India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగపూర్ డివిజన్లో ఇంటర్ లాకింగ్ పనులు వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. ఈ మేరకు విశాఖ- నిజాముద్దిన్ సమతా ఎక్స్ప్రెస్ (12807/12808) ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఆన్ లైన్లో 1606 దరఖాస్తులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ తెలిపారు. దరఖాస్తులకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఉందని అన్నారు. 2019 అక్టోబర్ 15కి ముందు ఉన్న ఆక్రమణలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దరఖాస్తుదారులు.. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, నీటి చార్జీ రసీదులను సమర్పించాలన్నారు.
డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశా) సమావేశం విశాఖ కలెక్టర్ ఆఫీసులో గురువారం జరగనుందని దిశా కన్వీనర్ నారాయణమూర్తి బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పథకాల అమలుపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ సమీక్షిస్తారని వెల్లడించారు. జిల్లా అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని కోరారు.
సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం పర్యవేక్షించారు. గోశాల జంక్షన్ వద్ద పార్కింగ్, ఘాట్ రోడ్లో మలుపులు, క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో స్టాప్ బోర్డులను పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాలు తెలిసేలా సైన్ బోర్డులు పెట్టాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు విశాలంగా ఉండాలని సూచించారు.
రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమావేశమయ్యారు.రీ సర్వేపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, 22ఏ తొలగింపునకు దరఖాస్తులు వస్తున్నాయని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ వివరించారు.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు చెల్లదని ఇన్ ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సెక్షన్ 91 ఏ, పురపాలక చట్టం 1955 ప్రకారం నోటీసును తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం నాలుగేళ్లు పూర్తి కాకుండా అవిశ్వాసం పెట్టడం వీలుకాదన్నారు. సతీశ్ 2021 జూలై 30న బాధ్యతలు స్వీకరించారన్నారు.
విశాఖలో ఇళ్ల క్రమబద్ధీకరణ జీవో నంబర్ 30 కింద దరఖాస్తుదారులు సమీప గ్రామ, వార్డు సచివాలయలలో అందజేయాలని జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ తెలిపారు. నిర్దేశిత డాక్యుమెంట్లతో పాటు, వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,20,000, పట్టణాల్లో రూ.1,44,000గా ఉండాలన్నారు. ఖాళీస్థలాలు, పూరిగుడిసెల క్రమబద్ధీకరణకు అనర్హమని అన్నారు. కుటుంబంలో స్త్రీ పేరున దరఖాస్తు చేయాలని సూచించారు.
విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరాడు. బుధవారం ఉదయం హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి అని కాలేజీ సిబ్బంది తెలిపారు.
విశాఖలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. షిప్పింగ్ యార్డ్ ప్రాంతానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలోని ఓ కాలేజీ ఎదురుగా ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళ స్టేషన్ ఏసీపీ పెంటా రావు సంఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించారు.
దివీస్లో పనిచేస్తున్న మధు మోహాన్ మంగళవారం మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన మోహన్ దివీస్లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్కి వచ్చాడు. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.