Visakhapatnam

News September 12, 2024

విశాఖ: తిరుపతి శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు

image

తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.47కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు.

News September 12, 2024

పరవాడ ఫార్మాసిటీలో విషాదం

image

పరవాడ ఫార్మాసిటీలో విషాదం నెలకొంది. ఎడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమంలో అదృశ్యమైన ఆర్.సూర్యనారాయణ మిథనాల్ ట్యాంకులో గురువారం శవమై కనిపించాడు. మంగళవారం విధులకు హాజరైన ఆయన తిరిగి ఇంటికి వెళ్లకపోవడం, ఫోన్‌కి అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఘటనపై విచారణ జరిపి మృతుని కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.

News September 12, 2024

భీమిలి: ‘అక్రమ నిర్మాణాల సంగతి తేల్చండి’

image

భీమిలి బీచ్ సమీపంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల సంగతి తేల్చాలని హైకోర్టు జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. భీమిలి బీచ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ కూడా నిర్మించారని దీనిపై జోక్యం చేసుకోవాలని జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

News September 12, 2024

వరద రాజకీయాలు ఎందుకు?: జడ్పి చైర్పర్సన్

image

ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓదార్చి ఆదుకోవడం బాధ్యత అని విశాఖ జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అన్నారు. విశాఖ జడ్పీ అతిథి గృహంలో ఆమె మాట్లాడుతూ కూటమి నాయకులు ఆ బాధ్యతలను విస్మరించి వరద రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి చింతపల్లిలో చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

News September 12, 2024

విశాఖలో నలుగురు చైన్ స్నాచర్లు అరెస్ట్

image

విశాఖలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన నలుగురు నిందితులను 4వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సీతంపేటకు చెందిన మంగ మెడలో బంగారు మంగళసూత్రాన్ని ఈనెల 7న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. మంగ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీకి చెందిన నిందితులు సంజయ్ సాహాని, విజయ్, దీపక్ కుమార్ మహమ్మద్ ఇస్తకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News September 12, 2024

దంతెవాడ వరకే విశాఖ-కిరండూల్ రైళ్లు

image

కేకే లైన్లో బచేలి-కిరండూల్ మధ్య భారీ వర్షాల వలన రైళ్ల గమ్యస్థానం కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. సెప్టెంబరు 12 నుంచి 18 వరకు విశాఖ-కిరండూల్ (18514) నైట్ ఎక్స్ ప్రెస్, విశాఖ-కిరండూల్ (08551) పాసింజర్ రైలు దంతెవాడ వరకు నడుస్తాయన్నారు. అలాగే కిరండూల్-విశాఖ(18513) నైట్ ఎక్స్ ప్రెస్, కిరండూల్-విశాఖ (08552) పాసింజర్ సెప్టెంబరు 13 నుండి 19 వరకు దంతెవాడ నుంచి బయలుదేరుతాయన్నారు.

News September 12, 2024

విశాఖ: సీజనల్ వ్యాధులపై ఇంటింటి సర్వే

image

ఇటీవల విస్తారంగా కూర్చుని నేపథ్యంలో జిల్లాలో వ్యాధులపై ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్యం అందజేయాలని ఆయన సూచించారు. జిల్లాలో 420 డెంగ్యూ కేసులు నమోదయినట్లు తెలిపారు.

News September 11, 2024

తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

ఈస్ట్ కోస్ట్ డివిజన్‌లోని పలు ప్రత్యేక రైళ్లును రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.

News September 11, 2024

విశాఖ: సెప్టెంబ‌ర్ 14న జాతీయ లోక్ అదాల‌త్

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆల‌పాటి గిరిధ‌ర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మ‌డి విశాఖపట్నం జిల్లా ప‌రిధిలోని అన్ని న్యాయ స్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.

News September 11, 2024

విశాఖ రేంజ్ పరిధిలో 13 మంది ఎస్సైలు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. మాకవరపాలెం ఎస్సై టీ.రామకృష్ణారావును రోలుగుంట పోలీసు స్టేషన్‌కు, కే.కోటపాడు ఎస్సై లక్ష్మీనారాయణను ఏ.కోడూరు, రావికమతం ఎస్సై ధనుంజయ్ నాయుడును అనకాపల్లి వీఆర్‌కు, ఏ.కోడూరు ఎస్సై రమేశ్‌ను అనకాపల్లి వీఆర్‌కు, కొత్తకోట ఎస్సై లక్ష్మణరావును కశింకోటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.