Visakhapatnam

News August 25, 2024

విశాఖలో నగరవనం అభివృద్ధి చేస్తాం: పవన్ కళ్యాణ్

image

రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా ఆయా నగరాల్లో వనాలను అభివృద్ధి నిధులు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలోని ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్లో నగర వనాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News August 25, 2024

స్వదేశీ దర్శన్: బొర్రా గుహలకు నూతన హంగులు

image

స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా రూ.29.87 కోట్ల నిధులతో <<13936416>>బొర్రా గుహల<<>>ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్, కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్, సందర్శకుల కోసం ప్రత్యేక భవనం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రదేశంలో నడకదారి అభివృద్ధి, గుహల ముందు సందర్శకులు కూర్చుని వీక్షించే ఏర్పాట్లతో పాటు ఎక్కడికక్కడ సూచిక బోర్డులు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు.

News August 25, 2024

విశాఖ: ఎసెన్షియాలో భారీగా సాల్వెంట్ నిల్వలు

image

అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీ రియాక్టర్లలో ఇంకా 700 లీటర్ల సాల్వెంట్ నిల్వలు ఉన్నట్లు తనిఖీలు నిర్వహించిన అధికారులు గుర్తించారు. వాటిని నిపుణుల పర్యవేక్షణలో జాగ్రత్తగా బయటకు పంపించాలని వారు కంపెనీ యాజమాన్యానికి సూచించారు. ప్రమాదాల నివారణ కు మూడు నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలని సలహా ఇచ్చారు. కంపెనీ విధిగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించి లోపాలను సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు.

News August 25, 2024

స్వదేశీ దర్శన్ పథకం కింద బొర్రా ఎంపిక

image

ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు నూతన రూపు సంతరించుకోనున్నాయి. స్వదేశీ దర్శన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో బొర్రా గుహలను ఎంపిక చేశారు. దీంతో ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. బొర్రా రైల్వే స్టేషన్ మొదలుకొని లోపలికి వెళ్లే అన్ని ప్రదేశాలను ఆధునీకరిస్తారు. గుహల లోపల విద్యుత్ వెలుగుల ఏర్పాటు, పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

News August 25, 2024

విశాఖ: ‘డిజైన్ లోపంతోనే భారీ ప్రమాదం’

image

అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో పైప్ లైన్ నిర్వహణతో పాటు డిజైన్‌లో లోపాలే పెద్ద ప్రమాదానికి కారణమని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఎం.ప్రతాప్ తెలిపారు. పరిశ్రమల తనిఖీల్లో సరైన విధానం పాటించకపోవడం వల్లే ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయన్నారు. నిపుణులైన కార్మికులను నియమించుకోవడం, ఆధునిక సాంకేతికతను అమలు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునన్నారు.

News August 25, 2024

కేజీహెచ్‌లో 13 మంది ఉద్యోగులకు ఏసీబీ నోటీసులు

image

కేజీహెచ్‌లో మెడికల్ స్టోర్స్ నిర్వహణకు సంబంధించి 13 మంది ఉద్యోగులకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. సర్వీస్ నిబంధనల ప్రకారం విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సూచించింది. 2014 జూలై 1న ఏసీబీ అధికారులు కేజీహెచ్‌లోని మెడికల్ స్టోర్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులో గుర్తించిన లోపాలకు బాధ్యులను చేస్తూ తాజాగా 13 మందికి నోటీసులు జారీ చేసింది.

News August 25, 2024

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఈఎల్ ఎన్‌క్యాష్‌‌మెంట్ నిలుపుదల

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఆర్జిత సెలవులు (ఈఎల్) ఎన్‌క్యాష్‌మెంట్‌ను తాత్కాలికంగా నిలిపేస్తూ యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 నుంచి అధికారులకు 270, కార్మికులకు 170 దాటి ఆర్జిత సెలవులు ఉంటే, అందులో ఏడాదికి గరిష్టంగా 30 ఆర్జిత సెలవులను ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని నిలిపివేశారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

News August 25, 2024

కేజీహెచ్: మరో ఆరుగురు విద్యార్థులు డిశ్చార్జ్

image

కలుషిత ఆహారం తిని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆరుగురు విద్యార్థులు శనివారం డిశ్చార్జ్ అయ్యారు. పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి రమణమూర్తి ఆధ్వర్యంలో ఆయా చిన్నారులకు అన్ని రకాల మందులు అందజేశారు. కాగా మరో నలుగురు విద్యార్థులు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు. మరో వారం రోజుల్లో వారిని కూడా డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.

News August 25, 2024

విశాఖలో ఆర్మీ ర్యాలీ.. ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

విశాఖ పోర్టు స్టేడియంలో ఈ నెల 26 నుంచి జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి భద్రత ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ శనివారం సాయంత్రం పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తొక్కిసలాటకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5 వరకు జరిగే కార్యక్రమంలో లోటుపాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News August 24, 2024

మరో ఘనత సాధించిన విశాఖ మెడ్ టెక్ జోన్

image

విశాఖలోని మెడ్ టెక్ జోన్ దేశీయంగా తొలిసారి మంకీ పాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ తయారుచేసి మరో ఘనత సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన పలు దేశీయ ఉత్పత్తులను ఈ సంస్థ అందించింది. ఈ కిట్ ‌ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతి లభించినట్లు మెడ్ టెక్ జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ తెలిపారు.