Visakhapatnam

News August 25, 2025

విశాఖలో రైల్వే ఆధునీకరణపై ఎంపీ భరత్ సమీక్ష

image

విశాఖ ఎంపీ శ్రీభరత్ సోమవారం చిన్న వాల్తేరు రైల్వే గెస్ట్ హౌస్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాధుర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, కొత్త రైళ్లు, ఆధునిక సదుపాయాలపై చర్చించి రైల్వే ప్రాజెక్టులు వేగవంతం కావాలని కోరారు. జీఎం పూర్తి సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి కొనసాగుతుందని ఎంపీ స్పష్టం చేశారు.

News August 25, 2025

విశాఖలో ఖమ్మం యువతి అత్మహత్య

image

విశాఖలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. ఖమ్మం జిల్లాకు చెందిన నరేశ్, రమ్య HYDలో పనిచేస్తూ ప్రేమించుకున్నారు. ఈనెల 11న ఇద్దరూ విశాఖ వచ్చారు. కొబ్బరితోట ఏరియాలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పెళ్లి చేసుకుందామని రమ్య కోరగా..‘నాకు ముందే పెళ్లి అయ్యింది. నిన్ను చేసుకోలేను’ అని చెప్పి నరేశ్‌ ఎటో వెళ్లిపోయాడు. ఇంట్లో రమ్య శనివారం ఉరేసుకుంది. నరేశ్‌ని అరెస్ట్ చేసినట్లు 2టూన్ CI ఎర్రన్నాయుడు తెలిపారు.

News August 25, 2025

విశాఖ: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్

image

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. విశాఖ జిల్లాలో 5,17,149 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వలస వెళ్లిన లబ్ధిదరులు తమ కార్డును నమోదు చేసుకున్న రేషన్ దుకాణం వద్దే తీసుకోవాలన్నారు. ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.

News August 24, 2025

కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

image

సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు హాజరవుతారు. అర్జీలు, పాత స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం అయిన వెంటనే మెసేజ్ వస్తుందని చెప్పారు. కాల్ సెంటర్ 1100 లేదా meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కోరారు.

News August 24, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో గంజాయి స్మగ్లర్ల అరెస్టు

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో జి.ఆర్.పీ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. ధనంజయనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం జి.ఆర్.పీ-ఆర్‌పీఎఫ్ సంయుక్త తనిఖీల్లో, కర్ణాటకకు చెందిన రసూల్ (27), షాదీక్ హుస్సేన్ వద్ద నుంచి రూ.50,000 విలువైన 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి ముఠాలపై ప్రత్యేక నిఘా బృందాలతో విశాఖ, దువ్వాడ, అనకాపల్లి, సింహాచలం స్టేషన్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

News August 24, 2025

జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లపై సమీక్ష

image

జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు హాజరుకానుండటంతో రవాణా, వసతి, పార్కింగ్, భద్రత, తదితర సదుపాయాలపై అధికారులు, నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జీవీఎంసీ కమిషనర్ పాల్గొన్నారు

News August 24, 2025

విశాఖలో ఉదయాన్నే యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలో ఆదివారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గంట్యాడ నుంచి గంగవరానికి వెళ్లే దారిలో కొంగపాలెం జంక్షన్ వద్ద నడిచి వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న న్యూ పోర్టు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 24, 2025

‘కార్పొరేటర్ల భద్రతను పట్టించుకోని జీవీఎంసీ’

image

జీవీఎంసీ ప్రతి ఏటా కార్పొరేటర్ల కోసం స్టడీ టూర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భద్రత విషయంలో గాలికి వదిలేస్తుందని 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నాలుగుసార్లు స్టడీ టూర్ ఏర్పాటు చేయగా ప్రతిటూర్‌లో అవకతవకలు, ఇబ్బందులు జరిగాయన్నారు. తిరిగి పాత ట్రావెల్స్ నిర్వహించిన వ్యక్తికే ఈసారి కూడా స్టడీ టూర్ అప్పగిస్తున్నారని భద్రతను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు.

News August 24, 2025

విశాఖలో పోలీసులకు రివార్డులు

image

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 122 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.

News August 24, 2025

విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు

image

ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ద్వారా డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకం చేపడుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనాయుడు శనివారం వెల్లడించారు. స్త్రీ శక్తి పథకానికి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ, మద్దిలపాలెం, గాజువాక, వాల్తేర్, స్టీల్ సిటీ, సింహాచలం, మధురవాడ డిపోలలో నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ఆసక్తి గల వారు ఆయా డిపోల్లో సంప్రదించాలన్నారు.