Srikakulam

News June 21, 2024

పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా..

image

పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా సంస్థ సంయుక్త సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. శ్యాంబాబు తెలిపారు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండి, పాలిటెక్నిక్, బీటెక్, డిగ్రీ అర్హతలు గల అభ్యర్థులు ముందుగా gdcplkd.ac.in వెబ్‌సైట్లో పేరు నమోదు చేసుకొని పాస్ ఫోటో, బయోడేటా, అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

News June 21, 2024

అభివృద్ధికి జట్టుగా పని చేద్దాం: ఎంపీ రామ్మోహన్

image

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలుగా ఎన్నికై శుక్రవారం శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన నాయకులకు ఎంపీ రామ్మోహన్ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఒక జట్టులా కృషిచేద్దామంటూ రామ్మోహన్నాయుడు జిల్లా నుంచి ఎన్నికైన వారికి X (ట్విటర్)లో ట్వీట్ చేశారు.

News June 21, 2024

శ్రీకాకుళం మహిళలకు వసతి భోజనంతో శిక్షణ

image

ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 25 నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళల కోసం టైలరింగ్‌లో 30 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనుంది. శిక్షణాకాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని సంస్థ డైరెక్టర్ కల్లూరు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. వివరాలకు మండల కేంద్రంలో ఉన్న శిక్షణ సెంటర్లో సంప్రదించాలని కోరారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య మహిళలు అర్హులని అన్నారు.

News June 21, 2024

శ్రీకాకుళం: MA పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన MA కోర్సుల పీజీ నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 21, 2024

SLKM: దర్శకుడు అవుతారా? ఎస్పీ GOODNEWS

image

జూన్ 26 తేది అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించేలా 3నిమిషాల నిడివిగల లఘు చిత్రాన్ని చిత్రీకరించి 6309990940 (PRO) జూన్ 25 తేది ఉదయానికి వాట్సాప్ ద్వారా పంపించాలని జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక శుక్రవారం కోరారు. వచ్చిన లఘు చిత్రాలను ఎంపిక చేసి రూ.5 వేలు, 3 వేలు నగదు బహుమతి అందజేస్తామన్నారు.

News June 21, 2024

శ్రీకాకుళం: వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంపు

image

తొగరం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంచినట్లు ప్రిన్సిపల్ పైడి వెంకటరావు గురువారం తెలిపారు. విద్యార్థులు కోర్సుల్లో చేరేందుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందని చెప్పారు. 2002 ఆగస్టు 31 నుంచి 2009 ఆగస్టు 31 మధ్యలో జన్మించి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. www.angrau.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 21, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ఫలితాల్లో ఎంతమంది పాస్ అయ్యారంటే..!

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు మొత్తం 9,832 మంది విద్యార్థులు హాజరు కాగా 9,777 మంది ఉత్తీర్ణత సాధించారు. 99.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కోర్సులు వారీగా బీఏలో 1235 మందికి 1229 మంది, బీసీఏలో 160 మందికి 155 మంది, బీసిఏలో 158 మందికి 156 మంది, బీకాంలో 1519 మందికి 1509 మంది, బీఎస్సీలో 6760 మందికి 6728 మంది ఉత్తీర్ణత సాధించారు.

News June 21, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

image

పలాస, శ్రీకాకుళం మీదుగా డిబ్రుగఢ్(DBRG)- కన్యాకుమారి(CAPE) మధ్య ప్రయాణించే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇకపై ప్రతి రోజు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.నెం .22504 DBRG – CAPE ట్రైన్‌ను జులై 8 నుంచి, నెం.22503 CAPE – DBRG ట్రైన్‌ను జులై 12 నుంచి ప్రతిరోజూ నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News June 21, 2024

ఎచ్చెర్ల: 99.44 శాతం ఉత్తీర్ణత

image

డా.బిఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌కు 9,832 మంది విద్యార్థులకు గాను 9,777 మంది (99.44 శాతం) ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ డీన్ ఎస్ ఉదయ్ భాస్కర్ వివరాలను వెల్లడించారు. బీఈడీ మూడో సెమిస్టర్లో 1,027 కి 875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.

News June 21, 2024

శ్రీకాకుళంలో 26న సైకిల్ ర్యాలీ: ఎస్పీ రాధిక

image

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక తెలిపారు. ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 26వ తేదీ ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి 7 రోడ్డు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. యువత ఉత్సాహంగా పాల్గొనాలని, డగ్స్ వల్ల కలిగే  అనర్థాలపై అవగాహన కోసమే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.