India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ముఖ్య అధికారులు, బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.
గాజువాక సమీపంలో గల కాపు జగ్గరాజుపేట STBL వసుంధర గార్డెన్స్లో చోరీ జరిగింది. ఉమ అనే మహిళ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వసుంధర గార్డెన్స్లో నివాసం ఉంటున్న ఉమ తన తల్లిని చూసేందుకు వెళ్లి రాత్రి అక్కడే ఉండిపోయింది. బుధవారం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులకొట్టి ఉన్నాయని, సుమారు 75 తులాలు బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ జరిగేలా రుషికొండ బీచ్లో యుద్ధప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన రుషికొండ బీచ్ను సందర్శించారు. పరిశసరాల్లో కలియతిరిగిన ఆయన అక్కడ పరిస్థితులను గమణించారు. పర్యాటకుల వాహనాల పార్కింగ్ పరిశీలించారు. దుకాణాల సముదాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో విశాఖలో గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణలకు వేలం నిర్వహించనున్నారు. మార్చి 6న ఉడా చిల్డ్రన్ ఏరినాలో ఉదయం 9 గంటలకు వేలం జరగనుంది. అయితే ఫిబ్రవరి 11న వేలం నిర్వహించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో వాయిదా వేశారు. జిల్లాలో 14 మద్యం దుకాణలకు గాను 316 దరఖాస్తులు వచ్చాయని గతంలో అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కొమ్మాదిలోని దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుపై విశాఖ జేసీ మాయూర్ అశోక్ సమీక్షించారు. ఈ మేరకు కొమ్మాది ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న స్థలాన్ని బుధవారం పరిశీలించారు. 22 ఎకరాల్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మూడు నెలల్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయనతో పాటు విశాఖ రూరల్ తహశీల్దార్ కిరణ్ పాల్ తదితులు ఉన్నారు.
విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో ఆరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక తేదీ ప్రకటిస్తామన్నా. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలూ మద్దతు ఇవ్వాలని కోరారు.
తాటిచెట్లపాలెం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన యాక్సిడెంట్లో మృతుల వివరాలను కంచరపాలెం ట్రాఫిక్ సీఐ దాశరథి తెలిపారు. మృతుల్లో ఒకరు కంచరపాలేనికి చెందిన యళ్వంత్గా గుర్తించామన్నారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. వీరిద్దరూ వాడపేట పండక్కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. గాజువాక నుంచి భోగాపురం వయా మద్దిలపాలెం, మధురవాడ మీదుగా 34.6 కి.మీ మేర <<15657173>>మెట్రో నిర్మాణానికి <<>>ప్రతిపాదనలకు కేంద్రానికి పంపామన్నారు. పనులు ప్రారంభమయ్యాక నాలుగేళ్లలో పూర్తవుతుందన్నారు. ఏహెచ్ 45 నుంచి ఎన్హెచ్ 16 వరకు 6 రోడ్లు ప్లాన్ చేశామన్నారు. వీటిని ఏడాదిన్నరలోపు ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
కోనెంపాలెంకు చెందిన బండారు ప్రవల్లిక భీమిలి మండలం గొల్లలపాలెం KGBVలో 10వ తరగతి చదువుతుంది. ఈమె చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ఫోసిస్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారంలో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్స్,ఏఐ వంటి వివిధ సర్టిఫికెట్ కోర్సులు చేసిందని ప్రిన్సిపల్ గంగాకుమారి తెలిపారు. ఛైర్మన్ చందపరపు కుమార్, ఇతర సిబ్బంది చిన్నారిని అభినందించారు.
విశాఖలోని తాటిచెట్లపాలెం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంచరపాలెం స్టేషన్ పరిధిలోని బైక్పై అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.