Visakhapatnam

News April 10, 2025

షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడి మృతి

image

విశాఖలో షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడిగా పనిచేస్తున్న అప్పారావు విద్యుత్ షాక్‌కు గురై పైనుంచి కింద పడి మృతి చెందారు. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన పిలక అప్పారావు బుధవారం హాల్ షాప్ విభాగంలో పనిచేస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం సీఐ విద్యాసాగర్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

News April 10, 2025

దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్‌ప్రెస్

image

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. 

News April 10, 2025

రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి: కలెక్టర్

image

రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో బుధ‌వారం రెవెన్యూ వ‌ర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ ప‌ర‌మైన అన్ని అంశాల‌పై, ప్ర‌భుత్వ జీవోల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌న్నారు. ఆక్ర‌మ‌ణ‌ల‌ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, రిజిస్ట్రేష‌న్‌లో అనుస‌రించాల్సిన విధానాల‌పై దిశానిర్దేశం చేశారు.

News April 9, 2025

విశాఖలో రేపు మాంసం దుకాణాలకు సెలవు

image

మహావీర్ జయంతి సందర్భంగా జీవీఎంసీ పరిధిలో గురువారం మాంసం దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ నగర పశు నియంత్రణాధికారి డాక్టర్ ఎన్.కిషోర్ బుధవారం తెలిపారు. కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు రేపు జంతువధ, మాంస విక్రయాలు నిషేధం అన్నారు. ఈ నింబదనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 9, 2025

దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్‌ప్రెస్

image

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. 

News April 9, 2025

కేజీహెచ్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ 

image

కేజీహెచ్‌లో విశాఖ కలెక్టర్ హరేంద్రప్రసాద్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు వార్డులను సందర్శించారు. అనంతరం ఓపీ గేటు వద్ద రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోగులకు, సహాయకులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూపరింటెండెంట్ శివానంద్‌ను ఆదేశించారు. 

News April 9, 2025

విశాఖ రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని 13 రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు బుధవారం నాటి కాయగూరల ధరలను విడుదల చేశారు. టమాట రూ.17, ఉల్లిపాయలు రూ.22, బంగాళదుంపలు రూ.17, వంకాయలు రూ.22/26, మిర్చి రూ.28, ఆనప రూ.12, కాలీఫ్లవర్ రూ.16, క్యాబేజీ రూ.14, దొండ రూ.22, మునగ రూ.26, అల్లం రూ.44, బరబాటి రూ.28, గోరుచిక్కుడు రూ.36, దోసకాయ రూ.22, పెన్సిల్ బీన్స్ రూ.52, పోటల్స్ రూ.58, క్యాప్సికం రూ.44 గా ధరలు నిర్ణయించారు.

News April 9, 2025

విశాఖ: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై అవగాహన

image

వడదెబ్బ తగలకుండా నగర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేశ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై అవగాహన నిర్వహించారు. జీవీఎంసీ పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుందని స్వచ్ఛంద సంస్థలు కూడా నగరంలో చలివేంద్రాలు ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారికి జీవీఎంసీ సహాకారం అందిస్తుందన్నారు.

News April 8, 2025

రైతు బజార్‌లో తగ్గింపు ధరలో బియ్యం, కందిపప్పు

image

విశాఖలో బియ్యం, కందిపప్పు ట్రేడర్స్, టోకు వ్యాపారాలతో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మంగళవారం ధరలపై సమీక్ష చేశారు. బహిరంగ మార్కెట్లో వీటి ధర ఎక్కువగా ఉందని రైతు బజార్‌లో తక్కువ రేటుకే ఇవ్వనున్నట్లు తెలిపారు. విశాఖలో గాజువాక, ములగాడ, ఎంవీపీ, కంచరపాలెం, మధురవాడ, పెద్ద వాల్తేర్ రైతు బజార్లలో కందిపప్పు కేజీ రూ.104, రా రైస్ కేజీ రూ.44, స్టీమేడ్ రైస్ కేజీ రూ.45కు అమ్మనున్నట్లు తెలిపారు.

News April 8, 2025

ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు: కలెక్టర్

image

జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఏప్రిల్ 30వ తేదీ లోపు ఏడాది పన్ను అంతా చెల్లించి 5 శాతం రాయితీ పొందవచ్చని GVMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధీర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ నెలలో ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.