈదుపురంలోనే సీఎం చంద్రబాబు సభ

image

సీఎం చంద్రబాబు ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో నవంబర్ 1న పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. జిల్లా పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డీవోతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

News October 30, 2024

SKLM: ఈదుపురంలోనే సీఎం చంద్రబాబు సభ

image

సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురంలో నవంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈదుపురం పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డిఓతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

News October 29, 2024

శ్రీకాకుళం: ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల

image

ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల అయింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 16,185 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులు ఫైనల్ కీ కోసం https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో సందర్శించాలి. నవంబర్ 2వ తేదీన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయనుంది.

News October 29, 2024

ఈదుపురంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సభ

image

సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురంలో నవంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈదుపురం పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డిఓతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

News October 29, 2024

శ్రీకాకుళం జిల్లాలో జీడీ, మామిడి రైతులకు గుడ్ న్యూస్

image

శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 వేల ఎకరాలలో సాగు చేస్తున్న జీడి, మామిడి రైతులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని జిల్లా ఉద్యానాధికారి రత్నాల వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లిన పంటలకు భీమా పరిహారం పథకం అందుబాటులోకి వచ్చిందన్నారు. సంబంధిత మీ సేవా వద్ద వివరాలు జమచేసి ఇన్సురెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News October 29, 2024

శ్రీకాకుళం: అధ్యాపకులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలి

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని DRO ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. వచ్చే నెల 23వ తేదీన ఉపాధ్యాయ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 8వ తేదీ ఆఖరని తెలిపారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.

error: Content is protected !!