India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో మంగళవారం రాత్రి దారుణఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ గోపాలపట్నంలోని ఓ బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. మధురానగర్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో నిర్వాహకురాలితో పాటు ఒక బాధితురాలు విటుడు ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిపారు.
భారీ వర్షాల వల్ల అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసివేసిన బొర్రా గుహలను అధికారులు మంగళవారం తెరిచారు. అయితే మంగళవారం కేవలం 300 మంది పర్యాటకులు మాత్రమే బొర్రా గుహలను సందర్శించారని యూనిట్ మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా విశాఖ నుంచి అరకులోయ రాకపోకలు సాగించే మూడు బస్సులను గత శనివారం నుంచి నాలుగు రోజుల పాటు రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో బుధవారం నుంచి ఈ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి మాడుగుల, పాడేరు వెళ్లాల్సిన సర్వీసులను చోడవరం వరకు మాత్రమే నడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా చోడవరం నుంచి మాడుగుల, పాడేరు రూట్లు బాగా పాడయ్యాయి.
సీతమ్మధార రైతు బజార్ సమీపంలో గల ఆక్సిజన్ టవర్స్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినాయకుని ప్రసాదమైన 50 కిలోల లడ్డూ వేలంపాటలో రూ.4.50 లక్షలు పలికింది. స్థానికురాలు హర్ష పల్లవి లడ్డూను వేలంలో దక్కించుకుని.. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆక్సిజన్ టవర్స్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా లబ్ధిదారులను తీసుకెళ్లి జియో ట్యాగింగ్ చేయించాలన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అన్ని విధాల సహకారం అందించాలన్నారు.
విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ చేసినవారు అర్హులు. అశోక్ లేలాండ్ కంపెనీలో ఖాళీలు భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సెలక్ట్ అయిన వారికి దుబాయ్లో ఉద్యోగావకాశం అని పేర్కొన్నారు. వివరాలకు 9440197068 నంబర్కు సంప్రదించాలన్నారు.
సింహాచలం ఆలయంలో ఈనెల 13 నుంచి 17 వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, వేద పారాయణం, తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ఈనెల 13 నుంచి ఆర్జిత సేవలతో పాటు నిత్య కళ్యాణ ఉత్సవాలు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల తర్వాత స్వామి దర్శనాలు లభించవన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డుకుంటున్న పోలీసులతో కార్మికులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను అందజేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత భాగ్చీ, జేసీ మయూర్ అశోక్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.