Visakhapatnam

News March 12, 2025

విశాఖ జూలో మరో సింహం పిల్ల మృతి

image

విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో ఉన్న అరుదైన ఆసియాటిక్ సింహానికి కొన్ని రోజుల క్రితం రెండు పిల్లలు పుట్టాయి. పుట్టిన కొన్ని రోజులకే అనారోగ్యంతో ఒక పిల్ల చనిపోగా తాజాగా మరో పిల్ల కూడా మృత్యువాత పడింది. దురదృష్టవశాత్తు రెండు సింహం పిల్లలు మృతి చెందటం పట్ల జంతు ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

News March 12, 2025

విశాఖ నుంచి పట్నాకు ప్రత్యేక రైళ్ళు

image

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి పట్నాకు స్పెషల్ (08537/38) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16, 23, 30 తేదీలలో బయలుదేరి మరుసటి రోజు పట్నాకు చేరుతాయి. మళ్లీ మార్చి 17, 24, 31 తేదీలలో పాట్నా నుంచి బయలుదేరి విశాఖ చేరుతాయని.. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News March 11, 2025

విశాఖ నుంచి పట్నాకు ప్రత్యేక రైళ్ళు

image

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి పట్నాకు స్పెషల్ (08537/38) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16, 23, 30 తేదీలలో బయలుదేరి మరుసటి రోజు పట్నాకు చేరుతాయి. మళ్లీ మార్చి 17, 24, 31 తేదీలలో పాట్నా నుంచి బయలుదేరి విశాఖ చేరుతాయని.. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News March 11, 2025

విశాఖ ఎదగడానికి పోర్టే కారణం: సీఐటీయూ 

image

విశాఖ అభివృద్ధిలో పోర్టు కీలకపాత్ర పోషిందని సీఐటీయూ నాయకులు అన్నారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే విశాఖ ఈరోజు మహానగరంగా ఆవిర్భవించడానికి పోర్టే కారణమన్నారు. ఈ సంవత్సరం రూ.800 కోట్లు, గతేడాది రూ.386 కోట్లు లాభాలతో నడుస్తుందని వెల్లడించారు. నేటికి కూడా రూ.171.42కోట్లు వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వం ఆర్జిస్తుండగా.. పోర్ట్ హాస్పిటల్‌ను అమ్మడం దారుణమన్నారు. ఈమేరకు రిలే నిరాహార దీక్షలో వారు మాట్లాడారు.

News March 11, 2025

ఎన్నారై మహిళ మృతి కేసులో డాక్టర్‌కు రిమాండ్

image

విశాఖలోని మేఘాలయ హోటల్‌లో <<15708620>>ఎన్నారై మహిళ మృతి<<>> కేసులో డా.శ్రీధర్‌‌ను విశాఖ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అమెరికాలో ఫ్రీలాన్స్ డాక్ట‌ర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నాడు. నెల రోజుల క్రితం అతను విశాఖ రాగా.. ఆ తర్వాత మహిళ కూడా వచ్చింది. వీరిద్దరూ ఒకే హోటల్ గదిలో ఉండగా.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి శ్రీధర్‌‌ను రిమాండ్‌కు తరలించారు.   

News March 11, 2025

ఇనాం భూముల సమస్యలు పరిష్కరించండి: గంటా

image

ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కోరారు. ఆ భూములపై యాజమన్య హక్కులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి ఆధీనంలో ఉన్నా సరే పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మధ్యే మార్గంగా సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు.

News March 11, 2025

హయగ్రీవ భూములలో బోర్డులు పాతిన అధికారులు

image

ఎండాడలో హయగ్రీవ డెవలపర్స్‌కు కేటాయించిన 12 ఎకరాల 51 సెంట్ల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వృద్ధులకు ఓల్డేజ్ హోం నిర్మాణం పేరుతో తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు విచారణలో తేలింది. దీంతో వెంటనే ఈ భూమి స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు ఆ భూమిలో బోర్డులు పాతారు.

News March 11, 2025

విశాఖలోని 13 రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని 13 రైతు బజార్లలో మంగళవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు.(రూ/కేజీలలో) టమాటా కేజీ రూ.13, ఉల్లి రూ.27, బంగాళాదుంప రూ.15, నల్లవంకాయలు రూ.30, బెండకాయలు రూ.42, మిర్చి రూ.32, దొండ రూ.38, బరబాటి రూ.38, క్యారెట్ రూ.30/38, వెల్లుల్లి రూ.90/100గా, బీట్ రూట్ రూ.24, కీరా రూ.22, గ్రీన్ పీస్ రూ.50, పెన్సిల్ బీన్స్ రూ.50, కాకర కాయ రూ.44, పొటల్స్ రూ.90, చేమదుంప రూ.34గా నిర్ణయించారు.

News March 11, 2025

విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని వినతి

image

విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ సోమవారం విజయవాడలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖలో హైకోర్టు బెంచ్, క్యాట్, జిల్లా కోర్టు ఆవరణలో గత 10నెలలుగా మూతపడ్డ క్యాంటీన్ తెరవాలని కోరారు. కొత్త కోర్టు బిల్డింగుల్లో ఎయిర్ కండిషన్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

News March 10, 2025

విశాఖపట్నం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల నిరసన* భీమలి: గుండెపోటుతో టీచర్ మృతి * కూటమి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి: గుడివాడ అమర్నాథ్ * విశాఖ: హోటల్లో మహిళ మృతి.. నిందితుడి అరెస్ట్ * విశాఖ: యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక *అసెంబ్లీ, పార్లమెంట్లో మాట్లాడిన విశాఖ MLA, MPలు