India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పార్వతీపురం పట్టణంలోని వెంకంపేట గోరీల వద్ద చోటుచేసుకుంది. అవుట్ పోస్ట్ పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గాజువాకలోని గణేశ్నగర్కు చెందిన షేక్ రోషన్(26) పార్వతీపురం పట్టణంలో సీలింగ్ పనులు చేస్తున్నాడు. పనులు ముగించుకొని తిరిగి రూమ్కి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలిపారు.
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు, కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిగిలిన జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కానీ అల్లూరి జిల్లాలో ఆ అవకాశం కలెక్టర్కు లభించింది.
ద్వారకా పోలీస్స్టేషన్ పరిధిలో హరిప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, ప్రాణ స్నేహితుడి అక్రమ సంబంధమే ఆత్మహత్యకు కారణమని హరిప్రసాద్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వారి చేతులో ఘోరంగా మోసపోయానని, తిరిగి తనపైనే కేసు పెట్టారని అందులో పేర్కొన్నాడు. నా చావుకు వారే కారణమని ఆ వీడియోలో పేర్కొన్నాడు.
విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో శనివారం ప్రపంచ సింహల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సింహల సంరక్షణ వాటి జీవన విధానంపై జూ ఎడ్యుకేటర్ దివ్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. అడవుల రక్షణలో సింహాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. బయాలజిస్ట్ పురుషోత్తం పాల్గొన్నారు.
రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్, జిల్లా రహదారి భద్రత కమిటీ ఛైర్మన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. బిఐఎస్ మార్క్ గల హెల్మెట్ను మాత్రమే ధరించాలన్నారు. అతిక్రమించిన వారికి జరిమానా వేయడంతో పాటు మూడు నెలలు లైసెన్స్ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
ఏయూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో దశాబ్దానికి పైగా ఒకే స్థానంలో ఉంటూ విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న బోధనేతర సిబ్బంది అవినీతిపై విద్యార్థుల తల్లిదండ్రులు గవర్నరుకు ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి ఏయూకు ఆదేశాలు రావడంతో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ శశిభూషణరావు స్పందించారు. తక్షణమే ఆ విభాగంలో పనిచేస్తున్న 16 మంది సిబ్బందిని వేరే విభాగాలకు బదిలీ చేశారు.
విశాఖ నుంచి వయా విజయనగరం మీదుగా వెళ్లే విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ను దారి మళ్లించారు. రెగ్యులర్గా ఈ రైలు విజయనగరం, పార్వతీపురం, రాయగడ, రాయపూర్ మీదుగా నిజాముద్దీన్ వెళ్తుంది. అనివార్య కారణాల వల్ల 12807 నంబర్తో నడిచే ఈ రైలు శనివారం విజయవాడ మీదుగా నిజాముద్దీన్ వెళ్లనుంది. శనివారం ఉదయం 9.20 నిమిషాలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని అధికారులు కోరారు.
సకాలంలో వైద్యం అందక తల్లి, బిడ్డ మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. గూడెం కొత్తవీధి మండలం ఊబ పొలం గ్రామానికి చెందిన వంతల పరిమళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానికులు చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో వైద్యం కోసం నర్సీపట్నం తరలించారు. నర్సీపట్నం వైద్యులు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పారు. బిడ్డను బయటకు తీయగా తల్లి కూడా మృతి చెందింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని ఎమ్మెల్యే మాత్రమేనని అసెంబ్లీకి రావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. సమావేశాలలో అసెంబ్లీకి హాజరవ్వటం శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత అన్నారు.
అనకాపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖలో మంత్రి అనగాని సత్యప్రసాద్, అల్లూరి జిల్లాలో కలెక్టర్ దినేశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండాలు ఎగురవేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.