Visakhapatnam

News March 28, 2025

విశాఖ: ‘లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి’

image

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్‌గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలని, ఉమెన్ సేఫ్టీ‌కి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News March 28, 2025

విశాఖలో ఉగాది వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు: జేసీ

image

ఉగాది వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌బద్దంగా నిర్వ‌హించేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉగాది వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ఈనెల 30న ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డే విధంగా నిర్వ‌హించాల‌న్నారు. వేడుకలు అన్ని శాఖల సమన్వయంతో జరగాలన్నారు.

News March 28, 2025

ఏప్రిల్ 1న పదో తరగతి సోషల్ పరీక్ష: విశాఖ డీఈవో

image

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.

News March 28, 2025

విశాఖ: ‘పోటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్’ విడుద‌ల‌

image

విశాఖ జిల్లా అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని రూ.23,870.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ రూపొందించినట్లు నాబార్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్ బ‌సంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నాబార్డ్ 2025-26 ‘పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్’ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విడుద‌ల చేశారు. ఈ ప్రణాళిక ముఖ్యంగా MSMEలు, పునరుత్పాదక ఇంధనం, ఎగుమతి క్రెడిట్ సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించింద‌ని పేర్కొన్నారు.

News March 28, 2025

గాజువాకలో బాలికతో పాటు మరో వ్యక్తి ఆత్మహత్య

image

గాజువాక వడ్లపూడి అప్పికొండ కాలనీలోని ఓ ఇంట్లో బాలికతో పాటు మరో వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. మర్రిపాలెంకి చెందిన అమీరుద్దిన్ ఖాన్(36) సింహాచలంలో బాలిక(17) తల్లి నిర్వహిస్తున్న హోటల్లో పని చేసేవాడు. అతని వైఖరి నచ్చగా బాలిక తల్లి పని నుంచి తొలగించింది. కాగా శుక్రవారం అమీరుద్దీన్ రూమ్‌‌లో బాలిక, అమీరుద్దిన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

News March 28, 2025

విశాఖ: అన్నయ్య మందలించడంతో సూసైడ్

image

అన్నయ్య మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జై భారత్ నగర్‌లో ప్రతాప్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రతాప్ శుక్రవారం డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆయన అన్నయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News March 28, 2025

పారిశ్రామికవేత్తలతో విశాఖ కలెక్టర్ మీటింగ్

image

పారిశ్రామికవేత్తలతో విశాఖ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ & ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ పలు అంశాలను పారిశ్రామికవేత్తలు, అధికారులతో చర్చించారు. ఇరువురి సమన్వయంతో పరిశ్రమలు అభివృద్ధి చెందాలని అయన కోరారు.

News March 28, 2025

విశాఖలో మేయర్ సీటుపై హీట్

image

విశాఖలో మేయర్ సీటుపై హీట్ రేగుతోంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మాన వ్యవహారంపై వైసీపీ తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తుండగా పూర్తిస్థాయిలో బలం మాకే ఉందని కూటమి నాయకులు చెబుతున్నారు. మొత్తం 112 ఓట్లు ఉండగా 75 ఓట్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా నమోదు కావాలి. కూటమికి 64 మంది కార్పొరేటర్లు. 11 మంది ఎక్స్ అఫీషియ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా వైసీపీ, కూటమి ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. 

News March 28, 2025

అమెరికాలో జనసేన ఆత్మీయ సమావేశం

image

అమెరికాలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ పాల్గొన్నారు. జనసేన పార్టీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీగా 100% స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిందన్నారు. వివిధ రంగాల్లో ఉన్న మేధావులు పార్టీ కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్డీఏ కూటమి బలోపేతానికి ఎన్ఆర్ఐ‌లు సహకారం అందించాలని కోరారు.

News March 28, 2025

కంచరపాలెంలో దారుణం.. ఒకరు మృతి

image

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఎస్ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన పి.హనుమంతురావు(60) మృతదేహం కలకలం రేపింది. చెట్టుకు నగ్నంగా కట్టేసి కొట్టడంతో అతను చనిపోయినట్లు సమాచారం. స్థానికులు చెట్టుకు కట్టేసి ఉన్న అతని మృతదేహాన్ని కిందకు దించి వస్త్రాలు కప్పారు. వారి సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.