India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సముద్ర రంగంలో విశాఖను నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని విశాఖ పోర్టు చైర్మన్ అంగముత్తు కోరారు. విశాఖలోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన సదస్సులో మాట్లాడారు. సముద్ర రంగంలో విశాఖ రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. పోర్టు ఆధారిత తయారీ రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.
భీమిలి ప్రాంతంలోని బోయవీధికి చెందిన చింతపల్లి రాము వేటకు వెళ్లి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రాము తెప్పపై వేటకు వెళ్ళగా అలల ఉధృతికి మునిగిపోయినట్లు మత్స్యకార డెవలప్మెంట్ అధికారి రాజు తెలిపారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సముద్ర రంగంలో విశాఖను నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని విశాఖ పోర్టు చైర్మన్ అంగముత్తు కోరారు. విశాఖలోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన సదస్సులో మాట్లాడారు. సముద్ర రంగంలో విశాఖ రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. పోర్టు ఆధారిత తయారీ రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.
విశాఖ జాలరిపేటకు చెందిన బోటు సముద్రంలో 2 రోజుల క్రితం మునిగిపోగా మత్స్యకారులు మరో బోటు సాయంతో ఒడ్డుకు చేరుకున్నారు. మరపడవల సంఘం కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడారు. 22వ తేదీన ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్ళగా బోటులో నీరు చేరుకోవడంతో ప్రమాదం జరిగి మునిగిపోయిందన్నారు. అక్కడే ఉన్న మరోబోట్ సహాయంతో ఒడ్డుకు చేరుకున్నామని మత్స్యకారులు తులసిరావు, రమేష్, హరికృష్ణ, గురుమూర్తి తెలిపారు.
రక్షించాల్సిన తండ్రే కన్న కూతుర్ల పాలిట కాలయముడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆరిలోవలో ఉంటోన్న ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్ల (మైనర్ల)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికలను బెదిరించేవాడు. ఈ అఘాయత్యం తెలుసుకున్న తల్లి గత ఏడాది ఆరిలోవలో ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
అక్కిరెడ్డిపాలెంలో ప్రవళిక అనే యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక తల్లి, సోదరునితో కలిసి ఉంటోంది. వారిద్దరూ ఉద్యోగం నిమిత్తం బయటికి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఉరివేసుకుంది. తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు 23న ‘స్వచ్ఛాంధ్ర దినోత్సవం’లో భాగంగా పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు థీమ్ ‘వర్షాకాలం పరిశుభ్రత’ అని తెలిపారు. డెంగ్యూ, మలేరియా నివారణకు కాలువల శుభ్రపరిచడం, ఫాగింగ్, నీటి నాణ్యత పరీక్ష, టాయిలెట్ల పరిశుభ్రత, అవగాహనా కార్యక్రమాలు, పాఠశాలల్లో ప్రచారాలు నిర్వహించాలని గురువారం సూచించారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ను పరిశీలించారు. శుక్రవారం నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్యదర్శి బి.వి.రమణను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ హాజరు అవునున్న తరుణంలో కౌన్సిల్ హల్ను పరిశీలించారు.
మల్కాపురంలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకన్నపాలెంలో ఉంటున్న కనకరాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ మధ్య కాలంలోనే అతని భార్యకు ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. దీంతో ఒంటరితనం భరించలేక మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బీచ్ రోడ్డులో సబ్మెరిన్ వద్ద అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. పూర్ణ మార్కెట్ ప్రాంతానికి చెందిన కె.సాగర్(26) స్నేహితుడితో కలిసి పార్క్ హోటల్ నుంచి RK బీచ్ వైపు బైక్పై వస్తున్నాడు. ముందు ఉన్న బైక్ యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఆ వాహనాన్ని వీరు ఢీకొట్టి పడిపోయారు. హెల్మెట్ లేకపోవడంతో సాగర్ తలకు తీవ్రగాయమై చికిత్స పొందుతూ గంట వ్యవధిలో మరణించాడు. త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.