Visakhapatnam

News August 7, 2024

విశాఖ: ఆశలన్నీ జ్యోతిపైనే..

image

ఎన్నడూ లేనివిధంగా విశాఖ ప్రజలు ఈసారి ఒలింపిక్స్ క్రీడల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పారిస్‌లో జరుగుతున్న పోటీల్లో విశాఖకు చెందిన పరుగుల రాణి జ్యోతి యర్రాజీ భారీ అంచనాలతో బరిలోకి దిగుతుండటమే దీనికి కారణం. నేడు అథ్లెటిక్స్ విభాగానికి సంబంధించి 100 మీటర్ల హార్డిల్స్ తొలి రౌండ్ జరగనుంది. పోటీలో జ్యోతి చిరుతలా మెరుగైన ప్రదర్శన కనబరచి పసిడి పతకాన్ని సాధించాలని విశాఖ జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

News August 7, 2024

ఆర్మీ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలి: విశాఖ కలెక్టర్

image

విశాఖ పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై ఆర్మీ, జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాటాడుతూ.. రాష్ట్రంలో 13 జిలాలకు చెందిన 8వేల మంది యువత ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్లు తెలిపారు.

News August 6, 2024

విశాఖ: ఆన్‌లైన్ క్విజ్.. ప్రైజ్‌మనీ రూ.40వేలు

image

ఏయూ అంబేడ్కర్ ఛైర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ఆన్‌లైన్ క్విజ్ 12న, రాత పరీక్ష 13న, ఫైనల్ పోటీలు 14న నిర్వహిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, 2వ బహుమతిగా రూ.10వేలు, 3వ బహుమతిగా రూ.5వేల నగదుతో పాటు ట్రోఫీ ఇస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోగా 97000 66832 నంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

News August 6, 2024

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుపై సర్వే

image

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుపై జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బృందం విస్తృతంగా సర్వే నిర్వహించింది. ఢిల్లీ నుంచి వచ్చిన జియోలాజికల్‌ సర్వే బృందం స్థానిక ఎస్ఈ చంద్రశేఖరరెడ్డితో కలిసి తొమ్మిది ప్రాంతాలను సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యాప్‌కోస్‌ సంస్థ తయారు చేసిన డీపీఆర్‌ ఆధారంగా పరిశీలన చేసింది. జీఎస్‌ఐ సభ్యులకు ప్రాజెక్టు గురించి ఎస్ఈ చంద్రశేఖరరెడ్డి వివరించారు

News August 6, 2024

విశాఖ వైసీపీ నాయకులతో సుబ్బారెడ్డి భేటీ

image

విశాఖ వైసీపీ నాయకులతో ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. విశాఖలో జరిగిన భేటీలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 10 స్థాయి సంఘాలను వైసీపీ కైవసం చేసుకునే విధంగా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News August 6, 2024

ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేయాలి: విశాఖ కలెక్టర్

image

ఈ నెల 30న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశమై మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ కోడ్) పటిష్టంగా అమలు చేయాలన్నారు. చెక్ పోస్టులను పెట్టి తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.

News August 6, 2024

విశాఖ: రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో కోర్బా రైలులో జరిగిన అగ్ని ప్రమాదంపై తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం విశాఖ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బృందంలో నిపుణులు రైల్వే స్టేషన్‌తో పాటు అగ్నిప్రమాదంలో దగ్దమైన బీ7 భోగి, పాక్షికంగా కాలిన బీ6 భోగిని పరిశీలించారు. దర్యాప్తులో పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్న బృందం అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతుంది.

News August 6, 2024

విశాఖలో గర్భం దాల్చిన బీ.టెక్ విద్యార్థిని

image

విశాఖలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన కలకలం రేపింది. విద్యార్థిని గ్రామానికి చెందిన ఓ యువకుడు నగరంలో బీ.టెక్ చదువుతున్నాడు. వీరిద్దరూ చనువుగా ఉండేవారు. ఈ క్రమంలో విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. గర్భంలో మృత శిశువును వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి మృతశిశువును బయటకు తీశారు.

News August 6, 2024

బ్యాలెట్ పద్ధతిలో విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తరువాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు.

News August 6, 2024

విశాఖ: ఓటర్లుగా చేరేందుకు మరో ముగ్గురు దరఖాస్తు

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు కల్పించాలని మరో ముగ్గురు దరఖాస్తు చేశారు. జీవీఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నందున తమకు ఓటు హక్కు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు గొల్ల బాబురావు, నిరంజన్ రెడ్డి అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. వీరి దరఖాస్తులను అధికారులు పరిశీలించి ఓటు హక్కు కల్పించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.