Visakhapatnam

News April 4, 2025

కూర్మన్నపాలెంలో 100 కేజీల గంజాయి పట్టివేత

image

గాజువాక సమీపంలో గల కూర్మన్నపాలెం వద్ద అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులో ఐదుగురు వ్యక్తులు హైదరాబాద్ తరలించేందుకు 44 బ్యాగుల్లో సిద్ధంగా ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ చెందిన నలుగురు ముఠా పరారు కాగా.. భగత్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు దువ్వాడ పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి 100 కేజీల వరకు పోలీసులు వెల్లడించారు.

News April 4, 2025

కంచరపాలెంలో వివాహిత ఆత్మహత్య

image

విశాఖలో వివాహిత దేవి గురువారం ఆత్మహత్య చేసుకుంది.  చీకటి దేవి(30)కి  8 ఏళ్ల క్రితం విడాకులు తీసుకొని ముగ్గురు పిల్లలతో కంచరపాలెంలో తన తల్లి దగ్గరే ఉండేది. ఏడాది క్రితం కలహాల కారణంగా పిల్లలను తల్లి దగ్గరే వదిలి తను వేరేగా ఉంటోంది. ఆ ప్రాంతంలోనే ఓ షాపులో పనిచేస్తూ దేవి రసాయనాలు తాగి స్పృహ కోల్పోయింది. కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News April 4, 2025

విశాఖ: 20 బైక్‌లు సీజ్

image

విశాఖలో ట్రాఫిక్ పోలీసులు 20 బైక్‌లను సీజ్ చేశారు. ఇన్‌ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు NAD, మద్దిలపాలెం ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టారు. వాహనం నడిపేవారు, వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా మొదటిసారి దొరికిన వారి లైసెన్స్ 3 నెలలు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రెండోసారి దొరికిన వారి వాహనాలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

News April 4, 2025

వీఎంఆర్డీఏలో 113 మందికి ప్లాట్ల కేటాయింపు

image

V.M.R.D.A. అధికారులు ఎంఐజి లే అవుట్లోని ప్లాట్లకు గురువారం డ్రా నిర్వహించారు. అడ్డూరు, గరివిడి, పాలవలసల్లో 113 మందికి ఈ-లాటరీలో ప్లాట్లు కేటాయించారు. అడ్డూరులో 146, గరివిడిలో 212, పాలవలసలో 472 ప్లాట్లను V.M.R.D.A. అభివృద్ధి చేసింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ల ధరలో 20 శాతం రాయితీ ఇస్తున్నారు.

News April 3, 2025

పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైలు: విశాఖ సీపీ

image

విశాఖ నగర పరిధిలో స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సీపీ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. పొగాకు వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది 48వేల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రోజుకి 250 మంది పిల్లలు పొగాకు వాడుతున్నారన్నారు. పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైళ్ళు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు.

News April 3, 2025

రికార్డు సృష్టించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసిందని జనరల్ మేజేజర్ పరమేశ్వర్ ఫంక్వాలా తెలిపారు. 259.254 మిలియన్ల టన్నుల సరకు రవాణ చేసి కొత్త బెంచ్‌మార్క్‌ను దాటిందని వెల్లడించారు. గతంలో ఉన్న 259 మిలియన్ల టన్నుల మార్కుని దాటిని దేశంలోని మొదటి రైల్వే జోన్‌గా ECoR అవతరించిందని పేర్కొన్నారు. 

News April 3, 2025

బ్యాంకు ప్రతినిధులతో విశాఖ కలెక్టర్ సమావేశం

image

స్వ‌యం ఉపాధి పొందాల‌నుకునే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు బ్యాంకులు పూర్తి స‌హ‌కారం అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. ప‌లువురు బ్యాంకు ప్ర‌తినిధుల‌తో గురువారం క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో సమావేశం అయ్యారు. రుణాల మంజూరులో సుల‌భ‌త‌ర విధానాలు పాటిస్తూ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. స్వ‌యం ఉపాధి పొందాల‌నుకునే వారికి త‌గిన విధంగా అండ‌గా నిల‌వాల‌న్నారు.

News April 3, 2025

బాధ్యతలు చేపట్టిన విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు

image

విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన వారు గురువారం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడిగా విజయం సాధించిన ఎమ్.కె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చింతపల్లి ఆనంద్ కుమార్, జనరల్ సెక్రటరీగా పార్వతి నాయుడు, కోశాధికారిగా శ్రీదివ్యష్ భాద్యతలు చేపట్టారు. బార్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. విజయం సాధించిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. 

News April 3, 2025

మారికవలసలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మధురవాడలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన బలగ ప్రభాకర్ (50) మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. మారికవలస నేషనల్ హైవేపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక సీటులో కూర్చున్న ప్రభాకర్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

News April 3, 2025

గాజువాకలో యాక్సిడెంట్

image

గాజువాకలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన లావేటి క్రాంతి కుమార్, శ్రీహరిపురానికి చెందిన వాసవి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. గురువారం ఉదయం డ్యూటీ ముగించుకొని రుషికొండ నుంచి గాజవాక వస్తుండగా షీలా నగర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.