Visakhapatnam

News March 27, 2025

ప్రారంభానికి సిద్ధంగా “VMRDA THE DECK”

image

సిరిపురం నిర్మాణంలో ఉన్న నూతన “VMRDA THE DECK” త్వరలో ఓపెన్ కాబోతుంది. ఇందులో 5 అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం, 6 అంతస్తుల్లో కమర్షియల్‌కి సదుపాయం కల్పించబోతున్నారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.87.50 కోట్లు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. అతి త్వరలో దీనిని ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రారంభమయ్యాక పార్కింగ్ సమస్యలు తీరనున్నాయి. ఇందులో 4వీలర్, 2వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు.

News March 27, 2025

విశాఖ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

image

విశాఖలో ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న అమాయక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని హోంమంత్రి ఆదేశించారు. నిందితుడుని గుర్తించి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హోం మంత్రికి సీపీ తెలిపారు.

News March 27, 2025

విశాఖలో లులూ మాల్‌కు భూమి కేటాయింపు

image

విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. లులూ గ్రూప్ విశాఖలో పెట్టుబడులకు ఎస్ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ తెలిపింది.

News March 27, 2025

విశాఖలో ముఠా.. నకిలీ వెండి అమ్ముతూ అరెస్ట్

image

విశాఖలో బిహార్‌కు చెందిన ఇద్దరు మహిళలు నకిలీ వెండి అమ్ముతూ పోలీసులకు చిక్కారు. నగరంలోని ఓ జువెలరీ షాపులో 3 కేజీల వెండిని అమ్మేందుకు వెళ్లారు. అనుమానంతో షాపు సిబ్బంది పరీక్షించగా అది నకిలీదిగా తేలడంతో ద్వారకా పోలీసులకు సమాచారమిచ్చారు. ఇదే షాపులోని 2023లో నిందితులు ఏడు గ్రాముల గోల్డ్ కొట్టేసినట్లు గుర్తించారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఐడీలతో మోసాలకు పాల్పడి అనంతరం సొంతూళ్లకు వెళ్లిపోతారు.

News March 27, 2025

విశాఖలో కేజీ మామిడికాయల రేటు ఎంతంటే?

image

విశాఖలోని 13 రైతుబజార్లలో గురువారం నాటి కూరగాయ ధరలను అధికారులు విడుదల చేశారు.(రూ/కేజీలలో) టమటా రూ.15, ఉల్లిపాయలు రూ.23, బంగాళా దుంపలు రూ.16, వంగ రూ.26/32, బెండ రూ.30, బీర రూ.42, మిర్చి రూ.26, క్యారెట్ రూ.28, దొండకాయ రూ.24, బరబాట రూ.22, పొటాల్స్ రూ.54, కీర రూ.22, గ్రీన్ పీస్ రూ.54, మామిడికాయలు రూ.42, బద్ధ చిక్కుడు రూ.56, చీమదుంప రూ.30, కాకర రూ.32, బీట్ రూట్ రూ.24, క్యాప్సికమ్ రూ.38గా నిర్ణయించారు.

News March 27, 2025

విశాఖలో డ్రగ్స్ కలకలం

image

విశాఖ త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ డార్మెటరీలో 6.5 గ్రాముల ఎం.డి.ఎం.ఏతో కర్ణాటకకి చెందిన రంగస్వామి నంజి గౌడ (23)గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. అయితే నంజి గౌడ చాలాసార్లు సిటీకి వచ్చినట్లు సమాచారం. అతను ఎవరికి డ్రగ్స్ అమ్ముతున్నాడో తెలియాల్సి ఉంది.

News March 27, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

అన్నవరం నుంచి విశాఖ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. తుని ఎస్‌ఐ విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన పద్మ (48) అన్నవరంలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లింది. బుధవారం అక్కడి నుంచి తన కుమారుడి బైక్‌పై విశాఖ వస్తుండగా తుని RTC కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్‌పై కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కింద పడిపోయారు. ఆమె పైనుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

News March 27, 2025

వాగన్ పోహ్ వర్క్‌షాప్ తనిఖీ చేసిన DRM

image

వడ్లపూడిలో ఉన్న వ్యాగన్ పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను DRM లలిత్ బోహ్రా బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌లోని వివిధ పీవోహెచ్ సౌకర్యాలు, యంత్రాలు, కార్యాలయాన్ని పరిశీలించారు. రైల్వే వ్యాగన్‌ల లభ్యతను పెంచడానికి లక్ష్య ఉత్పత్తిని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా జగ్గయ్యపాలెంలో కంటైనర్ కార్పొరేషన్‌లో సౌకర్యాలను పరిశీలించారు.

News March 26, 2025

విశాఖలో చిన్నారిపై అత్యాచారం

image

విశాఖలో బుధవారం దారుణ ఘటన జరిగింది. వన్‌టౌన్ పరిధిలో ఓ చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని చంగల్రావ్ పేట ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కింద ఇంట్లో ఉంటున్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన చిన్నారి తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. ఏసీపీ పెంటారావు దర్యాప్తు చేపట్టారు.

News March 26, 2025

ముఖ్యమంత్రి చేపట్టిన సదస్సులో పాల్గొన్న విశాఖ కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మూడో విడత కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఇందులో భాగంగా బుధవారం జరుగుతున్న సదస్సులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పీ -4 సర్వే, పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఉన్నారు.