India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 122 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ద్వారా డ్రైవర్లు, మెకానిక్ల నియామకం చేపడుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనాయుడు శనివారం వెల్లడించారు. స్త్రీ శక్తి పథకానికి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ, మద్దిలపాలెం, గాజువాక, వాల్తేర్, స్టీల్ సిటీ, సింహాచలం, మధురవాడ డిపోలలో నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ఆసక్తి గల వారు ఆయా డిపోల్లో సంప్రదించాలన్నారు.
ఈ నెల 29న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా హోటల్ నోవాటెల్కు వెళ్తారు. అనంతరం V.M.R.D.A కాంప్లెక్స్లు, పర్యాటక శాఖ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభిస్తారు. అమరావతి ఛాంపియన్షిప్ కప్ ఫైనల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసి తర్వాత ప్రో కబడ్డీ పోటీలను ప్రారంభిస్తారని జిల్లా అధికారులు శనివారం తెలిపారు.
విశాఖ కమీషనరేట్ పరిధిలో 29 మంది పోలీస్ సిబ్బందికి పదోన్నతలు లభించాయి. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వారిని శనివారం సత్కరించి, పదోన్నతి ర్యాంకులతో పాటుగా పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని సీపీ సూచించారు. వీరిలో 13మంది హెడ్ కానిస్టేబుళ్లు.. ఏఎస్ఐలుగా,14 మంది కానిస్టేబుళ్ళు.. హెడ్ కానిస్టేబుళ్లుగా, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు.
స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో భాగంగా PMAJAY కింద SC యువతీ/యువకులకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 20-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులు. విశాఖ జిల్లా వాసులై, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. అర్హులైన 10 మంది (పురుషులు-5, స్త్రీలు-5)కి APSTRC ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. MVP కాలనీ సంక్షేమ భవన్లో ఆగష్టు 27లోపు దరఖాస్తు అందజేయాలి.
కట్టుకున్న భర్తను, కన్న కూతూరిని హతమార్చిందో మహిళ. భీమిలి (M)కి చెందిన జ్యోతిర్మయి వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త రమేశ్ను ప్రియుడు రాము, మరో ఇద్దరి సహాయంతో చంపింది. ఈ సంఘటన చూసిన కుమార్తెను కొత్తవలసలోని బావిలో పడేశారు. VZM టూటౌన్ PSలో 2015లో హత్య కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో మహిళకు జీవిత ఖైదు, ఇద్దరికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని SP వకుల్ జిందాల్ తెలిపారు.
విశాఖ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా కమిషనర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల హిట్ & రన్ ప్రమాదాల్లో తీవ్ర గాయాల పాలైన వారికి రూ.50 వేలు చొప్పున ఆరుగురికి రూ.3 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. విశాఖలో ఇప్పటి వరకు 69 మంది రోడ్డు ప్రమాద భాదితులకు సహాయక కేంద్రం ద్వారా రూ.55.50 లక్షలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
కానిస్టేబుల్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ విశాలాక్షి నగర్ ఏఆర్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించారు. 659 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 627 మంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని, మిగతా 32మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉందని అధికారులు తెలిపారు. అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహన్రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు 70 మందిలో 69 మంది హాజరు కాగా ఒకరు హాజరు కాలేదు.
జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో 151 అంశాలు చర్చకు రాగా 84 ప్రధాన అజెండా, 67 టేబుల్ అజెండాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశానికి మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్, శాసనసభ్యులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు. జీరో అవర్లో వార్డుల్లోని సమస్యలు చర్చించగా, వాటి పరిష్కారానికి మేయర్ హామీ ఇచ్చారు.
ఈనెల 26న జాతీయ మహిళా కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మజుందార్ దీనికి అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ మహిళా కమిషన్కి వినతులు ఇవ్వాలని కోరారు.
Sorry, no posts matched your criteria.