Visakhapatnam

News March 15, 2025

ఒంటిపూట నిబంధన పాటించకుంటే చర్యలు: డీఈవో

image

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 15, 2025

విశాఖలో కేజీ కీర రూ.26

image

విశాఖ 13 రైతు బజార్‌లో శనివారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.28, బెండ రూ.40, బీరకాయలు రూ.54, క్యారెట్ రూ.22/27, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.52, గ్రీన్ పీస్ రూ.54, వంకాయలు రూ.40/42, కీర రూ.26, గోరు చిక్కుడు రూ.38, పొటల్స్ రూ.86, బరబాటి రూ.38గా నిర్ణయించారు.

News March 15, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.2,50,000ల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన సంతోషి కుటుంబానికి రూ.2లక్షలు ఇచ్చారు. తీవ్ర గాయాలైన శశాంక్‌కు రూ.50వేలను వారి బ్యాంక్ అకౌంట్‌లలో డిపాజిట్ చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకూ 21 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించారు.

News March 14, 2025

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల ప్రచారం ఫేక్: ఈఓ

image

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల నియామకం జరుగుతుందనే ప్రచారాన్ని నమ్మవద్దని ఆలయ ఈఓ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ /సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ ప్రచారం జరుగుతుందని దేవస్థానం దృష్టికి వచ్చిందన్నారు. ఆలయానికి సంబంధించి ఎలాంటి ఉద్యోగాలు ప్రకటనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.

News March 14, 2025

విశాఖ జూలో చిరుత మృతి.. కారణమిదే..!

image

విశాఖ జూ పార్క్‌లో 2008 నుంచి ఉంటున్న ‘సుధ’ అనే ఆడ చిరుతపులి గురువారం సాయంత్రం మృతి చెందినట్లు జూక్యూరేటర్ మంగమ్మ వెల్లడించారు. 20 సంవత్సరాల వయసు కలిగిన ఈ చిరుత మయోకార్డియల్ ఇన్‌ఫార్జన్ డిసీజ్ కారణంగా మృతి చెందినట్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వెల్లడించారన్నారు. దీని సగటు జీవిత కాలం 12 నుంచి 15 సంవత్సరాలు కాగా జూ సంరక్షణలో ఉండడంతో 20 సంవత్సరాలు జీవించిందన్నారు.

News March 14, 2025

విశాఖలోని 13 రైతు బజార్లో నేటి కాయగూరల ధరలు

image

విశాఖ 13 రైతు బజార్‌లో శుక్రవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ 38,మిర్చి రూ.26, బెండ రూ.44, బీరకాయలు రూ.50, క్యారెట్ రూ.22/34, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.52, గ్రీన్ పీస్ రూ.54, వంకాయలు రూ.36/40, కీర రూ.26, గోరు చిక్కుడు రూ.38, కాకరకాయ రూ.42,పొటల్స్ రూ.90, దోసకాయలు రూ.28గా నిర్ణయించారు.

News March 14, 2025

విశాఖ నుంచి షాలిమార్, చర్లపల్లికి ప్రత్యేక రైళ్ళు

image

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి షాలిమార్(08577/78), చర్లపల్లికి(08579/80) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16 తేదీన బయలుదేరి మార్చి 17న తిరుగు ప్రయాణంలో విశాఖ చేరుతాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News March 14, 2025

విశాఖ: మోసం చేసిన ఏడుగురికి ఐదేళ్ల జైలు

image

పెందుర్తిలో 2017 FEBలో 158.66 చదరపు గజాల ప్లాట్‌ను ఓ వ్యక్తికి రూ.18లక్షలకు విక్రయించారు. తరువాత అమ్మకందారుడు మరికొందరితో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ ప్లాట్‌ను వేరొకరికి కూడా విక్రయించారు. దీంతో బాధితుడు కేసు పెట్టాడు. విచారించిన జిల్లా ఎస్.సి&ఎస్.టి కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురికి 5 ఏళ్ల జైలు, ఒక్కొక్కరూ రూ.2,90,000 చొప్పున బాధితునికి నష్ట పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది.

News March 14, 2025

విశాఖపట్నం – షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి, ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం నుంచి షాలిమార్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. రైలు నం.08577 విశాఖపట్నం – షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి 16 న ఉదయం 11:20 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డులో 13:08 గంటలకు బయలుదేరి 13:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 3:00 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.

News March 14, 2025

విశాఖలో భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు

image

భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులు ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూముల క్రమబద్దీకరణపై అవగాహన కల్పించడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ మయూరి అశోక్‌తో పాటు పలువు రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.